Trending News
Friday, July 11, 2025
32.8 C
Hyderabad
Trending News

ఎన్డీఎ పక్షాలకు పరిపాలనలో భాగస్వామ్యమేది!?|EDITORIAL

పేరుకే జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్‌డిఎ). పరిపాలన మొత్తం ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీదే. ఇంకా చెప్పాలంటే మోడీదే. వరుసగా మూడోసారి మోడీ ప్రధాని కావడానికి కారణమైన ఎన్‌డిఎ పక్షాల పాత్ర పరిమితంగానే కనిపిస్తోంది. విధానపరమైన నిర్ణయాలలో, పరిపాలనలో ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలకు పెద్దగా భాగస్వామ్యం ఉన్నట్లుగా లేదు. సమిష్టి నిర్ణయాలు, ఆలోచనలు లేవు. గతంలో వాజ్‌పేయి హయాంలో తరచూ ప్రధాన అంశాలపై చర్చించేవారు. ఇప్పుడా పరిస్థితులు లేవు. ఎన్‌డిఎ పక్షాలు కూడా ఇదేమిటని అడిగే ధైర్యం చేయడం లేదు. చంద్రబాబు లౌక్యంగా ఏపీకి, నితీశ్‌ కుమార్‌ బీహార్‌కు పరిమితం అయ్యారు. వారి రాష్ట్రాలకు నిధులు సమకూర్చుకోవడంలో ఉన్న ఆసక్తి, ప్రజల సంక్షేమంపై మాత్రం లేదు. వ్యవసాయ జాతీయ విధానం వంటి అంశాలను పట్టించుకోవడం లేదు.

విద్య, వైద్యం, మౌళిక వసతులు, రోడ్లు తదితర అంశాల పై జాతీయస్థాయిలో చర్చించి ప్రజలకు అనువైన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు కేవలం డవ్మిూ పాత్ర పోషిస్తున్నాయి. విద్యారంగంలో మార్పులు రావాల్సి ఉంది. ఇప్పుడున్న విద్యావిధానం ఉద్యోగాలను, ఉపాధిని చూపడం లేదు. విదేశాలకు వెళ్లి చదువుకుందామనుకుంటే ఖరీదైనదిగా ఆమరింది. విద్యారంగ సంస్కరణలు రావాలి. విదేశాలకు వెళ్లి చదువుకునే వారికి ఇతోధికంగా రుణాలు ఇవ్వాలి. పెరిగిన డాలర్‌ విలువ, రూపాయి పతనంతో విదేశీ మారకం కోసం విద్యార్థులు, టూరిస్టులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటున్న ప్రధాని మోడీ కనీసం ఆడపిల్లల చదువుల ఖర్చుల గురించి ఆలోచించడం లేదు.

దేశీయంగా, విదేశీయంగా కూడా చదువులు భారంగా మారాయి. విదేశాలకు వెళుతున్న ఆడపిల్లలకు కనీసం వడ్డీ మాఫీ పథకం వర్తింప చేయాలన్న డిమాండ్‌ పట్టించు కోవడం లేదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో వడ్డీలేని రుణాలను లేదా నామమాత్రం వడ్డీతో దేశీయంగా, విదేశాల్లో ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించేలా పథకాలు రూపొందాల్సి ఉంది. కార్పోరేట్‌ కంపెనీలకు వేలకోట్లు పందేరం చేస్తున్న ప్రభుత్వం విద్యారంగంలో మాత్రం వెసలుబాటు చూపడం లేదు. బ్యాంకులు కూడా రకరకాల కొర్రీల గ్యారెంటీతోనే వడ్డీ రుణాలు అందిస్తున్నాయి.

మరోవైపు భారత ఆర్థికవ్యవస్థ కుదేలు కావడంతో పాటు, ద్రవ్యోల్బణం పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు అందనంత ఎత్తున ఉన్నాయి. వైద్య సేవలు భరించలేనంత భారంగా పెరిగాయి. కార్పోరేట్‌ ఆస్పత్రుల దోపిడీతో సామాన్యులు అప్పుల పాలవుతున్నారు. మందుల ధరలు విపరీతంగా పెంచేస్తున్నా పట్టించుకోవడం లేదు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు కూడా ఎప్పటికప్పుడు పెంచడంతో సామాన్యుల బతుకు భారంగా మారుతోంది. పన్నుల భారం మోయలేక ప్రజల నడ్డి విరుగుతున్నది. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆర్థికరంగాన్ని నిలబెట్టేలా లేవు. ఎడాపెడా పన్నులు విధించడంతో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఊపిరాడని స్థితికి చేరింది.

ఇదంతా ఒక ఎత్తయితే విదేశీ డాలర్‌ మారకం తీరని భారంగా మారింది. ఉన్నత చదువులకు వెళ్లాల నుకునే వారికి డాలర్‌ మారకం 86 రూపాయలకు పైనే కావడంతో తట్టుకోలేక పోతున్నారు. ఫీజులను డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఫీజల భారం తడిసి మోపెడు అవుతోంది. డబ్బున్నవాళ్లే చదువుకునేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. పేదలు, మధ్య తరగతి వాళ్లు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విదేశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితితులు కానరావడం లేదు.

ఇలాంటి సమస్యలను ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు చర్చించాలి. ఇక్కడ ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ పూర్తి చేసి, ఇతర డిగ్రీలతో విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్ళకి ప్రధానంగా రెండు సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకటి రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. బ్యాంకులు సజావుగా స్పందించడం లేదు. డబ్బున్న వారికి రుణాలు అందుతున్నాయి. కానీ పేదలు, మధ్య తరగతి వారికి రుణాలు ఇవ్వడం లేదు. రెండోది రుణం పొందినా.. దాని వడ్డీ రేటు అధికంగా ఉంటోంది. విదేశాలకు వెళ్లి, చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం సంపాదించి వచ్చే సరికి రుణభారం మోయలేనంతగా పెరుగుతోంది. దీంతో సంపాదన అంతా చదువుకోసం తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లించడానికే సరిపోతుంది. దీనికి తోడు విదేశీయానం కూడా భారంగా మారింది. ఇంధన ధరల వల్ల విమానరంగం టిక్కెట్లను అమాంతంగా పెంచేసింది. దీంతో అమెరికా తదితర దేశాలకు వెళ్లాలనుకున్న వారికి టిక్కెట్లు భారంగా మారాయి.

విదేశీ విద్య కావచ్చు, దేశీయంగా చదువుకునే విద్య కావచ్చు..సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు స్వశక్తివిూద బతికేలా చేయాలి. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రుణాలను ఉదరాంగా ఇచ్చేలా చూడాలి. అప్పుడే మన యువత తమకాళ్లవిూద తాము నిలబడగలుగుతారు. దేశీయంగా ఉన్నత చదువులు చదివే వారికి, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లేవారి కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాలి. బ్యాంకులు నామమాత్రపు గ్యారెంటీతో, నామమాత్రపు వడ్డీతో రుణాలు ఇచ్చేలా విధానాలు సరళీకరించాలి. అందుకు కేద్రం వడ్డీ భరించే పథకాన్ని ప్రవేశ పెడితే మరీ మంచిది. ఇలాంటి సమస్యలపై చర్చించే ధైర్యం ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు చేయకపోవడం దారుణం.

Latest News

FARM HOUSE|‘వ్యవసాయ క్షేత్రం’ రణ క్షేత్రం కాబోతోందా!?

సంచలనమైన CM|సీఎం REVANTH REDDY|రేవంత్ రెడ్డి CHALLENGE|సవాల్! సీఎం ఛాలెంజ్ కు KCR|కేసీఆర్ FAMILY|ఫ్యామిలీ జవాబేంటి? రేవంత్ అన్నంత పనీ చేస్తారా? MINISTERS|మంత్రులను పంపుతారా? లేక తనే వెళతారా? ఫాం హౌస్ పంచాయతీ పరాకాష్టకు... ఆ పరిస్థితి వస్తుందా?.. వస్తే...

ప్రపంచ జనాభాలో మనమే నెంబర్ వన్!|EDITORIAL

ప్రపంచ జనాభా ఇప్పటికే 800 కోట్లు దాటింది. భారతదేశ జనాభా అధికారికంగా 146కోట్లకు చేరుకుంది. చైనా పకడ్బందీ జనాభా నియంత్రణతో 2వ స్థానానికి చేరుకుంది. 1987 జూలై 11న ప్రపంచ జనాభా ఐదు...

శుక్రవారం జూలై 11–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి రాత్రి 01.52 వరకు ఉపరి విదియ నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 06.18 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వైదృతి రాత్రి 08.21 వరకు ఉపరి విష్కంభ కరణం బాలవ పగలు 03.44...

పురుగుల మందే రైతుకు పెరుగన్నమాయెనా!|EDITORIAL

ఎద్దు ఏడ్చిన ఎవుసం... రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. అందరికీ అన్నం పెట్టే రైతు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు? ఆరుగాలం కష్టపడే రైతు అంతకు ఎందుకు తెగిస్తున్నాడు? ప్రక్రుతి వైపరీత్యాలకు,...

గురువారం జూలై 10–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం గురు పూర్ణిమ తిధి శు.పౌర్ణమి రాత్రి 01.36 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పూర్వాషాఢ పూర్తిగా యోగం ఐంద్ర రాత్రి 09.02 వరకు ఉపరి వైదృతి కరణం భద్ర పగలు 03.16 వరకు ఉపరి బాలవ వర్జ్యం...

బుధవారం జూలై 09–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం గురు మౌఢ్య నివృత్తి తిధి శు.చతుర్దశి రాత్రి 12.50 వరకు నక్షత్రం మూల తెల్ల 05 01 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం బ్రహ్మ రాత్రి 08.24 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి...

ఊహించని కలయిక!|PALLA RAJESHWAR REDDY| KOMMURI PRATHAP REDDY

PALLA| పల్లాను కలిసి KOMMURI| కొమ్మూరి పరామర్శ JANGAON| జనగామ POLITICS| రాజకీయాల్లో విమర్శ జనగామ నియోజకవర్గ రాజకీయాల్లో ఒక ఊహించని కలయిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యే స్థానానికి...

‘వృక్షో రక్షతి రక్షితః!’|EDITORIAL

ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకం లోనిది. జన ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం అర్ధం ‘ధర్మాన్ని మనము అనుసరిస్తే ఆ...

మీ‘మాంసం’!?|BJP|KONDA VISHWESHWAR REDDY

మాంసాహారులకు బీజేపీలో స్థానం లేదా!? అలా అయితే PARTY| పార్టీ ఎలా బలపడుతుంది? పైన MODI| మోడీ, ఇక్కడ నేను గెలిస్తే ఏం లాభం? రాజకీయ పార్టీగా బీజేపీది బలమైన స్థానం స్వార్థానికి వాడుకునే వాళ్లతోనే బలహీనం...

మంగళవారం జూలై 08–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిధి శు.త్రయోదశి రాత్రి 11.39 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 03.11 వరకు ఉపరి మూల యోగం శుక్ల రాత్రి 08.48 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ పగలు...

Greenary| పచ్చదనం, Women empowerment| మహిళా సాధికారత మా telangana government| ప్రభుత్వ బాధ్యత

వన మహోత్సవం–2025 ప్రారంభోత్సవంలో CM|సీఎం Revanth Reddy| రేవంత్ రెడ్డి Rangareddy District| రంగారెడ్డి జిల్లా, rajendranagar|రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో|university వన మహోత్సవం–2025ను రుద్రాక్ష మొక్క నాటి ముఖ్యమంత్రి...

Bjp Party|స్వంత పార్టీపై MP|ఎంపీ Konda Vishweshwar Reddy|కొండా సంచలన వ్యాఖ్యలు| Sensational Comments

Vikarabad| వికారాబాద్ District|జిల్లాలో BJP|బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. కార్యకర్తల్ని ఉద్దేశించి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News