Trending News
Friday, July 4, 2025
32.3 C
Hyderabad
Trending News

AMITH SHAH|అమిత్ జీ… అంతొద్దు!

షా మాటలు DEMOCRACY| ప్రజాస్వామ్యంపై తూటాలు
TELANGANA|  తెలంగాణలో GUN DOWN| కాల్పుల విరమణ ప్రకటించాలి
PEACE| శాంతి చర్చలకు GOVERNMENT| ప్రభుత్వాలు సిద్ధం కావాలి
RELEASE| విడుదల చేసిన LETTER| లేఖలో MAOIST CENTRAL COMMITTEE| మావోయిస్టు కేంద్ర కమిటీ డిమాండ్

హైదరాబాద్, జులై 3 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలను భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్‌తోనైనా చర్చలు జరుపుతామని చెప్పే ప్రభుత్వం, దేశీయ ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న మావోయిస్టులతో మాత్రం చర్చలకు సిద్ధంగా లేదనడం అన్యాయమన్నారు. అలాగే తెలంగాణలో కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జూన్ 29న నిజామాబాద్‌లో జరిగిన కిసాన్ సమ్మేళనంలో అమిత్ షా చేసిన మావోయిస్టులు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదన్నది, 2026 మార్చి 31 కల్లా నక్సలిజాన్ని తుదముట్టిస్తామని చెప్పడం ప్రజాస్వామ్యంపై దాడిగా అభయ్ పేర్కొన్నారు. మావోయిస్టులు నాలుగు దశాబ్దాలుగా ప్రజల కోసం త్యాగాలు చేస్తూ వస్తున్నారని, వారికి, బలగాలతో కలసి చర్చలు జరిపేందుకు మానవీయమైన దృష్టితో చూడాలని చెప్పారు.

మావోయిస్టు పార్టీ ఇప్పటికే చర్చలకు సిద్ధంగా ఉన్నదని, మార్చి 28న తెలంగాణలో భద్రతా బలగాలను క్యాంపులకు పరిమితం చేయాలని, కొత్త క్యాంపుల నిర్మాణం నిలిపివేయాలని కోరుతూ కాల్పుల విరమణ ప్రకటించామని గుర్తు చేశారు. అయినప్పటికీ, కేంద్ర బలగాలు దాడులు ఆపడం లేదన్నారు. కాల్పుల విరమణ చేసినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో 85 మందికి పైగా మావోయిస్టులను ఎన్కౌంటర్(హత్య) చేశారని, అందులో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బసవరాజు సహా పలువురు నేతలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇది కేవలం మావోయిస్టులను మట్టుబెట్టే ప్రయత్నం మాత్రమే కాదని, వేలాది ఆదివాసీల భూములను లాక్కొనే కుట్ర కూడా అని అభయ్ ఆరోపించారు. గడ్చిరోలీలో లక్షకు పైగా చెట్లు నరికి కార్పొరేట్ లాభాల కోసం అడవులను ధ్వంసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిజస్వరూపం బయటపడిందన్నారు.

ఇకపోతే దేశవ్యాప్తంగా మేధావులు, హక్కుల కార్యకర్తలు, శాంతి ప్రేమికులు చర్చలకు మద్దతుగా ఉద్యమాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ శాంతి చర్చల కమిటీ నేతలు జస్టిస్ చంద్రకుమార్, ప్రొ. హరగోపాల్ ముఖ్యమంత్రిని కలసి చర్చల మార్గాన్ని సూచించినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించలేదన్నారు. కేంద్రాన్ని డిమాండ్ చేయాలంటే రాష్ట్రమే ముందుగా ఆ వాతావరణం సృష్టించాలి అని సూచించారు. అమిత్ షా ప్రకటనలను ఖండించిన కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను అభయ్ స్వాగతించారు. మావోయిస్టులు కూడా భారత పౌరులేనని, వారితో చర్చల కోసం ముందుకు రావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు శాంతి చర్చలకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలని కోరారు.

ఆదివాసీల హక్కులు, వారి భూములు, అడవులను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని, వామపక్షాలు, ప్రజాసంఘాలు, మానవ హక్కుల సంస్థలు కలసి ఉద్యమాన్ని కొనసాగించాలని అభయ్ పిలుపునిచ్చారు.

Latest News

పరి‘శ్రమ’ల్లో కార్మికుల భద్రత ఎక్కడ!?|EDITORIAL

పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలు ప్రజల్ని కలవర పెడుతున్నాయి. ఒకవైపు పరిశ్రమలకు అపార నష్టం జరుగుతోంది. ఆ నష్టాలను బీమాతో పరిశ్రమలు పూడ్చుకోగలుగుతున్నాయి. కానీ, కార్మికుల మరణాలు అత్యంత దయనీయంగా ఉంటున్నాయి. కార్మికుల...

ఇక చాలు!?|STOP

ISSUES| వి‘వాదా’లను వదిలేయండి PANCHAYAT| పంచాయితీలు పక్కన పెట్టండి పంచాయతీలపై దృష్టి పెట్టండి మీ SERVICES| సేవలు పార్టీకి అవసరం PARTY| పార్టీ కోసమే పని చేయండి LOCAL| ‘స్థానికం’గా సత్తా చాటాలి KONDA| కొండా దంపతులకు MEENAKSHI| మీనాక్షి హితవు పార్టీకి...

శుక్రవారం జూలై 04–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిధి శు.నవమి సాయంత్రం 04.14 వరకు ఉపరి దశమి నక్షత్రం చిత్త సాయంత్రం 05.16 వరకు ఉపరి స్వాతి యోగం శివ రాత్రి 06.54 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 11.28...

KONDA|కొండా వర్సెస్ ఎర్రబెల్లి|ERRABELLI

ఒక్క దెబ్బకు మూడు పిట్టలు! మలుపులు తిరుగుతున్న 'కొండా' దారులు!? ట్విస్టుల మీద ట్విస్టులు హైదరాబాద్, జులై 2 (అడుగు ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర అటవీ దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యవహారం పార్టీ లోపలా, బయటా...

సేమ్ టు సేమ్..! షేమ్ టు షేమ్!!|EDITORIAL

మహ్మద్ బిన్ తుగ్లక్ చాలా తెలివైన వాడని చరిత్ర చెబుతోంది. మధ్యయుగంలో ప్రగాఢముద్రవేయగలిగిన వ్యక్తిత్వాన్ని కలిగి వున్నాడు. దూరదృష్టి, ఆలోచనాపరుడు, రాబోయే యుగాలు, తరాల గూర్చి ఆలోచించగలిగే శక్తినీ గలిగినవాడు. అని ప్రతీతి....

KONDA|కొండాపై ELECTION COMMISSION|ఎన్నికల కమిషన్‌కు BJP|బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్‌, జూలై 2(అడుగు న్యూస్): MINISTER| మంత్రి KONDA SUREKHA| కొండా సురేఖ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు AFFIDAVIT| అఫిడవిట్‌ను సమర్పించారని ఆరోపిస్తూ, ఆమె శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ...

వాళ్ళు ఎర్రబల్లులే|ERRABELLI|KONDA

వరంగల్, జూలై 2(అడుగు న్యూస్): WARANGAL| ఓరుగల్లు POLITICS| రాజకీయాల్లో ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టినవారు ఎవరైనా సరే వాళ్ళు ఎర్రబల్లులేనని EX MLC| మాజీ ఎమ్మెల్సీ KONDA MURALIDHAR RAO| కొండా మురళీధర్...

గురువారం జూలై 03–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిధి శు.అష్టమి పగలు 02.31 వరకు ఉపరి నవమి నక్షత్రం హస్త పగలు 02.54 వరకు ఉపరి చిత్త యోగం పరిఘ రాత్రి 06.28 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 04.25...

Covid Vaccine| కోవిడ్ టీకాలు– Heart issues|గుండెసంబంధిత సమస్యలకు సంబంధం లేదన్న కేంద్రం|central government

కోవిడ్ టీకాలు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, హార్ట్‌ అటాక్‌లు వస్తాయన్న వాదనలను కేంద్రం తిప్పికొట్టింది. దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 47 ప్రముఖ ఆసుపత్రుల్లో జరిగిన...

Dalailama| దలైలామా hereditary| వారసత్వంపై స్పష్టత

Gaden fundrag trust| గదెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకే అధికారమని వెల్లడి తాను death| మరణించిన తర్వాత కూడా తన వారసుడు ఉండబోతున్నారని, ఆయన గుర్తింపు హక్కు పూర్తి స్థాయిలో గదెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకే ఉందని...

Five Countries| ఐదు దేశాల్లో Prime Minister| ప్రధాని Narendra Modi| మోదీ పర్యటన

Today| నేటి నుంచి 9వ తేదీ వరకు విదేశీ యాత్ర| foreign tour ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి జూలై 9వ తేదీ వరకు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఘనా, ట్రినిడాడ్,...

January|జనవరి 28 నుంచి MEDARAM|మేడారం మహా జాతర|MAHA JATARA

ASIA| ఆసియాలోనే అతిపెద్ద TRIBAL JATHARA| గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం SAMMAKKA - SARLAMMA| సమ్మక్క–సారలమ్మ మహా జాతర తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది 2026లో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News