ASIA| ఆసియాలోనే అతిపెద్ద TRIBAL JATHARA| గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం SAMMAKKA – SARLAMMA| సమ్మక్క–సారలమ్మ మహా జాతర తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది 2026లో జనవరి 28 నుంచి 31 వరకు ఈ జాతర ఘనంగా జరగనున్నట్లు ప్రకటించారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో సమ్మక్క సారలమ్మలు వెలసిన మేడారంలో జరిగే ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై చేరుకుంటారు. అనంతరం 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు వచ్చుట. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. చివరి రోజున 31న సాయంత్రం ఆరు గంటలకు అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. జాతరను ప్రతీ రెండేళ్లకోసారి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయాలతో భారీ ఎత్తున నిర్వహిస్తారు. వనదేవతలుగా భావించే సమ్మక్క–సారలమ్మల జాతరకు కోట్లాది మంది భక్తులు హాజరవడం విశేషం.