Trending News
Tuesday, July 1, 2025
21 C
Hyderabad
Trending News

Unexpected|ఊహించని Two States| ఇరు రాష్ట్రాల President|అధ్యక్షుల ఎంపిక|Selection

New| నూతన Presidents| అధ్యక్షులతో BJP| బీజేపీకి కలిసొచ్చేనా…

Eatala Rajender| ఈటెలకు ఊహించని దెబ్బ అంటూ … ప్రచారం

Telangana| తెలంగాణ ఆధ్యక్షుడి ఎంపికలో AP CM| ఏపీ సీఎం MARK| మార్క్ ఉందంటూ… మరో ప్రచారం |CAMPAIGN

అధ్యక్షుల ఎంపికపై విరుచుకుపడ్డ mla| ఎమ్మెల్యే రాజా సింగ్ |Raja Singh

Andhrapradesh| ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల ఎంపికలో పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఊహించిన పేరులకు భిన్నంగా, ఆశించని, ఊహించని అభ్యర్థులను ఎంపిక చేస్తూ నాయకత్వంలో కీలక మార్పులు చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్‌ను, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావును ఎంపిక చేసిన విధానం పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

ఏపీలో పీవీఎన్ మాధవ్ ఎంపికపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేసినా, ఆయనకు ఆరెస్సెస్‌తో బలమైన సంబంధాలు, పార్టీకి చేసిన సేవలు, రాజకీయ ప్రస్థానం, స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఈ ఎంపికకు బలమైన కారణాలు అని తెలుస్తుంది. మాధవ్ బీసీ వర్గానికి చెందినవారు, పార్టీ బలం పెరిగి, అన్ని వర్గాల వారికి బీజేపీ సమ న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఆయన తండ్రి పీవీ చలపతి రావు కూడా గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉండడం ఈ ఎంపికను మరింత బలపరిచింది. వైఎస్సార్‌సీపీ-టీడీపీ సమీకరణాల మధ్య బీజేపీని ఒక బలమైన పార్టీగా నిలిపేందుకు మాధవ్ లాంటి మృదువైన నేత అవసరమన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది.

తెలంగాణలో మరింత ఆసక్తికరంగా నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. ఈటల రాజేందర్, అరవింద్, డీకే అరుణ వంటి బలమైన నాయకుల్ని పక్కనపెట్టి సీనియర్ నేత రామచందర్ రావుకు అవకాశమివ్వడంపై పార్టీ వర్గాల్లో అనేక చర్చలు మొదలయ్యాయి. ఎబివిపి నుండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, బీజేపీకి ఎనలేని సేవలందించిన ఆయన ఎన్నో బాధ్యతల్ని నిర్వర్తించారు. మృదుస్వభావంతో, అందరినీ కలుపుకుపోయే లక్షణంతో రామచందర్ రావు ఎంపిక పై ఆర్ఎస్ఎస్ స్థాయిలో ఆమోదం పొందినట్లుగా తెలుస్తోంది. పార్టీ నైతిక విలువలపై ఆయనకు ఉన్న నిబద్ధత, కార్యకర్తలతో ఉన్న అనుబంధం, రాష్ట్ర రాజకీయాలపై లోతైన అవగాహన ఆయన ఎంపికకు కారణం అని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

ఏపీ సీఎం మార్క్ ఉందా?

అయితే ఈ ఎంపికపైమరో పెద్ద రాజకీయ అంశం చర్చనీయాంశమవుతోంది. రామచందర్ రావు ఎంపికపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ప్రభావం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీలో ఆయనకు సన్నిహితుడిగా పేరున్న రామచందర్ రావును ఎంపిక చేయడం వెనక చంద్రబాబు పాత్ర ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇది ఈటల రాజేందర్‌కు భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

అధ్యక్షుల ఎంపికపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రాజా సింగ్

ఈ విషయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిని నావాడు, నీవాడు అంటూ ఎవరి సలహాలో వింటూ నియమించుకుంటే పార్టీ దెబ్బతింటుందని హెచ్చరించారు. బీజేపీలో నాయకుడిని బూత్ స్థాయి నుంచి ముఖ్య నాయకుడి వరకు ఓటేసి ఎన్నుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం మాత్రం వ్యూహాత్మకంగా, అందరినీ సమన్వయపరచగల నేతలను ఎంపికచేసినట్లు సంకేతాలు పంపిస్తోంది.

https://youtu.be/Ijlzc2xlW3w?feature=shared

ఈ మార్పుతో బీజేపీలో కూడా మార్పు ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇది పార్టీకి కొత్త ఊపు ఇచ్చే అవకాశం అయినప్పటికీ, అసంతృప్తి వర్గాలను సర్దుబాటు చేస్తారా..లేదా… వివాదాలకు కారణం అవుతారా… అనేది భవిష్యత్ నిర్ణయించాల్సిందే.

Latest News

Water Rights|నీటి హక్కుల కోసం పోరాటం చేస్తాం

Praja Bhavan| ప్రజా భవన్‌ లో CM| సీఎం REVANTH REDDY| రేవంత్ రెడ్డి POWER POINT PRESENTATION| పవర్‌పాయింట్ ప్రసంగం HYDERABAD| హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి...

Bjp|బీజేపీ New Presidents|కొత్త అధ్యక్షుల బాధ్యతలు స్వీకరణ

Party|పార్టీ Future|భవిష్యత్తు లక్ష్యాలకు మార్గ నిర్దేశం నూతన అధ్యక్షులు Ramchandra rao| రాంచంద్రరావు, madhav| మాధవ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త అధ్యక్షుల నియామకం అనంతరం పార్టీ నేతల ప్రసంగాలు మార్గ నిర్దేశకంగా ఉన్నాయి....

Two Months|రెండు నెలల క్రితం Love Marriage|ప్రేమ వివాహం..

Sigachi|సిగాచీ Pharma|ఫార్మా Accident|ప్రమాదంలో Couple|దంపతులు Death|దుర్మరణం Sangareddy|సంగారెడ్డి District|జిల్లా Pashamailaram|పాశమైలారంలోని సిగాచీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం అనేక Families|కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సోమవారం ఉదయం చోటుచేసుకున్న రియాక్టర్‌ పేలుడు కారణంగా ఇప్పటివరకు...

బాధిత కుటుంబాలకు రూ. కోటి|1 crore పరిహారం

future| భవిష్యత్‌లో నివారణ చర్యలు Pasha Mailaram| పాశమైలారం విషాదం‌పై సీఎం రేవంత్ రెడ్డి | CM REVANTH REDDY SANGAREDDY| సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని...

KONDA FAMILY|కొండా చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

DISCPLINE|క్రమశిక్షణ కమిటీకే తప్పుడు నివేదిక! అన్ని పార్టీలు మారింది ఆ కుటుంబమే ‘కొండ’పై NAINI|నాయిని ఇంట్లో సుదీర్ఘంగా చర్చించిన CONGRESS|కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వరంగల్, మే 30 (అడుగు న్యూస్): కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తప్పుడు...

భస్మాసుర హస్తం!?|KONDA MURALI|WARANGAL

వివాదాల నుంచి మరిన్ని వివాదాల్లోకి... కోరి కష్టాలు తెచ్చుకుంటున్న KONDA| కొండా దంపతులు HAND| చే’జేతులా చెడగొట్టుకుంటున్న రాజకీయ జీవితాలు ఆమొన్న డబ్బులు తీసుకుంటారంటూ MINISTERS| మంత్రులపై వ్యాఖ్యలు మొన్న MLA| ఎమ్మెల్యేల రాజీనామాలకు హెచ్చరికలు నిన్న పార్టీ నేతలపై...

DOCTORS|వైద్యులు ప్రత్యక్ష దైవాలు!|EDITORIAL

ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన మన దేశంలో ‘డాక్టర్స్ డే’ జరుపుకుంటున్నాం. ఇది వృత్తిపరంగా వైద్యుల సేవలను స్మరించుకోవడమే గాకుండా, అత్యున్నత సేవలందించే వైద్యులకు కృతజ్ఞత తెలియజేసే అరుదైన సందర్భం కూడా....

మంగళవారం జూలై 01–2025| RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం కుమార షష్ఠి తిధి శు.షష్ఠి పగలు 12.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం పుబ్బ ఉదయం 11.13 వరకు ఉపరి ఉత్తర యోగం వ్యతీపాత రాత్రి 06.17 వరకు ఉపరి వరీయాన్ కరణం తైతుల పగలు...

Bjp| బీజేపీ bc| బీసీలకు opposite| వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది: minister| మంత్రి పొన్నం ప్రభాకర్|ponnam prabhakar

బీజేపీ మరోసారి బీసీ లకు అన్యాయం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ముగ్గురు బీసీ ఎంపీలు, సీనియర్ నేతలు ఉన్నప్పటికీ, వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదన్నారు. బీసీ నాయకుడి నామినేషన్‌ను...

మీకో దండం మీ పార్టీకో దండం

Bjp| బీజేపీకి Ghoshamahal| గోషామహల్ mla| ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా |resignation Leaders| నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి, Hinduism| హిందుత్వానికి తాను అంకితమంటూ లేఖ | letter గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మూడు...

SANGAREDDY|సంగారెడ్డిలో ఘోర రసాయన ప్రమాదం|CHEMICAL ACCIDENT

10 MEMBERS DEATH| 10 మంది దుర్మరణం, పలువురి పరిస్థితి విషమం ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మున్సిపాలిటీలోని పాశమైలారంలో ఉన్న సీగాచి కెమికల్స్‌ పరిశ్రమలో సోమవారం ఉదయం...

సోమవారం జూన్ 30–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం స్కంధ పంచమి తిధి శు.పంచమి ఉదయం 11.39 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం మఖ ఉదయం 10.02 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది రాత్రి 06.42 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ పగలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News