తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
BRS|బిఆర్ఎస్ WORKING PRESIDENT|వర్కింగ్ ప్రెసిడెంట్ KTR|కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మరోసారి కాంగ్రెస్ నేతలపై విమర్శలతో TWITTER|ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. KCR|కేసీఆర్ జీవితం ప్రజాస్వామ్య పోరాటానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొంటూ, ఆయన సాధించిన విజయాలను కాంగ్రెస్ నేతలు అర్థం చేసుకోవడం అసాధ్యమని అన్నారు. కేసీఆర్ 60 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు చేయలేని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రజల కోసం చేశారు. ఆయన ఉద్యమం లక్షల మందికి ప్రేరణగా నిలిచింది. స్వరాష్ట్ర ఆశయాన్ని నెరవేర్చారు అని కేటీఆర్ చెప్పారు.
ఇక KALESHWARAM|కాలేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడిన కేటీఆర్, అది కేవలం ఒక నీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, అది లక్షల మంది రైతుల భవిష్యత్తుకు ఆధారం అని అన్నారు. కాంగ్రెస్ నేతలను జోకర్ నాయకులు అని వ్యాఖ్యానించిన కేటీఆర్, వారు వంద జన్మలు తీసుకున్నా, కేసీఆర్ సాధించిన విజయం పదవంతు కూడా సాధించలేరు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడి జీవిత దృక్కోణం, ప్రజల కోసం చేసే త్యాగం, సంకల్ప బలాన్ని అర్థం చేసుకోవడానికి CONGRESS|కాంగ్రెస్ నేతలకు జీవితాంతం కూడా చాలదని అన్నారు.