Central| కేంద్ర Minister| మంత్రి కిషన్ రెడ్డిపై మండిపాటు
Telangana| తెలంగాణ రాజకీయాల్లో మరోసారి Bjp| బీజేపీ Mla| ఎమ్మెల్యే రాజాసింగ్ |Rajasingh సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే కొజ్జాగాల్ల కింద పని చేయలేను అంటూ చేసిన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారిన రాజాసింగ్, తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు.
నిన్న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో జరిగిన Governor| గవర్నర్ Bandaru Dattatreya| బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో Cm| ముఖ్యమంత్రి Revanth Reddy| రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ అభివృద్ధి వేగంగా ముందుకెళ్తుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. సీఎం సహాయం అడిగినా, చెవులు ఉన్నా వినలేరు, నోరున్నా మాట్లాడలేరు అంటూ ఆయన కిషన్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంలో, అలాంటి మహానుభావులను సహాయం కోరితే ఏం ఉపయోగం? అంటూ విమర్శలు చేశారు. కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ, ఆయన రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ లెక్కలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.