రాయపర్తిలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి దంపతులు
గత మూడు రోజులుగా రాయపర్తి మండల కేంద్రం లో గల జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాల ముగింపు వేడుకలకు పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్రెడ్డి దంపతులు ముఖ్య అతిథులు హాజరై గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ…. క్రీడలు మన శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక శక్తిని కూడా పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, సహనం, సామూహిక సమన్వయం వంటి విలువలను నేర్చుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నదని, గ్రామీణ స్థాయిలోనూ క్రీడా సౌకర్యాలను మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నదని వివరించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని రాష్ట్రం తరఫున జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్. ఐ శ్రావణ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్రీడా ప్రేమికులు, మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.