Trending News
Friday, June 13, 2025
31.3 C
Hyderabad
Trending News

యాక్ థూ…పాక్!

రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ రద్దు తరవాత కాశ్మీర్‌ అభివృద్ధి చెంది, పర్యాటకంగా పునరుత్తేజం పొందడాన్ని ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న పాక్‌ జీర్ణించుకోలేకపోతోంది. అందులో భాగమే పహల్గామ్ ఉగ్రదాడి. అయితే ఈ దాడిని ముందే పసిగట్టడంలో భద్రతాబలగాలు విఫలం అయ్యాయి. ఇదొక గుణపాఠంగా కాశ్మీర్‌ను రక్షించుకోవడం ఎలా అన్నదానిపై ద్రుష్టి సారించాలి. శ్రీలంకలో ఈలం అన్నది లేకుండా చేసిన విధంగానే ఇప్పుడు కాశ్మీర్‌ని మన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి. లెఫ్ట్‌ తీవ్రవాదం కన్నా ఇస్లామిక్‌ తీవ్రవాదం చాలా ప్రమాదకరంగా పరిణమించింది. మావోయిస్టులను ఏరివేసే పనిని పక్కన పెట్టి కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించే పనిని ముమ్మరం చేయాలి.

2008లో ముంబై దాడి తర్వాత సివిలియన్లపై జరిగిన రెండో అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతం పాకిస్థానీ తీవ్రవాదులకు ఇంకా నిలయంగానే ఉందని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తున్నది. తహావూర్‌ హుస్సేన్‌ రాణాను అమెరికా భారత్‌కు అప్పగించిన తర్వాత దేశంలో ఉగ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉందనే సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్‌ ముందుగానే తెలిపింది. అయితే, పర్యాటక స్వర్గథామంగా ఉన్నా జమ్మూకాశ్మీర్ ను అప్రమత్తంగా ఉంచడంలో కేంద్ర, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. జమ్మూకాశ్మీర్ లో మతపరమైన లక్ష్యాలు సాధించేందుకు ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇస్లామిక్‌ టెర్రిరిస్ట్‌ గ్రూపులు అయిన లష్కర్‌ -ఏ -తోయిబా, జైష్‌ -ఏ – మహమ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలు ఈ దాడులు చేస్తున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉగ్రవాదాన్ని అణచివేసే శక్తి లేకపోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని రక్షించే పనికి పూనుకోవాల్సి ఉంది.

28మంది పర్యాటకులను దారుణంగా హతమార్చిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన వారు లేదా, ఆ దేశంతో సంబంధాలున్న స్థానిక ఉగ్రవాదులుగా నిర్ధారణ జరిగింది. ఈ నేపథ్యంలో భారత్‌ ఈ దాడిని తీవ్రంగా పరిగణించింది. సౌదీ అరేబియా పర్యటనను అర్థంతరంగా ముగించుకుని బుధవారం ఉదయం భారత్‌ తిరిగివచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం నుంచి కశ్మీర్‌లో పరిస్థితిపైన ఎడతెరిపి లేకుండా కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ సంచలన నిర్ణయాలు తీసుకొంది. సార్క్‌ ఒడంబడికలో భాగంగా సభ్యదేశమైన పాకిస్థాన్‌ పౌరులకు జారీ చేసిన వీసాలన్నిటినీ రద్దు చేసింది. ఈ వీసాలున్న పాకిస్థాన్‌ పౌరులు 48గంటల్లోగా భారత్‌ను వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఇక పాకిస్థాన్ దేశ పౌరులను భారత దేశంలోకి అనుమతించేది లేదని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటికే సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించిన పాక్‌ పౌరులు మే 1వ తేదీ లోగా తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటారీ వాఘా వద్ద ఇరుదేశాల సరిహద్దుల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టును సైతం తక్షణమే మూసి వేసింది. మన దేశంలోని పాక్‌ దౌత్య కార్యాలయంలో ఉన్న రక్షణ లేదా, మిలిటరీ సలహాదారులను వెనక్కి పంపించి వేయాలని నిర్ణయించింది. అలాగే పాక్‌లోని మన దౌత్యకార్యాలయంలో ఉన్న ఈ సలహాదారులను కూడా వెనక్కి పిలిపిస్తారు. మే 1నుంచి మొత్తం విూద ఇరు దేశాల హైకమిషన్‌ కార్యాలయాల్లో సిబ్బందిని ఇప్పుడున్న 55నుంచి 30కి కుదించాలని నిర్ణయించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ తన మద్దతును నిలిపివేసే దాకా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపి వేయాలని కూడా సమావేశం నిర్ణయించింది. 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సింధు నదితో పాటుగా దాని ఉపనదుల ద్వారా పాక్‌లోని లక్షలాది ఎకరాలకు సాగు నీటితో పాటు పలు ప్రాంతాలకు తాగు నీరు లభిస్తుంది.

పాక్‌ తన శక్తియుక్తులను కేవలం ఉగ్రదాడులకే ఉపయోగిస్తోంది. భారత్‌ నుంచి ఎలాంటి సాయం అందకుండా చూడాలి. అన్ని రకాలుగా నిర్వీర్యం చేయాలి. పాక్‌ను ప్రపంచంతో వేరు చేసే అన్ని చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అనేక మారణహోమాలు సాగాయి. ఇలాగే వదిలేస్తే మరిన్ని దాడులు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. భారత్‌పై కన్నేస్తే ఖతమే అన్నంతగా పరిస్థితులు మారాలి. టెర్రరిస్టుల దాడులను తీవ్రంగా పరిగణించి, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. తాజా దాడిలో ప్రత్యేకంగా హిందూ వర్గంవారిని గుర్తించి మరీ కాల్పులు జరపడం మత మౌఢ్యంతో కూడిన మూర్ఖపు చర్య. పహల్గాంలో జరిగిన సంఘటనలో బాధితుల ముందు తీవ్రవాదులు చేసిన వ్యాఖ్యలు అత్యంత అమానవీయమైనవి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు వారి వ్యాఖ్యల్లో కనిపిస్తున్నాయి. గత మూడేళ్లుగా కాశ్మీర్‌ పర్యాటక రంగం పుంజుకుంది. కాశ్మీరీలకు ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. ఉగ్రవాదులు చేసిన మత వైషమ్య మారణకాండ, పుంజుకుంటున్న కాశ్మీర్‌ ఆర్థిక పరిస్థితిని తిరిగి దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే కాశ్మీర్‌ పర్యాటక రంగం మళ్లీ దెబ్బతింటే, అది కాశ్మీరీల ఉపాధిపైన తీవ్రమైన ప్రభావం చూపనుంది. కేంద్రం తీసుకున్న కొన్ని చర్యలు సమర్థనీయమైనవి. స్వాగతించాల్సిందే.

ఇవన్నీ చేస్తూనే కాశ్మీర్‌లో నిరంతర నిఘా పెంచాలి. ఉగ్రవాదుల ఏరివేతకు పూనుకోవాలి. పాక్‌తో సరిహద్దుల్లో భద్రత పటిష్టం చేయాలి. ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్ర శిక్షణ శిబిరాలను నిర్వీర్యం చేయాలి. అవసరమైతే పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను మన దేశంలో విలీనం చేసుకోవాలి. అందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాలి. భారత్‌ బలమేంటో పాక్‌తోపాటు ప్రపంచానికి చాటాలి.

Latest News

DEMOCRACY|ప్రజాస్వామ్యానికి PARTIES|పార్టీలే పట్టుగొమ్మలు!|EDITORIAL

POLITICAL PARTIES| రాజకీయ పార్టీలతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజాస్వామ్యయుత వాతావరణం పార్టీల్లో ఉంటేనే, ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. రాజకీయ పరిస్థితులను బట్టే ఆయా రాజ్యాల్లో, దేశాల్లో, సమాజాల్లో మిగతా అన్ని పరిస్థితులు ఆధారపడి...

శుక్రవారం జూన్ 13–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం కృష్ణ పక్షం తిధి బ.విదియ పగలు 02.10 వరకు ఉపరి తదియ నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 10.39 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శుక్ల పగలు 12.08 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి...

ఇప్పటివరకు Aeroplane|విమాన Accident|ప్రమాదంలో 20 మంది మృతి|Dead

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ (AI 171) విమానం ఘోరంగా కూలిపోయింది. ఈ ప్రమాదం నగరంలోని ప్రసిద్ధ BJ MEDICAL COLLEGE| బీజే మెడికల్ కాలేజీపై...

Ahmedabad|అహ్మదాబాద్‌లో AIR INDIA|ఏయిర్ ఇండియా AEROPLANE|విమాన ప్రమాదం|ACCIDENT

విమానం దుర్ఘటనకుAEROPLANE ACCIDENT| పై OFFICIAL| అధికారిక ప్రకటన GUJARAT| గుజరాత్‌లో ఘోర AEROPLANE ACCIDENT|విమాన ప్రమాదం జరిగింది. లండన్‌కు వెళ్లాల్సిన ఏయిర్ ఇండియా విమానం (AI-171), అహ్మదాబాద్‌లోని డాక్టర్ల హాస్టల్ సమీపంలో ప్రమాదానికి...

గురువారం జూన్ 12–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి పగలు 01.29 వరకు ఉపరి విదియ నక్షత్రం మూల రాత్రి 09.26 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం శుభ పగలు 12.28 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ...

KALESHWARAM|కాళేశ్వరం విచారణకు KCR|కేసీఆర్

ERRAVELLI|ఎర్రవెల్లి నుంచి START|బయలుదేరిన KCR|కేసీఆర్ TELANGANA|తెలంగాణ రాజకీయాలలో కీలకంగా మారిన KALESHWARAM PROJECT|కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం ఎర్రవెల్లి నివాసం...

KCR|కేసీఆర్ LIFE|జీవితమే ఓ చరిత్ర|HISTORY

తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ BRS|బిఆర్ఎస్ WORKING PRESIDENT|వర్కింగ్ ప్రెసిడెంట్ KTR|కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మరోసారి కాంగ్రెస్ నేతలపై విమర్శలతో TWITTER|ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. KCR|కేసీఆర్ జీవితం ప్రజాస్వామ్య పోరాటానికి ప్రతీకగా నిలిచిందని...

ERRAVELLI|ఎర్రవెల్లిలో జారి పడిన MLA|ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి|PALLA RAJESHWAR REDDY

తీవ్ర గాయాలతో YASHODA|యశోద దవాఖానకి తరలింపు BRS|బిఆర్ఎస్ నేత, JANGAON|జనగామ MLA|ఎమ్మెల్యే PALLA RAJESHWAR REDDY|పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర గాయాలతో HOSPITAL|దవాఖానలో చేరారు. మంగళవారం ఉదయం ఎర్రవెల్లి గ్రామంలోని EX CM|మాజీ సిఎం...

బుధవారం జూన్ 11–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం శుక్లపక్షం ఏరువాక పూర్ణిమ తిధి శు.పూర్ణిమ పగలు 12.10 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 07.30 వరకు ఉపరి మూల యోగం సాధ్య పగలు 12.28 వరకు ఉపరి శుభ కరణం బవ...

మంగళవారం జూన్ 10–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం శుక్లపక్షం గురు మౌఢ్యమి జూన్ 10--2025 నుండి జులై 09--2025 వరకు తిధి శు.చతుర్దశి ఉదయం 10.37 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం అనూరాధ సాయంత్రం 05.38 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ద...

Telangana|తెలంగాణ Congress|కాంగ్రెస్ new|కొత్త Committee|కార్యవర్గం ప్రకటించిన ఏఐసీసీ

TELANGANA|తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) కొత్త కార్యవర్గాన్ని పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ఈ కార్యవర్గంలో మొత్తం 27 మంది VICE PRESIDENTS|ఉపాధ్యక్షులు, 69 మంది GENERAL SECRETERIES|ప్రధాన కార్యదర్శులకు చోటు కల్పించారు....

ముగిసిన హరీష్ రావు|Harishrao విచారణ

Media| మీడియాతో మాట్లాడిన హరీష్ రావు Kaleshwaram| కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏర్పాటైన Commission| కమిషన్ విచారణలో భాగంగా ex minister| మాజీ మంత్రి హరీష్ రావు హాజరై, ప్రశ్నించిన ప్రతీ అంశానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News