ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కృష్ణా జిల్లా గంగూరు లోని రైతు సేవాకేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్శనలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర కూడా పాల్గొన్నారు. ఇక్కడ సీఎం చంద్రబాబు, సేవా కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందితో కలిసి రైతులతో మాట్లాడారు. ధాన్యం సేకరణ పద్ధతులు, ఆయా రైతుల పంటల ప్రగతిపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంలో, ధాన్యం అమ్మకాలు, కోత పద్ధతులపై రైతు ఆకునూరి సాంబశివరావు ముఖ్యమంత్రి కి వివరాలు చెప్పారు. ఆయన ప్రకారం, ఈ ఏడాది పంట గత సంవత్సరంతో పోలిస్తే మంచి దిగుబడిని ఇచ్చిందని, దీనికి మిషన్ కోత వల్ల ఇంతవరకు రూ. 5,000-6,000 అదనంగా వచ్చినట్లు పేర్కొన్నారు. మిషన్ కోత కారణంగా దిగుబడి పెరిగినట్లు చెప్పారు. అలాగే, బయోఫ్యూయల్ ప్లాంట్ ద్వారా గడ్డిని విక్రయించడం వల్ల మరో రూ. 5,000 వరకు లాభం పొందవచ్చని తెలిపారు.
అలాగే, రైతు గతంలో గడ్డిని మనుషుల సహాయం ద్వారా కోసేవాడని, ప్రస్తుతం సాంకేతికత వాడటం వల్ల వ్యయాలను తగ్గించగలిగినట్లు చెప్పారు. ఈ లెక్కలతో, మనుషుల ద్వారా వ్యవసాయం చేస్తే రూ. 25,000 వరకు ఖర్చు అవుతోందని వివరించారు. కానీ, ఈ కొత్త విధానంలో ధాన్యం డబ్బులు సకాలంలో వస్తున్నాయి, మరియు పంట కోత కూడా సక్రమంగా జరుగుతోందని ఆయన తెలిపారు.
ప్రోక్యూర్మెంట్ ప్రక్రియలో తేమ శాతాన్ని ఎలా గణిస్తారో తనిఖీ చేయడం, అంతే కాకుండా సాగు పద్ధతుల ఆధారంగా వచ్చే దిగుబడిని నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎవరైతే అధిక దిగుబడిని పొందారో వారి సాగు పద్ధతులు తెలుసుకోవాలని, అలాగే టెక్నాలజీ ద్వారా ప్రతి గ్రామంలో వచ్చే ప్రొడక్టివిటీని కూడా గణించాలని సేవా కేంద్రం సిబ్బందికి సీఎం సూచించారు.
తేమ శాతం కొరకు అధికారులు, సీజన్ మొదటి నుండి అన్ని మిషన్లను కేలిబ్రేట్ చేయాలనే ప్లాన్ను సీఎం చంద్రబాబుకు వివరించారు. తేమశాతంలో మార్పు కనిపిస్తే, ఆ మార్పును కచ్చితంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.