Trending News
Tuesday, April 8, 2025
25.9 C
Hyderabad
Trending News

రాజకీయం కాదు రాజనీతి కావాలి!

రాజకీయం నాటకం! ప్రజాసేవ బూటకం!! సంక్షేమం, అభివృద్ధి పితలాటకం!!! అధికారంలోకి ఎవరు వచ్చినా, ముందు తమ పనులు చక్కబెట్టుకోవడంలోనే బిజీగా ఉంటున్నారు. పైకి మాత్రం ప్రజలు, వారి సంక్షేమం, అభివృద్ధి మంత్రాలు జపిస్తూ కాలం వెళ్ళ బుచ్చుతున్నారు. ఎన్నికలప్పుడే కాదు, ప్రభుత్వం, అధికారం, పరిపాలన, పురోగతి అంతా రాజకీయమే!? నాయకులంతా రాజకీయాల చుట్టే తిరుగుతున్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు తన తీర్పు రిజర్వ్‌ చేసింది. సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో పార్టీలు మారిన సందర్భాల్లో లేని ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? ఉప ఎన్నికలు రావడానికి అవకాశం లేనే లేదని సిఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ లో ప్రకటించారు. రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం ఘాటుగానే స్పందించింది. నియంత్రణతో మాట్లాడాలని సీఎంకు చెప్పండని లాయర్ ను ఆదేశించింది. అంటే నేతలు హద్దు మీరుతున్నారా?
ఇక బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీ వేదికగా మొత్తం ప్రభుత్వమే తరలి వెళ్లి ధర్నా చేసింది. సిఎం రేవంత్‌ సహా మంత్రులు, కాంగ్రెస్‌ పరివారం వెళ్లింది. నిజానికి ఇదంతా రాజ్యాంగం పరిధిలో ఓ పద్ధతి ప్రకారం జరగాల్సిన వ్యవహారం. రాజ్యాంగ సవరింపులు, నిబంధనలతో కూడుకున్న విషయం. అయితే, దీనిపై తక్షణమే తేల్చండి అంటూ..ఢిల్లీకి వెళ్ళడం వెనుక కూడా రాజకీయమే. తమ కట్టుబాటు, నిబద్ధతని నిరూపించుకునే ప్రయత్నమే తప్ప, ఇది అంత ఈజీగా జరగదని ఏలే వారికి తెలుసు.
హైదరాబాద్‌కు ధీటుగా ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తామని ఇప్పటికే రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అక్కడ పరిశ్రమలు, ఐటి సంస్థలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. మరి కొత్తగా ఇప్పుడు వివాదంలోకి వచ్చిన సెంట్రల్ వర్సిటీ 400 ఎకరాల్లో ఐటి పార్కులు అభివృద్ధి చేస్తామని డిప్యూటి సిఎం భట్టి చెబుతున్నారు. ఓ వైపు ఆందోళనలు జరుగుతున్నా, సుప్రీం విచారణ చేస్తున్నా, ఇలాంటి వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సిందిపోయి, సంచలన ప్రకటనలు చేయడం సబబా? నిజానికి ఈ 400 ఎకరాలను అర్జంటుగా అమ్మి డబ్బులు చేసుకోవాలన్న ఆత్రుత పాలకుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.
ఇకపోతే బిఆర్‌ఎస్‌ నేతలు తాము చేసిన గత పాపాలను మరచి, కొత్తగా కాంగ్రెస్‌ మాత్రమే పాపాలు చేస్తున్నదన్న రీతిలో తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. దీంతో తమ పాపాలు మాసిపోతాయని, ప్రజలు వాటిని మరిచిపోతారని వారు భావిస్తున్నట్లు ఉంది. అందుకే విపక్ష బిఆర్‌ఎస్‌ తాను చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతోంది. గతంలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడడంతో ఎదురుదాడికి దిగుతోంది. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్ రావులు పాడిందే పాటగా, చెప్పిందే చెబుతున్నారు. ఓ వైపు దర్యాప్తు సంస్థలు ఒక్కో అవినీతి పుట్టను తవ్వి పెడుతున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌, ప్రాజెక్ట్ ల కుంభకోణాలు, ధరణి, అవినీతి… ఇలా ఒక్కక్కటి వెలుగు చూస్తున్నాయి. వారి పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని పదే పదే సీఎం రేవంత్ విమర్శలు చేస్తున్నారు. గతంలో అసలు సమస్యలే లేనట్లు, ఇప్పటికిప్పుడు పుట్టుకు వచ్చినట్లు చిత్రీకరిస్తున్నారు. గతంలోనూ మీడియాపై ఎత్తివేతల ఆంక్షలు పెట్టి, తమ నియంత్రణలోకి తెచ్చుకుని, పాలన సాగించిన తీరు అందరికీ తెలిసిందే. పార్టీ ఏదైనా ఇలాంటి నేతలను నిలదీయాల్సిందే!
అయితే, గత పాలకుల లోపాలను ఎత్తిచూపుతూనో, ప్రస్తుత ఖజానా ఖాళీ అయి, దివాళా తీసిందని పదే పదే చెప్పడం కంటే, చేసే పనిపై ద్రుష్టి పెట్టడం మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో సమతుతౌల్యాన్ని పాటించడం కత్తిమీద సామే. ప్రజా ప్రభుత్వమన్న పేరును నిలుపుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజాయితీగా ముందుకు సాగాలి. కఠినంగా వ్యవహరించడం కూడా అలవర్చుకోవాలి. నిర్ణయాలు తీసుకోవడంలో నిక్కచ్చిగా ఉండాలి. ఎన్నికల హావిూలను అమలు చేసేలా ప్రణాళికలను రూపొందించుకోవాలి. ఉచితాలకు పాతరేయాలి. కాంగ్రెస్‌ నేతలు కూడా నిజాలు గుర్తించి మసలుకోవడానికి అలవాటు పడాలి. కాంగ్రెస్‌లో స్వేచ్ఛగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉండదు. సీనియర్లు కావచ్చు..జూనియర్లు కావచ్చు…పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేందుకు అవససరమైన మేరకు మాత్రమే నడుచుకుంటే తప్ప మున్ముందు కాంగ్రెస్‌ మరిన్ని విజయాలు సాధించలేదు. బీఆర్‌ఎస్‌ పాలనకు.. కాంగ్రెస్‌ పాలనకు తేడా అన్నది పనుల్లో చూపాలి. కరువు వచ్చిందంటే కాంగ్రెస్‌ తెచ్చిందని మతిలేని యతి ప్రాసలు మాట్లాడుతున్నారు. ప్రతీది ప్రజలు గుర్తిస్తున్నారన్నది మరువరాదు. సిఎం రేవంత్‌ కూడా ప్రజలకు ఇచ్చిన హావిూలు, చేయాల్సిన పనులు లక్ష్యంగానే ముందుకు సాగాలి. వ్యక్తిగత వ్యవహారాలకు ప్రాధాన్యం ఇవ్వరాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాలి. బిఆర్‌ఎస్‌ అవినీతిని ఎండగట్టడమే పాలన కాదు. ప్రజోపయోగ పనులు కూడా చేస్తూ పోవాలని గుర్తించాలి. పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి వేగాన్ని గుర్తించాలి. మన రాష్ట్రంలోనూ అంతకు మించిన సమర్థత, వేగంతో పథకాలు అమలయ్యేలా చూడాలి. ఏపీలో చంద్రబాబు ప్రజాక్షేత్రంలోనే అనునిత్యం ఉంటున్నారు. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇచ్చిన హామీల అమలుతోపాటు, హామీ ఇవ్వని కొత్త పనులను కూడా అవసరాన్ని బట్టి చేపడుతున్నారు. రాష్ట్రంలో కూడా సీఎం రేవంత్ భవిష్యత్ ప్రణాళికలతో పని చేయాలి. సాగు, మంచినీటి రంగాలను చక్కదిద్దే ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. వచ్చే వర్షాకాలం నాటికి నీటి నిల్వలు పెంచడం, సాగునీటి రంగాన్ని ఆధునీకరించడం వంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అప్పుడే ఆయన విజయవంతమైన ముఖ్యమంత్రి కాగలుగుతారు.

Latest News

పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయాలు

సింగపూర్‌లోని ఓ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్...

గవర్నర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

తమిళనాడు గవర్నర్ డాక్టర్ ఆర్‌ఎన్. రవి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత గవర్నర్ తిరస్కరించిన బిల్లులను ప్రభుత్వం మళ్లీ తిరిగి ఆమోదించి పంపిన సందర్భంలో, వాటిని...

ఏప్రిల్ 08–2025 మంగళవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు చైత్రమాసం శుక్లపక్షం తిధి ఏకాదశి రాత్రి 11.08 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్లేష పగలు 11.05 వరకు ఉపరి మఖ యోగం శూల రాత్రి 06.33 వరకు ఉపరి గండ కరణం వణజి పగలు 01.32...

మాతా శిశు ఆరోగ్యమే మన భావి భాగ్యం!

(2025 ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు ఎచ్ ఓ) ఏటా ఒక ప్రాధాన్యత అంశాన్ని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా చైతన్య పరచి లక్ష్య సాధనకు కృషి చేస్తున్న విషయం...

ప్రగతి పథంలో పాలకుర్తి

వందకు వంద శాతం రిజర్వాయర్లు పూర్తి పార్టీని కాపాడే బాధ్యత మీది మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది పిచ్చి ప్రేలాపణలు, తుచ్ఛ ప్రచారాలు మానుకోండి లాలూ‘ఛీ’లు పడకండి... లూజ్ టాక్ చేయకండి బదనాం చేయాలని చూస్తే భరతం పడతా? పజీత చేయాలని...

రైతులకు అండ మన ప్రజా ప్రభుత్వం

రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో పెద్దవంగర మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం, చిట్యాల గ్రామంలో వాటర్...

ఏప్రిల్ 07–2025 సోమవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు చైత్రమాసం శుక్లపక్షం తిధి దశమి రాత్రి 10.48 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి పగలు 10.03 వరకు ఉపరి అశ్లేష యోగం ధృతి రాత్రి 07.52 వరకు ఉపరి శూల కరణం తైతుల పగలు 01.18...

వార రాశి ఫలాలు

ఏప్రిల్ 06 నుండి 12 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో మంచి...

రాష్ట్ర విభజన… తెలంగాణకు వరమైతే, భద్రాద్రి రామయ్యకు శాపం!?

భద్రాచలం.. భూలోక వైకుంఠం. సీతారాములు నడయాడిన నేల. తెలంగాణలో యాదగిరి గుట్ట, వేములవాడ రాజన్న తర్వాత అంతటి ఆధ్యాత్మిక వైభవానికి వేదికగా నిలుస్తున్న క్షేత్రం. ప్రతీ ఏటా శ్రీరామ నవమి రోజున పాలకులు...

వల్మీడిలో అక్షింతలు పడ్డాకే, భద్రాచలంలో సీతారాముల కళ్యాణం!

శ్రీ సీతారాములు నడయాడిందిక్కడే! రామాయణ కావ్యానికి బీజం పడిందిక్కడే!! వాల్మీకి పుట్టిన ఊరుగా ప్రతీతి ఇదే!!! శ్రీరామ నవమి సందర్భంగా ప్రతి ఏటా నవరాత్రోత్సవాలు ✍🏻డా.మార్గం లక్ష్మీనారాయణ వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News