Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

అధికారం కోసం రాజకీయ అరాచకాలు!|EDITORIAL

అధికారం ప్రమాదకర మత్తు. అదో మాయామేయ జగత్తు. దాని కోసం ఎంతకైనా తెగించడం దాని గమ్మత్తు. కనిపెట్టిన వాడు దాని తాకత్తు. ప్రజలకు కనికడుతూనే ఉంటాడు ఆ తాయత్తు. ఒకసారి అధికారం రుచి చూసింది లగాయత్తు. దాని చుట్టూతిరుగుతుంటుంది యావత్తు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది, అందరికీ ఆసక్తి గొలిపేది, ఆకర్షణ కూడా కలిగి ఉంది. రాజకీయమే. వెనుకటికి మహిళ కోసం మహిలో యుద్ధాలే జరిగాయన్నది ఎంత నిజమో ఇవ్వాళ రాజకీయ అధికారం కోసం అంతకుమించిన ఆరాచక మథాంధకారం రాజ్యమేలుతోంది. ఇవ్వాళ భూమి మీద ఇన్ని రకాల ఉపద్రవాలకు, యుద్ధాలకు కూడా రాజకీయాలను తప్పు పట్టకుండా ఉండలేం. అందుకే అధికారంలో ఉండగానే కాదు, అధికారాంతమున చూడవలే అయ్యవారి ఆగడములు.. ఊరికే అనలేదు. దాని మహత్తు అలాంటిది మరి. అధికారం కోసం రాజకీయ నాయకులు ఎంతకైనా తెగిస్తారనడానికి ప్రపంచ, దేశ, రాష్ట్రాలలో వారి రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది. దేన్నైనా తమకు అనుకూలంగా, అనువుగా మార్చుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, తమ పబ్బం గడుపుకుని పలాయనం చిత్తగించడం రివాజుగా మారింది.

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జగన్ పర్యటనలో జరిగిన హంగామా ఇద్దరి ప్రాణాలు తీసింది. చనిపోయిన ఓ వ్యక్తి పరామర్శ మరో ఇద్దరి చావుకు కారణమైంది. పరామర్శకు కూడా ఇంత అవసరమా అన్నదే సామాన్యుల ప్రశ్న. పరామర్శలకు వెళుతున్నారా లేక, రాజకీయ హంగామాకా? అధికారంలో ఉండగా ప్యాలెస్‌ దిగిరాని జగన్, సామాన్యులను పట్టించుకోలేదు. అమరావతి రైతుల ఆందోళనలు వినలేదు. చనిపోయిన వారెవ్వరి గురించీ ఆలోచించలేదు. ఇవ్వాళ ఇదంతా ఎందుకంటే అధికారం కోసం. ఏపీలో జగన్ కు, తెలంగాణలో కేసీఆర్ కు అధికారం దూరమై ఇంకా రెండేండ్లు నిండలేదు. అప్పుడే కొంపలు అంటుకు పోయినట్లు దారుణంగా అడ్డగోలుగా గగ్గోలు పెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దురాగతాలకు పాల్పడి ఇప్పుడు ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ, పోలీసుల వేధింపుల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే తమదే అధికారమని సొంత పత్రికల్లో బాకాలూదుతున్నారు.

విమర్శలకు కూడా హద్దులు ఉంలాలి. మీడియాతో మాట్లాడటం, మరుసటి రోజు ట్విట్టర్‌ లో వల్లించడం, ఆతర్వాత రోజు దానిపై సొంత పత్రికల్లో కథనాలు, టీవీల్లో బాకాలు ఊదడం అలవాటైపోయిది. ప్రజల సమస్యలు పక్కకు పోయాయి. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా తమ పాలనలోని గత తమ పాపాలను ప్రజలు మరచి పోతారన్న ఏకైక లక్ష్యంతో జంకూగొంకూ బొంకుతున్నారు. అబద్ధాల ప్రచారంలో ఆరితేరారు. ఇది చాలదన్నట్లు తెలంగాణలో ఇప్పుడు కవిత కూడా బలయుదేరారు. తాము అధికారంలో ఉన్నన్నాళ్ళూ గుర్తుకురాని బీసీలకు రాజ్యాధికారం, రిజర్వేషన్లు, పూలే విగ్రహాలు వంటివన్నీ కవిత నోటినుంచి తన్నుకు వస్తున్నాయి. అధికారమంటే దోచుకోవడమే అన్న చందంగా ఐదేళ్లు జగన్‌, పదేళ్లు బిఆర్‌ఎస్‌ నేతలు దోచుకున్న విషయాన్ని ప్రజలు ఇంకా మరచి పోలేదు.

అసలు ఏపీ విభజన జరిగిందే తమ ఆదాయాల పెంచడానికి అన్నట్లుగా ఇరు రాష్టాల్రను అప్పట్లో దోచారు. అప్పుల్లో ముంచేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి తీసుకుని వచ్చారు. ఇసుక, మట్టి, క్వారీ, భూకబ్జాలు వంటివెన్నో చెప్పనక్కరలేదు. జర్నలిస్టులను అంటరానివారిగా చూసిన ఘనత ఈ ఇద్దరు నాయకులకే చెల్లింది. సీఎం ప్రజలను కలవాల్సిన అవసర మేముందని దబాయించిన నేతలు ఇప్పుడు నీతి దండకాలు చదువుతున్నారు.

మాజీలని అనిపించుకోవడానికి కూడా ఇష్టపడని, ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా సిద్ధంగా లేని నేతల పార్టీల పని పట్టి, ప్రజలు గట్టి బుద్ధే చెప్పారు. ఎర్రవెల్లి ఫాం హౌస్ కి కేసీఆర్, బెంగుళూరు ప్యాలెస్ కు జగన్ పరిమితమయ్యారు. మల్లన్నసాగర్‌లో ప్రజల జీవితాలను ముంచేసిన కేసీఆర్‌ బృందం ఇప్పుడు మూసీ మురికి బాధితుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారు. దోచుకోవడమే పాలన అన్నచందంగా సాగిన వీరి ఆగడాలను భరించలేకే ప్రజలు అధికారం నుంచి దించేశారు. సంక్షేమం పేరిట ప్రజలకు డబ్బు పందేరాలు సాగించి, అదే అభివృద్ధి అని నమ్మించి, ఎన్నికల్లో ఓటమి పాలైనా వీరికి జ్ఞానోదయం కలగినట్లు లేదు. మూసీ మురికి వదలకూడదు. బతుకమ్మ చీరలు, నిరుద్యోగులకు టోపీ పెట్టిన వైనాన్ని నిలదీయరాదు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం, ధరణి అవినీతుల గురించి అడగరాదు. ఈ ఫార్ములా రేసులో డబ్బుల హవాలాపై కేసు పెట్టరాదు. ఇక ఇప్పుడు ఏపీలోనూ పోలీసు కేసులు, వేధింపులు, పత్రికా స్వేచ్ఛ అంటూ జగన్‌ అండ్‌ కో గగ్గోలు పెట్టడం చూస్తే జాలేస్తోంది. పార్టీల, మీడియా ముసుగులో రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ముఠాలు బయలుదేరాయి. మీడియాకు కూడా ప్యాకేజీలతో మాయ చేసే, థాట్ పోలీసింగ్ మాయను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నది మరువరాదు.

గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడి, అవినీతికి తెగించి, ఆర్థిక విధ్వంసాలు సృష్టించిన వారిపై చర్యలు ఉండకపోతే భవిష్యత్తులో మరికొందరు బరి తెగిస్తారు. తమకేమీ కాదులే అన్న దీమా రాజకీయ నేతల్లోనే కాదు ఎవ్వరిలోనూ రాకూడదు. పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండి తీరాలి. అయితే, అధికారంలో ఉన్న, లేని అన్ని పార్టీలు ఒకరిని ఒకరు పైకి విమర్శించినా, లోలోన సమర్ధించుకోవడం, సహకరించడమే రాజకీయాల్లో అత్యంత దారుణంగా, దయనీయంగా ఆందోళనకరంగా మారింది.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News