Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

ఆదికవి పాల్కురికి సోమనాథుని దీపారాధన

ఫాల్గుణ పౌర్ణమి నాడు లింగైక్య తిథి

పాల్కురికి సోమనాథుడు (క్రీ శ 1160-1240) అందరి వంటి కవి కాదు. అన్నింటా అసామాన్యుడు. తెలంగాణ ఆదికవి. తెలుగు భాషలో తొలి స్వతంత్ర కవి. ఆయనకు ముందు అందరూ అనువాద కవులే. సోమనాథుడు అష్ట భాషా కోవిదుడు. అక్షర క్రీడలో ఆరితేరిన ప్రతిభా శాలి, ప్రయోగ శీలి. అయినా ప్రగల్బ ప్రదర్శన లేని వాడు. జాను తెలుగులో వ్రాసి ప్రజల భాషకు కావ్య గౌరవం కల్పించిండు. భాష, భావం, వస్తువు, ఇతివృత్తం, పాత్రలు, ఛందస్సు, ప్రక్రియ, ప్రస్తుతి అన్నింటి లోనూ నవ్య మార్గంలో నడిచిండు. ఒక విప్లవం తెచ్చిండు.

కన్నడ నేలపై ప్రభవించి సమ సమాజం, సామ్యవాదం సాధనకు వీర శైవంను ఒక పరికరంగా స్వీకరించి ప్రజలను మేలు కొలిపిన మహనీయుడు బసవేశ్వరుడు. బసవేశ్వరుని భక్తి తత్వాన్ని తెలుగు దేశాన తెలియ చెప్పిన వాడు మల్లికార్జున పండితారాధ్యుడు. ఈ ఇరువురి దివ్య చరితలను వారి బలగమైన శివ శరణుల కథలను తనివి తీరా వ్రాసిండు. తన ఇలు వేలుపు పాలకురికి సోమేశునిపై సోమనాథ స్తవం వ్రాసిండు. ద్విపదకు పద్య పదవిని ఇచ్చిండు. లక్షణ యుక్తంగా తొలి శతకాన్ని కూర్చిండు. ఉదాహరణకు ఉదాహరణగా నిలిచిండు. గద్యలతో, రగడలతో ఊర్రూత లూగించిండు. అలతి ద్విపదలు, అలుకటి మాటలే కాదు, అరుదైన ఛందస్సులు, అబ్బుర పరిచే అక్షర విన్యాసాలు చూపించిండు. తన కాలపు సమాజాన్ని, సంస్కృతిని, కళలను, ప్రకృతిని, విజ్ఞానాన్ని, ఆనాటి సమస్తాన్ని తన కవిత్వంలో ఆవిష్కరించిండు. అంతటి మహత్తరమైన కవి మరొకరు లేరు. సోమనాథుడు తెలంగాణలో పుట్టినా, ప్రాంతానికి పరిమితం చేయలేని విశ్వ కవి.

సోమనాథుడు ప్రజల మధ్య, భక్తుల నడుమ పర్యటిస్తూ శ్రీశైలం మీదుగా కన్నడ కల్య క్షేత్రాన్ని చేరుకొన్నడు. అక్కడి జంగమ మఠంలో శివ శరణి చెన్నమ్మ చెంత ఆ వృద్దాప్యంలోనూ ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఉండి పోయిండు. కాలం సమీపించి అక్కడనే లింగైక్యం చెందిండు. క్రీ శ 1240 వికారి నామ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు ఆయన ఆత్మ శివ పరమాత్మలో లీనమైంది. ఏటా ఫాల్గుణ పౌర్ణమి నాడు కల్య క్షేత్రంలో అక్కడి జంగమ మఠం వారు సోమనాథుని సమాధి వద్ద దీపారాధన చేస్తున్నరు. విశేషం ఏమిటంటే అక్కడ స్థానికులకు సోమనాథుని గురించి తెలుసు. ఈ వ్యాసకర్త 2024 అక్టోబర్ 19న కల్య సందర్శనకు పోయినప్పుడు నాగరాజ్ అనే పాతికేండ్ల కాపుదనపు యువకుడు విశేషాలన్నీ వివరించిండు. వ్యాసకర్త మిత్రుడు రఘు కిరణ్ అయ్యంగార్ దుబాసిగా తోడు ఉన్నడు. తిరిగి వస్తున్న దారిలో ఎదురుపడ్డ కె సి ఈశ్వర్ ప్రసాద్ మరికొన్ని వివరాలు తెలిపిండు. సోమనాథుని సమాధిని విభూదితో నింపినారట. పక్కనే పెంచిన మారేడు చెట్ల నుంచి సమాధి మీద నిత్యం బిల్వ దళాలు పడే ఏర్పాటు కొనసాగుతూ వస్తున్నదట.

సోమనాథుని లింగైక్య అనంతరం పాలకుర్తిలో ఆయన పేరు మీద మందిర నిర్మాణం జరిగింది. జంగమ పెద వీరయ్య వారసులు ఆ గుడి నిర్వహణ చూస్తున్నరు. పాలకుర్తిలోని సోమనాథ కళాపీఠం వినతి మేరకు తెలుగు విశ్వవిద్యాలయం సోమనాథుని శిలా విగ్రహాన్ని ప్రదానం చేసింది. 2002 లో విగ్రహ ఆవిష్కరణ జరిగింది. 2015 నుంచి సోమనాథ కళా పీఠం ఆధ్వర్యంలో ఏటా సోమనాథుని దీపారాధన జరుగుతున్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పాలకుర్తి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. స్మృతి వనం నిర్మించి సమున్నత వేదిక మీద సోమనాథుని భారీ శిలా విగ్రహాన్ని కూర్చుండ బెట్టింది. 2023 సెప్టెంబర్ 4 న ప్రారంభ సంరంభం జరిగింది. ఆ తదుపరి ప్రభుత్వం పట్టింపు లేక సోమనాథుని స్మృతి వనం వెలవెల పోతున్నది.

కల్య క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మలచాలని కర్నాటక ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం పర్యాటక మంత్రి ఎచ్ కె పాటిల్ బృందాన్ని పాలకుర్తికి పంపాలని యోచిస్తున్నది. ఈ తరుణంలో పాలకుర్తిలోని సోమనాథుని స్మృతి వనం సక్రమ నిర్వహణతో పాటు, తెలుగు విశ్వవిద్యాలయంకు పాల్కురికి సోమనాథుని పేరు పెట్టవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వంపై ఉన్నది.

డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News