Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

‘ప్రభంజన’ పథానికి అంతిమ వీడ్కోలు|PRABHANJAN YADAV

ముగిసిన సృజనాత్మక, ప్రగతిశీల మహా ప్రస్థానం
ఉద్యమాలే ఊపిరిగా, JOB|ఉద్యోగం ఆసరగా ప్రయాణం
AIR|ఎఐఆర్, PLANNING COMMISSION|ప్లానింగ్ కమిషన్, ప్రచారశాఖల్లో తనదైన ముద్ర
IIS|ఐఐఎస్ కి రాజీనామా చేసి TELANGANA|తెలంగాణ ఉద్యమంలోకి
బహుజనుల హక్కుల కోసమే బతుకంతా పోరాటం
‘మేమెంతో…మాకంత వాటా’ కోసం ఆరాటం
కాకతీయలో JOURNALISM|జర్నలిజం శాఖకు పురుడుపోసింది ప్రభంజనే
తెలంగాణ వర్సిటీలో ఆచార్యుడిగా అనేక అంతర్జాతీ సెమినార్లు
విద్యావేత్త, సామాజిక శాస్త్రవేత్త, రచయిత, జర్నలిస్టు…
గూడూరులో ఆయన అభిమానులు, శిష్యులు, కుటుంబ సభ్యులతో అంతిమ యాత్ర
పార్థీవ దేహం JANGAON MEDICAL COLLEGE|జనగామ మెడికల్ కాలేజీకి అప్పగింత
EX CM|మాజీ సీఎం KCR|కేసీఆర్, VENNELA GADDAR|వెన్నెల గద్దర్ సహా పలువురి నివాళులు, సంతాపం

పాలకుర్తి/జనగామ, జూలై 16(అడుగు ప్రత్యేక ప్రతినిధి):
హైదరాబాద్, తన నివాసంలో తీవ్ర అనారోగ్యంతో అకాల మరణం చెందిన ప్రముఖ సామాజిక, బహుజన ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు, విద్యావేత్త, సామాజిక శాస్త్రవేత్త, జర్నలిజం ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ దేహాన్ని ఆయన కోరిక మేరకు జనగామ జిల్లా మెడికల్ కాలేజీకి అందించారు. హైదరాబాద్ తన నివాసంలో ఉదయం 06:00 గంటల ప్రాంతంలో కన్నుమూసిన వెంటనే ఆయన భార్య డా.రేఖ, ఆయన సోదరులు రమేష్, శ్రీనివాస్, వీరస్వామి, దగ్గరి బంధువు కొంగరి నాంపల్లి, బావలు రవీంద్ర, బద్రి, రాంచందర్, రాజయ్య తదితరులు అంబులెన్స్ ద్వారా మధ్యాహ్నం 12:00 గంటలకు ఆయన స్వగ్రామం జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, గూడూరులోని ఆయన ఇంటికి చేర్చారు. అక్కడే తాను స్థాపించిన సత్యశోధక పీఠం పాఠశాల ప్రాంగణంలో ప్రజల సందర్శనార్థం ఉంచగా, గ్రామస్థులు, పుర ప్రముఖులు, మిత్రులు, శిష్యులు తదితరులు సందర్శించారు. కాగా, మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమైన అంతిమ యాత్ర, గ్రామ చౌరస్తా గుండా… ఊరి పొలిమేరకు చేర్చి, సాయంత్రం 04:30 గంటల ప్రాంతంలో మిత్రులు, శిష్యుల అమర్ రహే ప్రభంజన్ యాదవ్ అమర్ రహే అంటూ.., వారి నినాదాల మధ్య ఆయన దేహాన్ని వైద్య విద్యార్థుల ప్రయోగ నిమిత్తం జనగామ మెడికల్ కాలేజీకి అప్పగించారు.

ప్రభంజన ప్రస్థానం:

జనగామ జిల్లా (పూర్వం వరంగల్ జిల్లా), పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ఒక సామాన్య గొర్రెల కాపరి యాదవ కుటుంబంలో యాదనాల కొమరమ్మ, సోమయ్య దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించిన డాక్టర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ మొట్ట మొదటి సారిగా గ్రామం నుండి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సాధించారు. ఆల్ ఇండియా రేడియోలో విధులు నిర్వహించారు. తర్వాత న్యూ డిల్లీ జాతీయ ప్లానింగ్ కమిషన్ లో పీఆర్ఓ గా విధులు నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. విద్యార్థి దశ నుండే ప్రగతిశీల వామపక్ష భావజాల ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తూ డోలు దెబ్బ, యాదవ ఇంటలెక్చువల్ ఫోరం, సామాజిక తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసి నిరంతరం ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా పని చేశారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య చిత్రాన్ని మొట్టమొదటగా చేయించిన వ్యక్తి ఆయన. సత్యశోధక సామాజిక విద్యాపీఠం స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించారు. జానపదాలను జననాట్య మండలి ఉద్యమ కళారూపాలుగా వాడుకున్న వైనం మీద తన ఎంఫీల్ థీసిస్ ప్రజెంట్ చేశారు. దాని గురించి గద్దర్ తో పాటు అజ్ఞాత కళకారులు సంజీవ్, దివాకర్, రమేష్, ఈవి, పద్మ, కుమారి తదిరుల కృషి మీద పరిశోథన చేసి ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్’గా వెలుగులోకి తెచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీఎస్పీ పార్టీ జనరల్ సెక్రటరీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక ఉద్యమ సంఘాలతో కలిసి పని చేశారు. ఆ తర్వాత తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజం విభాగంలో ప్రొఫెసర్ గా తన సేవలను కొనసాగించి పదవీ విరమణ పొందారు. వీరి కృషి వల్లే కాకతీయ యూనివర్సిటీలో జర్నలిజం శాఖ మొదలైంది.

తరలివచ్చిన ప్రముఖులు:

ప్రజా యుద్ధ నౌక, గద్దర్ బిడ్డ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్, తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ నాయకుడు చెరుకు సుధాకర్, సోమనాథ కళా పీఠం అధ్యక్షులు డా.రాపోలు సత్యనారాయణ, హిందూ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్, సోమ రామ్మూర్తి, సాయిని నరేందర్, కన్నా పరుశరాములు, చాపర్తి కుమార్ గడ్గే, న్యాయవాది కదిరే కృష్ణ, కొంగర నరహరి, అమరేందర్, అశోక్ బాబు, కోలా జనార్ధన్, మల్లేష్, గుమ్మడిరాజుల సాంబయ్య, పాలకుర్తి దేవస్థాన మాజీ చైర్మెన్ చిలువేరు కృష్ణమూర్తి, సంగి వెంకన్న, పులి గణేష్, మాచర్ల సారయ్య, వైట్ల లక్ష్మీపతి, క్లాస్ మేట్ సింగారపు దీపక్, మాజీ సర్పంచులు బక్కి పుల్లయ్య, మంద కొమురయ్య, మాచర్ల పుల్లయ్య, సలేంద్ర శ్రీనివాస్, కత్తుల రామ్ చందర్ యాదవ్, కత్తుల యాకయ్య, సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి తడుతరులు, అడుగు డిజిటల్ మీడియా, చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ తరుపున మార్గం సాయి సందీప్ తేజ తదితరులు ఘన నివాళులు అర్పించారు.

మెడికల్ కాలేజీకి పార్థవదేహం అప్పగింత:

సామాజిక ఉద్యమకారుడిగా తెలంగాణ జన సేన స్థాపించి సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా అహర్నిశలు పరితపించిన ప్రభంజన్, మండల్ టీవీ ని స్థాపించి చివరి వరకు ఉద్యమిస్తూ తుది శ్వాస వరకు సామాజిక న్యాయం కోసం పని చేశారు. ‘మేం ఎంతో మాకు అంత వాటా’ నినాదంతో బహుజన ఉద్యమాన్ని నడిపిస్తూ అనేక సభలు సమావేశాలు నిర్వహించి, బహుజన మీడియా, ద వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ లాంటి ఎన్నో పుస్తకాలను రచించి బతికున్నంత కాలం విద్యార్థులకు, సమాజానికి ఉపయోగపడినట్లే తన మరణానంతరం కూడా వైద్య విద్యార్థులకు తన శరీరం ఉపయోగపడాలనే సామాజిక స్పూర్తితో చివరగా తన భౌతిక దేహాన్ని సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగాం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి సమర్పించారు.

 

పలువురు సంతాపం:

ప్రభంజన్ యాదవ్ మృతి పట్ల మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, కవులు రచయితలు సుద్దాల అశోక్ తేజ, గద్దర్ కుమారుడు సూర్యం, క్రాంతిదళ్ పృథ్వీ, సంగిశెట్టి శ్రీనివాస్, వనపట్ల సుబ్బయ్య, పల్లా సుందర్ రామ్ రెడ్డి, తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

 

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News