Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

Ahmedabad|అహ్మదాబాద్‌లో AIR INDIA|ఏయిర్ ఇండియా AEROPLANE|విమాన ప్రమాదం|ACCIDENT

విమానం దుర్ఘటనకుAEROPLANE ACCIDENT| పై OFFICIAL| అధికారిక ప్రకటన

GUJARAT| గుజరాత్‌లో ఘోర AEROPLANE ACCIDENT|విమాన ప్రమాదం జరిగింది. లండన్‌కు వెళ్లాల్సిన ఏయిర్ ఇండియా విమానం (AI-171), అహ్మదాబాద్‌లోని డాక్టర్ల హాస్టల్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి ఏయిర్ ఇండియా చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రస్తుతం ప్రాధాన్యత కల్పించాల్సింది బాధితులకు అండగా నిలబడటమేనని పేర్కొన్నారు. అత్యవసర సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని, సహాయక చర్యల్లో అన్ని విభాగాలు చురుగ్గా పాల్గొంటున్నాయని స్పష్టం చేశారు.

విమానాశ్రయ అధికారుల సమాచార ప్రకారం, మాజీ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణిస్తున్నారని చెప్తుండగా, విమాన ప్రమాదానికి గురైన ఏయిర్ ఇండియా విమాన ప్రయాణికుల జాబితాలో మాజీ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ పేరు ఉన్నప్పటికీ, ఆయన మరో విమానంలో ప్రయాణించినట్లు ఆయన వ్యక్తిగత సహాయకుడు స్పష్టత ఇస్తూ, అధికారికంగా సమాచారం ఇచ్చారు. విజయ్ రూపానీ సురక్షితంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ ప్రమాదం కారణంగా అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలికంగా నిలిపివేయబడింది. విమానాశ్రయం అధికారుల సమాచార ప్రకారం, అన్ని విమానాల రాకపోకలు నిలిపివేశామని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

ప్రమాదం జరిగిన వెంటనే రెండు మూడు నిమిషాల్లోనే పోలీస్, ఫైర్ సర్వీసు, మెడికల్ టీంలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, ప్రస్తుతం దాదాపు 70-80 శాతం ప్రాంతాన్ని శుభ్రం చేశామని అహ్మదాబాద్‌ పోలీస్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎంతమంది మృతిచెందినదీ లేదా గాయపడినదీ స్పష్టంగా తెలియరాలేదు. సహాయక బృందాలు శరవేగంగా పనులు కొనసాగిస్తున్నాయి.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. వెంటనే అహ్మదాబాద్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా వారిని ఆదేశించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన స్థలాన్ని వెంటనే ఖాళీ చేసి, మిగిలిన ప్రాంతాలను పరిశీలించి, బాధితులకు అన్ని విధాలుగా సహాయపడేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.

ఈ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధికారికంగా మృతుల సంఖ్య ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రభుత్వం, ఏయిర్ ఇండియా అధికారులు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

అందులో పరాయనిస్తున్న ప్రయాణీకుల వివరాల కోసం ఈ కింది లింకును క్లిక్ చేయండి.

New Doc 06-12-2025 13.57.22

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News