Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

ముగిసిన హరీష్ రావు|Harishrao విచారణ

Media| మీడియాతో మాట్లాడిన హరీష్ రావు

Kaleshwaram| కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏర్పాటైన Commission| కమిషన్ విచారణలో భాగంగా ex minister| మాజీ మంత్రి హరీష్ రావు హాజరై, ప్రశ్నించిన ప్రతీ అంశానికి ఆధారాలతో సమాధానమిచ్చారు. దాదాపు గంటకు పైగా సాగిన విచారణ అనంతరం ఆయన BRK BHAVAN| బీఆర్‌కే భవన్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కమిషన్ ముందుకు రాసిపెట్టి మాట్లాడటం, రేపటి నుంచి రాజకీయాలపై స్పందిస్తానని చెప్పారు. లోపల చెప్పిందే బయట మాట్లాడతానని స్పష్టం చేశారు.

విచారణలో తొలిగా తమ్మిడిహట్టి వద్ద నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ మార్పుపై వివరణ ఇచ్చిన హరీష్ రావు, కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టిలోనే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నించిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రణాళికల ప్రకారం 7 ప్యాకేజీలుగా ప్రాజెక్టు ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రణాళికలు ప్రారంభించకముందే తవ్వకాలు చేసిందని విమర్శించారు.

ప్రాజెక్టుకు అనుమతుల కోసం మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి హసన్ ముష్రఫ్‌ను కలిసి దరఖాస్తు చేశామని, అయితే ఆయనే “ఎట్టి పరిస్థితుల్లోనూ 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేమని” తేల్చిచెప్పారని అన్నారు. అదే విషయాన్ని మహారాష్ట్ర సీఎం కూడా అప్పటి ఏపీ సీఎంకు తెలిపిన విషయాన్ని కమిషన్ ముందు వెల్లడించినట్టు చెప్పారు. మహారాష్ట్రలో సీఎంగా ఉన్న ఫడ్నవీస్ కూడా బీజేపీ మేనిఫెస్టో ప్రకారం ప్రాజెక్టును వ్యతిరేకించినట్టు తెలిపారు. తాము ఎంత ప్రయత్నించినా అనుమతులు రాలేదని, దీంతో తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టలేక మేడిగడ్డను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశామన్నారు.

ఇందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలు ఆధారంగా మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉన్నదని గుర్తించారన్నారు. సర్వే ఆధారంగా మేడిగడ్డకు షిఫ్ట్ చేయడం జరిగిందని వివరించారు. తమ్మిడిహట్టిలో ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, భూముల సేకరణ, అంతర్రాష్ట్ర ఒప్పందాలపై కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మంత్రులైన కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలు పట్టించుకోలేదన్నారు.

కాళేశ్వరం కార్పొరేషన్‌కు అనుమతి ఉందా అన్న ప్రశ్నపై అన్ని ఆధారాలను సమర్పించానని హరీష్ రావు చెప్పారు. అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మార్పులు టెక్నికల్ కారణాలతో జరిగాయని, ఇంజినీర్ల సర్వే ఆధారంగా తీసుకున్న నిర్ణయమని వివరించారు. దేశంలో అనేక ప్రాజెక్టులు ఇలాగే మారిన విషయాలు కూడా కమిషన్‌కు వివరించినట్టు చెప్పారు.

ప్రాజెక్టులో రిజర్వాయర్ల సామర్థ్యం 141 టీఎంసీలుగా ఉందని, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 530 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేస్తామని, మొత్తం 240 టీఎంసీల నీటిని వినియోగించవచ్చునని వివరించారు.

ఈ ప్రాజెక్టు దూషణలకు తావు లేదని, అంతా సాక్ష్యాధారాలతో కూడిన వ్యవహారమని హరీష్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్టు, ఈ ప్రాజెక్టుకు నీళ్లు మల్లన్నసాగర్ నుంచి వస్తాయని చెప్పారు. మల్లన్నసాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు తాగునీరు, మూసీ నది సుందరీకరణకు నీటిని మల్లన్నసాగర్ నుంచి తరలిస్తామని ప్రకటిస్తున్నప్పుడు, అదే కాళేశ్వరం భాగం కాదా అని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార అని ప్రజలకు అర్థమైందన్నారు. కమిషన్ ముందు నోటిమాటలతో ఏమీ మాట్లాడలేదని, క్యాబినెట్ నిర్ణయాలు, వాప్కోస్ నివేదికలు, సీడబ్ల్యూసీ లేఖలు, జీవోలు అన్నింటినీ ఆధారాలుగా సమర్పించామని హరీష్ రావు వెల్లడించారు.

ఇకపై రాజకీయ విమర్శలకు స్పష్టంగా స్పందిస్తానని హరీష్ రావు సూచించారు. అనుమతుల కోసం తాము చేసిన ప్రణాళికలు, శ్రమలు, కమిషన్ ముందు ఇచ్చిన సమాధానాలన్నీ ఆధారాలతో కూడుకున్నవే అని తేల్చి చెప్పారు. కాళేశ్వరం మీద విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని, ఇది రాష్ట్రానికి ఆర్ధిక, వ్యవసాయ ప్రయోజనాల దిశగా తీసుకెళ్లే ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News