Trending News
Sunday, December 7, 2025
17.2 C
Hyderabad
Trending News

మసూద్ అజార్ ది మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్!

అతను ఒక మామూలు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కొడుకు. 8వ తరగతిలోనే చదువుకు స్వస్తి పలికి, జామియా ఉలూమ్ ఇస్లామిక్ పాఠశాలలో చేరాడు, అలీమ్‌గా పట్టభద్రుడయ్యాడు. ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు. ఈ అలీమే ఆతర్వాత అంతర్జాతీయ ఉగ్రవాది అయ్యాడంటే నమ్మడం కష్టమే. పాకిస్తాన్ తమ దేశ అధ్యక్షుడికంటే, ప్రధాని కంటే కూడా, అత్యంత సైనిక భద్రత కల్పించి రక్షిస్తున్నది కూడా ఇతడినే. అయితే భారత్ లో ఇప్పటి దాకా జరిగిన అన్నిదాడులకు ప్రధాన సూత్రధారి కూడా ఇతడే. అతడే ది మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ మహమ్మద్ మసూద్ అజార్ అల్వి అలియాస్ మసూద్ అజార్.

హైదరాబాద్, మే 8 (అడుగు న్యూస్ ప్రత్యేక ప్రతినిధి):
పాకిస్తాన్ లోని పంజాబ్‌లో గల బహవల్‌పూర్‌లో జూలై 10, 1968న పుట్టిన మహమ్మద్ మసూద్ అజార్ అల్వి అలియాస్ మసూద్ అజార్. మన దేశంలోనే (1994 ఫిబ్రవరిలో)అరెస్టై, జైలులో ఉండి, విమానం హైజాక్ ద్వారా (1999, డిసెంబర్ లో ) విడుదలై, మన పార్లమెంట్ మీదే (డిసెంబర్ 13, 2001న) దాడి చేయించిన కరడుగట్టిన టెర్రరిస్టు నాయకుడు కూడా ఇతడే. 2008 ముంబై దాడులు, 2016 పఠాన్ కోట్ దాడి, 2019 పుల్వామా దాడి, ఇలా భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడుతున్న సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (2000) వ్యవస్థాపకుడు. అది అతని కుటుంబ సంస్థ.

అయితే, భారతదేశం ఫిబ్రవరిలో అనంతనాగ్ సమీపంలోని ఖనాబాల్ నుండి అతన్ని అరెస్టు చేసింది. 1999 విమానం హైజాక్ నేపథ్యంలో జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు నుంచి విడుదలయ్యాడు. నేరుగా పాకిస్తాన్ కి వెళ్ళిపోయాడు. తమ దేశంలో అతడిపై ఎలాంటి అభియోగాలు లేనందున పాక్ కనీసం అతడిని అరెస్టు కూడా చేయలేదు. డిసెంబర్ 29, 2001న భారత పార్లమెంటుపై డాడి తర్వాత ఏడాదిపాటు గృహ నిర్బంధం చేసి, 2002 డిసెంబర్ 14న ఆ నిర్బంధాన్ని ముగించారు.

విడుదలైన కొద్దికాలానికే, అజార్ కరాచీలో 10వేల మందితో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ” భారతదేశాన్ని నాశనం చేసే వరకు ముస్లింలు శాంతితో విశ్రాంతి తీసుకోకూడదని మీకు చెప్పడం నా విధి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ” అని ప్రకటించాడు, కాశ్మీర్ ప్రాంతాన్ని భారత పాలన నుండి విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.

2008 ముంబై దాడుల తర్వాత అతను పాకిస్తాన్ పంజాబ్ లోని తన స్వస్థలం భవల్‌పూర్‌లో ఉంటున్నాడు. 2014 జనవరి 26న, రెండేళ్ళ ఏకాంతవాసం తర్వాత అజార్ తిరిగి కనిపించాడు. 2019 పుల్వామా దాడికి పాల్పడింది తమ సంస్థేనని పాక్ పకడ్బందీ ఆర్మీ రక్షణలోని బంకర్ నుండి ప్రకటించాడు. దీంతో అతడిని ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

ఇక అప్పటి నుంచి కనిపించడం మానేసిన మసూద్ అజార్, 2025 మే 7న, పహల్గామ్ దాడికి ప్రతీకారంగా , బహవల్పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ శిబిరంతో సహా, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం క్షిపణి దాడులు నిర్వహించింది . మసూద్ అజార్ తన సోదరి, మేనల్లుడు, మేనకోడళ్ళు, ఇతర దగ్గరి బంధువులతో సహా 14 మందిని కోల్పోయి, చావు మిగిల్చిన విషాదాన్ని అనుభవిస్తున్నాడా? లేక చావు దెబ్బ తిన్నాడా? సమీప కాలంలోనే బండారం అంతా బట్ట బయలవుతుంది.

Latest News

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

గురువారం డిసెంబర్ 04–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--శుక్లపక్షం దత్తాత్రేయ జయంతి తిధి శు.చతుర్దశి ఉదయం 07.37 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం కృత్తిక పగలు 03.12 వరకు ఉపరి రోహిణి యోగం శివ ఉదయం 11.45 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

భౌ భౌ…! భౌ భౌ…భౌ!!|DOGS|INDIA|SUPREME COURT

విచ్చలవిడిగా విస్తరిస్తోన్న వీధి కుక్కలు రెచ్చిపోతున్న పిచ్చి కుక్కలు కరచి, రక్కి, కొరికి పారేస్తున్న శునకాలు నియంత్రణకు ‘సుప్రీం’ ఆదేశాలు సాదుకునే రోజుల నుంచి... కుక్కలంటే భయపడే రోజులొచ్చాయ్ కుక్కకు కూడా ఓ రోజొస్తుందంటే ఏమో అనుకున్నాం! నిజంగానే...

ఒకే కుటుంబం నుంచి ఐదుగురు సర్పంచ్ పోటీదారులే|PANCHAYATI TRENDS

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ ఈ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఎస్సీ జనరల్‌గా రిజర్వ్‌ అయిన ఈ పంచాయతీ సర్పంచ్ పదవికి ఒకే కుటుంబానికి చెందిన...

గిదేం ఇచ్చెంత్రం!?|ADUGU TRENDS

‘నీల్లు పల్లమెరుగు.. నిజం దేవుడెరుగు!’ అన్నరు. నిజం సంగతేమో గనీ, నీల్లయితే పల్లానికే పోతయి గదా! నిజమా? కాదా? కనీ, ఓ దగ్గర మాత్రం నీల్లు మిట్టకు పోతున్నయుల్లా!? గిదైతే నిజమో, అబద్దమో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News