Trending News
Sunday, December 7, 2025
17.2 C
Hyderabad
Trending News

ప్రగతి పథంలో పాలకుర్తి

వందకు వంద శాతం రిజర్వాయర్లు పూర్తి
పార్టీని కాపాడే బాధ్యత మీది
మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది
పిచ్చి ప్రేలాపణలు, తుచ్ఛ ప్రచారాలు మానుకోండి
లాలూ‘ఛీ’లు పడకండి… లూజ్ టాక్ చేయకండి
బదనాం చేయాలని చూస్తే భరతం పడతా?
పజీత చేయాలని చూసే వారి పని పడతా?

పార్టీ అంటే నేనో, లేక మరెవరో కాదు. పార్టీ అంటే బ్లాక్, మండల పార్టీ అధ్యక్షులు మాత్రమే కాదు. పార్టీ అంటే కార్యకర్తలు, పార్టీ అంటే ప్రజలు… మీరంతా పార్టీని కాపాడండి.. మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది. కాదని పార్టీని పజీత చేయాలని చూస్తే, వారి పనిపడతా… బదనాం చేసే వారి భరతం పడతా? అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి హెచ్చరించారు. పాలకుర్తిని ప్రగతి పథంలో నడిపించే బాధ్యత నాది… పార్టీని కాపాడే బాధ్యత కార్యకర్తలు, ప్రజలు తీసుకోవాలని హితవు పలికారు. చివరకు పార్టీ కార్యాలయానికి ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానులను కూడా కొందరు ప్రతిపక్షనేతలు బెదిరించే నీచ స్థాయికి దిగజారారని, తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని, కొందరు ముసలి నక్కలు, కుయుక్తులు పన్నుతున్నాయని ఎద్దేవా చేశారు. అలాంటి వారెవరినీ వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తిలో కొత్త భవనంలో పార్టీ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించిన ఎమ్మెల్యే ఘాటుగానే మాట్లాడారు.

గత పాలకులు తమ కాలంలో తాము చేసిన తప్పులు ఎక్కడ బయటపడుతాయోననే భయంతో తప్పుడు ప్రచారాలు, పిచ్చి ప్రేలాపనలకు దిగుతున్నారన్నారు. చివరకు పార్టీ కార్యాలయానికి ఇచ్చిన యజమానిని కూడా బెదిరించారు. భయపెట్టించారు. అయినా ధైర్యంగా నిలబడి, కాంగ్రెస్ పార్టీకి కార్యాలయం కోసం తమ ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యాలయం నుండే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయాలు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే చమత్కరించారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కష్టపడి సైనికుల్లా పనిచేసి గెలిపించారో, అదే విధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మనమంతా శక్తి వంచన లేకుండా పనిచేయాలని కోరారు. ఆ రోజు అధికార దుర్వినియోగానికి, అవినీతికి, అక్రమాలకు ఎదురు తిరిగి, నాకు అండగా నిలబడి, ఎంతో కష్టపడి నన్ను గెలిపించారు. మీరు లేకుండా నేను లేను. పార్టీ లేదు. అప్పటి లాగే ప్రజల, కార్యకర్తల అండదండలు మాకు కావాలని, ఇంతకుముందు కన్నా ఎక్కువ కష్టపడాలి. పార్టీని మీరు కాపాడాలి. మిమ్మల్ని మేము కాపాడుతాం. మీ మంచి చెడు చూసే బాధ్యత మాది. మీకు అండగా నిలబడతానని ఆమె అన్నారు. పాలకుర్తి పురోగతికి పాటు పడతామని ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే, పార్టీ అభివ్రుద్ధి పనులు, అమలవుతున్న పథకాలపై ప్రజల్లో ప్రచారం చేయాలని సూచించారు. మన పథకాల గురించి ప్రజలకు చెప్పండి. మనం చేసే మంచిని చర్చించాలి. మనం చేసేది ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సింది మీరే అన్నారు.

అయితే, కొందరు పనిగట్టుకుని మరీ.. పార్టీపై, ప్రభుత్వ పథకాలపై, మాపై లూజ్ టాక్ చేస్తున్నారని తెలిసింది. అలాంటి వారి వెంట పడతాను. వారి భరతం పడతా. పార్టీలోనే ఉంటూ, కోవర్టులుగా పని చేస్తున్న వారి రాజకీయ జీవితాన్ని క్లోజ్ చేస్తానని హెచ్చరించారు. ఇలాంటి వారికి మన చేసే అభివ్రుద్ధితోనే బుద్ధి చెప్పాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

తాను పాలకుర్తి ప్రగతి కోసం అహర్నిశలు పాటు పడుతున్నానని చెప్పారు. ఒక్కొక్క పని కోసం నేను చేస్తున్న కష్టం మీకేం తెలుసు. ఏయే ప్రాంతాల్లో ఏమేం చేయాలన్నదానిపైనే నేను ఆలోచిస్తున్నాను.
ఈ మధ్య కాలంలో సిఆర్ఆర్ఎంఆర్ కింద 50 కోట్ల నిధులు తెచ్చాను. మన పాలకుర్తి బస్టాండ్ కూడా మనం అనుకున్నట్లు అభివృద్ధి చేసి చూపిస్తాను. చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లు వందకు వంద శాతం పూర్తి చేస్తాను. దేవరుప్పుల మండలంలో రూ.150 కోట్లతో 131 కెవి సబ్ స్టేషన్ మంజూరు అయింది. కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రపోజల్ పెట్టిన… కొద్ది రోజుల్లోనే మంజూరు అయితది. కొడకండ్లలో టెక్స్టైల్ పార్క్ కూడా చేసి చూపిస్తా… రాయపర్తి మండలంలో రూ.14 కోట్లతో గోదాము మంజూరు అయింది. టెండర్లు కూడా పూర్తి అయినాయి. పాలకుర్తిలో 50 పడకల హాస్పిటల్ కు టెండర్లు పూర్తి అయి అగ్రిమెంట్ కూడా ఈ మధ్య అయిపోతుంది. తొర్రూరులో కూడా 100 పడకల హాస్పిటల్ కూడా అయిపోతుంది. అలాగే తొర్రూరులో మినీ ట్యాంక్ బండ్ కూడా పూర్తి చేస్తున్నాం. నియోజకవర్గ అభివృద్ధికి వచ్చిన నిధుల నుండి రూ.5 కోట్లు కేటాయించిన… అట్లనే మొన్న డిప్యూటీ సీఎం భట్టి గారి పేషీలో 3 గంటలు కూర్చున్న… మిగతా ఎమ్మెల్యేలు విసుగు వచ్చి వెళ్ళిపోయినా సరే, నేను మాత్రం వెళ్ళి మాట్లాడి రూ.20 కోట్ల నిధులు తెచ్చాను. అని ఎమ్మెల్యే వివరించారు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి. ఇవి అన్ని నేను సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నా… నాకు ప్రచారం డంబాచారం కాదు కావలసింది. మనల్ని నమ్ముకున్న పాలకుర్తి ప్రజలకు న్యాయం చేయడమే నాకు ముఖ్యం అన్నారు. ఎమ్మెల్యే అయిపోయిన.. ఇక నాకేంటి? అని చేతులు ముడుచుకుని చైర్ లో కూర్చోవడం కాదు, గెలిపించిన ప్రజల కష్టాలు తీర్చడం, కష్టపడి గెలిపించిన కార్యకర్తలను కాపాడుకోవడం. అవే నేను చేయాల్సింది నేను చేస్తున్నా అని యశస్వినీ రెడ్డి వివరించారు. నేను దీనిని శ్రమ అనుకోవడం లేదు. బాధ్యతగా భావిస్తున్న…ఇది నా కర్తవ్యం. నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన… చేస్తున్న… ప్రజలకు సేవ చేస్తుంటే ఆనందంగా కూడా ఉన్నది. పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటారని ఆశిస్తున్నానని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Latest News

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

గురువారం డిసెంబర్ 04–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--శుక్లపక్షం దత్తాత్రేయ జయంతి తిధి శు.చతుర్దశి ఉదయం 07.37 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం కృత్తిక పగలు 03.12 వరకు ఉపరి రోహిణి యోగం శివ ఉదయం 11.45 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

భౌ భౌ…! భౌ భౌ…భౌ!!|DOGS|INDIA|SUPREME COURT

విచ్చలవిడిగా విస్తరిస్తోన్న వీధి కుక్కలు రెచ్చిపోతున్న పిచ్చి కుక్కలు కరచి, రక్కి, కొరికి పారేస్తున్న శునకాలు నియంత్రణకు ‘సుప్రీం’ ఆదేశాలు సాదుకునే రోజుల నుంచి... కుక్కలంటే భయపడే రోజులొచ్చాయ్ కుక్కకు కూడా ఓ రోజొస్తుందంటే ఏమో అనుకున్నాం! నిజంగానే...

ఒకే కుటుంబం నుంచి ఐదుగురు సర్పంచ్ పోటీదారులే|PANCHAYATI TRENDS

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ ఈ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఎస్సీ జనరల్‌గా రిజర్వ్‌ అయిన ఈ పంచాయతీ సర్పంచ్ పదవికి ఒకే కుటుంబానికి చెందిన...

గిదేం ఇచ్చెంత్రం!?|ADUGU TRENDS

‘నీల్లు పల్లమెరుగు.. నిజం దేవుడెరుగు!’ అన్నరు. నిజం సంగతేమో గనీ, నీల్లయితే పల్లానికే పోతయి గదా! నిజమా? కాదా? కనీ, ఓ దగ్గర మాత్రం నీల్లు మిట్టకు పోతున్నయుల్లా!? గిదైతే నిజమో, అబద్దమో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News