జనగామ జిల్లా పేరు మార్చొద్దని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం
జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున అంబేద్కర్ విగ్రహం వద్ద సమావేశమైన జనగామ జిల్లా జేఏసీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపి, జనగామ జిల్లా పేరు మార్చే ఉద్యమాలు చేయొద్దని కుల సంఘాలకు విజ్ఞప్తి చేశారు అదేవిధంగా ప్రభుత్వం కూడా పేరు మార్చే చర్యలు చేపట్టొద్దని జనగామ జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు డిమాండ్ చేశారు. జనగామ అనే పేరు ఒక చారిత్రక నేపథ్యం ఉన్న ప్రజా చైతన్యం తీసుకువచ్చే తీరని పేరు అని జనగామ గడ్డపై ఎందరో మహనీయులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగి నల్ల నర్సింహులు, చుక్క సత్తయ్య బమ్మెర పోతన పాల్కూరు సోమనాథుడు ఇంకా ఎందరో గొప్ప నాయకులను కన్న గడ్డగా వీరగడ్డగా జనగామకు ఒక చారిత్రక నేపథ్యంతో కూడిన పేరు కొనసాగుతూ వస్తుంది ఇటువంటి పేరును మార్చడం అంటే తల్లి పేరును మార్చడమే అవుతుంది కాబట్టి మహనీయుల పేర్లు పెట్టడానికి జనగామ జిల్లా అభివృద్ధి చేసి లైబ్రరీకి ఆడిటోరియాలకి చౌరస్తా కి కొత్త మండలాలకి ఇంకా ప్రత్యేకమైన కార్యక్రమాలు ద్వారా జనగామ గడ్డపై పుట్టిన వీరులకు నివాళులు అర్పించారే తప్ప జనగామ జిల్లా పేరు మార్చాలని ఆలోచన ఏ కుల సంఘం కూడా చేయకూడదని జనగామ జేఏసీ పక్షాన చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నట్టు జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు తెలిపారు ఈ కార్యక్రమంలో టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల సురేష్ బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఆసర్ల సుభాష్ వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నల్లరావు టీజీవిపి పట్టణ అధ్యక్షుడు వెంపటి అజయ్ మహమ్మద్ ఇమ్రాన్ మహమ్మద్ అప్రోచ్ తదితరులు పాల్గొన్నారు..

