నగరంలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. మూసాపేట వై జంక్షన్లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని మౌనికగా గుర్తించారు. స్కూటీపై వెళ్ళిన మౌనికను వేగంగా వచ్చిన ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

