ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విద్యార్థుల విద్యను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ పథకం ద్వారా స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15,000 ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే, ఏప్రిల్లో మత్స్యకార భరోసా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించేందుకు మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులు తీసుకోవాలని ఆదేశించారు.

