Trending News
Sunday, December 7, 2025
17.2 C
Hyderabad
Trending News

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ నిర్మించడమే లక్ష్యం

యువత డ్రగ్స్ కి దూరంగా వుండాలి

యువత దేశాభివృద్ధికి ఆలోచించాలి

పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సే నో టూ డ్రగ్స్ అవగాహన సదస్సు, భారీ ర్యాలీ

ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఎల్ఏ యశస్విని, నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి

పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు “సే నో టూ డ్రగ్స్” పేరుతో భారీ సదస్సును నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ… డ్రగ్స్ వినియోగం వల్ల వ్యక్తిగత, కుటుంబ, సమాజంపై కలిగే దుష్ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మున్ముందు యువత డ్రగ్స్ వైపు మళ్ళకుండా తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు, యువతలో అవగాహన పెంపొందించడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “సే నో టూ డ్రగ్స్” అనేది కేవలం నినాదం మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తవంగా పాటించాల్సిన ఒక సామాజిక బాధ్యతగా మలచాలని ఎమ్మెల్యే యశస్విని అన్నారు. యువత, విద్యార్థులు తమ జీవితాల్లో మంచి లక్ష్యాలను ఏర్పరచుకుని, వాటి సాధన కోసం కృషి చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నారు అన్నారు. అలాగే సమాజంలో అందరి బాధ్యతగా డ్రగ్స్ లేని తెలంగాణను నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ….డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు, నేరప్రవృత్తి పెరిగే ప్రమాదాలు ఉన్నాయి అన్నారు. పాలకుర్తిలో డ్రగ్స్ నివారణకు మనమంతా పూనుకోవాలని అన్నారు. యువత మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తే ఇలాంటి తప్పుడు దారిలోకి వెళ్లొద్దు అన్నారు. డ్రగ్స్ వ్యతిరేక చర్యలను మరింత ఉద్గ్రతరం చేసి, శాశ్వతంగా ఈ సమస్యను నిర్మూలించడానికి ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేయాలని ఆమె స్పష్టం చేశారు. ఆత్మీయ అతిథులుగా హాజరైన ఎక్సైజ్ డీఎస్పీ, పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…. డ్రగ్స్ ద్వారా జరిగే అనర్థాలను వివరించారు.

ఈ సందర్భంగా అంతకముందు నిర్వహించిన భారీ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో ముందుకు సాగారు. ర్యాలీ ద్వారా ప్రజల్లో డ్రగ్స్ వ్యతిరేక పోరాటం మీద చైతన్యం కలిగించారు. కార్యక్రమంలో డ్రగ్స్ నివారణకు సంబంధించిన పోస్టర్లు, బొమ్మలు ప్రదర్శించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు మార్కెట్ చైర్మెన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, కొడకండ్ల, పాలకుర్తి మార్కెట్ చైర్పర్సన్లు, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/bFCGlRr01YU?si=Yha8ib0M3auhfh7f

Latest News

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

గురువారం డిసెంబర్ 04–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--శుక్లపక్షం దత్తాత్రేయ జయంతి తిధి శు.చతుర్దశి ఉదయం 07.37 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం కృత్తిక పగలు 03.12 వరకు ఉపరి రోహిణి యోగం శివ ఉదయం 11.45 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

భౌ భౌ…! భౌ భౌ…భౌ!!|DOGS|INDIA|SUPREME COURT

విచ్చలవిడిగా విస్తరిస్తోన్న వీధి కుక్కలు రెచ్చిపోతున్న పిచ్చి కుక్కలు కరచి, రక్కి, కొరికి పారేస్తున్న శునకాలు నియంత్రణకు ‘సుప్రీం’ ఆదేశాలు సాదుకునే రోజుల నుంచి... కుక్కలంటే భయపడే రోజులొచ్చాయ్ కుక్కకు కూడా ఓ రోజొస్తుందంటే ఏమో అనుకున్నాం! నిజంగానే...

ఒకే కుటుంబం నుంచి ఐదుగురు సర్పంచ్ పోటీదారులే|PANCHAYATI TRENDS

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ ఈ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఎస్సీ జనరల్‌గా రిజర్వ్‌ అయిన ఈ పంచాయతీ సర్పంచ్ పదవికి ఒకే కుటుంబానికి చెందిన...

గిదేం ఇచ్చెంత్రం!?|ADUGU TRENDS

‘నీల్లు పల్లమెరుగు.. నిజం దేవుడెరుగు!’ అన్నరు. నిజం సంగతేమో గనీ, నీల్లయితే పల్లానికే పోతయి గదా! నిజమా? కాదా? కనీ, ఓ దగ్గర మాత్రం నీల్లు మిట్టకు పోతున్నయుల్లా!? గిదైతే నిజమో, అబద్దమో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News