Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

ఫార్ములా-ఈ రేస్ కేసు నమోదు పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫార్ములా-ఈ రేస్ చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రంగా స్పందించారు. ఫార్ములా-ఈ రేస్ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి & ప్రభుత్వం చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. దీనిని లాత్కొర్ పని అంటూ విమర్శించారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ పెట్టమని మేము కోరడం వాస్తవానికి నిజాలు చెప్పడమే మా ప్రయత్నమేనని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, “గత రెండు రోజులుగా స్పీకర్‌ను అసెంబ్లీలో చర్చకు అనుమతించాలని కోరుతున్నాం. మమ్మల్ని కుంభకోణంలో లాగడమే లక్ష్యమని, కానీ వారి ప్రయత్నాలు ఫలించవని,” తేల్చిచెప్పారు. నాలుగు గోడల మధ్యనే మాట్లాడితే ప్రజలు తెలుసుకోలేరని, 4 కోట్ల మంది ప్రజల ముందే ఈ విషయంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.

ఫార్ములా-ఈ రేస్ పట్ల  అప్పటి ప్రభుత్వ దృక్కోణం
ఫార్ములా-ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద మైలురాయిగా చెప్పొచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా పర్యావరణానికి హాని లేకుండా మెరుగైన రేసింగ్‌ ప్రోత్సహించడమే కాదు, రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు.

“మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే 2001లో ఫార్ములా-1 రేస్‌ను దేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో పర్మనెంట్ ట్రాక్ కోసం గోపన్‌పల్లి ప్రాంతంలో 580 ఎకరాల భూమిని భూసేకరణ చేయడానికి నోటీసులు కూడా ఇచ్చారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని,” కేటీఆర్ తెలిపారు.

ఫార్ములా-1 ట్రాక్ కోసం కేటాయించిన భూముల్లో రేవంత్ రెడ్డికి 15 ఎకరాల భూమి ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఈ వివరాలను 2023 ఎన్నికల అఫిడవిట్‌లో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారని పేర్కొన్నారు. అయితే, రేసింగ్‌ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదని విమర్శించారు.

ఫార్ములా-ఈ రేస్ ప్రపంచవ్యాప్తంగా ద్రవ ఇంధనాలకు ప్రత్యామ్నాయం కోసం ఏర్పాటవుతుండగా, తెలంగాణ ఈ కార్యక్రమాన్ని ముందుకు తెచ్చి విజయవంతం చేసిందని కేటీఆర్ వెల్లడించారు. “విశ్వవ్యాప్తంగా రేసింగ్‌లో పెద్ద మార్పు వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలు చొరవ తీసుకోవడం వల్ల కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణానికి మేలు చేకూర్చడం జరుగుతోంది. ఇలాంటి రేసింగ్ ఈవెంట్ల ద్వారా నగరాలకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. హైదరాబాద్ ఈ విషయంలో ముందంజ వేసింది,” అన్నారు.

2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత, పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం 14 కీలక రంగాలను గుర్తించిందని, వాటిలో ఆటోమొబైల్, పునరుత్పాదక ఇంధన రంగాలను ప్రాధాన్యంగా తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ రెండింటి కలయికగా ఎలక్ట్రిక్ వాహనాలు అభివృద్ధి చెందాయని అన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా రాష్ట్రం ముందడుగు వేసిందని వివరించారు.

మొనాకో సిటీ గ్రాండ్ ప్రీ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాగే, యూపీలోని నోయిడాలో జేపీ గ్రూప్ నిర్మించిన ట్రాక్‌లో ఫార్ములా-1 రేస్‌లు జరిగినప్పటికీ, అవి మూడేండ్లకు మాత్రమే పరిమితమయ్యాయని చెప్పారు. ఫార్ములా-4 రేసింగ్‌ ఇటీవల చెన్నైలో, జమ్మూకశ్మీర్‌లో జరిగిన సందర్భాలను గుర్తుచేశారు. అమిత్ షా కూడా ఫార్ములా-4 రేస్‌ను ప్రశంసించారని, ఈ విధమైన ఈవెంట్లు భారత దేశానికి గర్వకారణమని అన్నారు.

రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, అసలు వారి ఉద్దేశ్యం కేవలం ప్రజల దృష్టిని మరల్చడమేనని కేటీఆర్ ఆరోపించారు. “ఫార్ములా-ఈ రేస్‌పై ప్రభుత్వం సరిగ్గా సమాధానం ఇవ్వగలదని నమ్మకం లేదు కాబట్టే వారు చర్చకు రావడం లేదు,” అన్నారు.

రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల మానసికత సాడిస్ట్‌గా ఉందని విమర్శించిన కేటీఆర్, ప్రజల మనోగతాలు గౌరవించకపోవడం వారి వైఫల్యమని అన్నారు. “ప్రజల కోసం ప్రభుత్వ విధానాలను తెచ్చే ప్రయత్నం చేస్తేనే అభివృద్ధి సాధ్యం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం అవాంఛనీయ ఆరోపణలు చేస్తున్నాయి,” అని అభిప్రాయపడ్డారు.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News