ఎద్దుకు యెవుసానికి లెంక. గట్లనే రైతుకు ఎడ్లకు కూడా లెంకే. గిప్పుడంటే కొత్తకొత్త పనిముట్లు వచ్చినయి గనీ, యెనుకటికి గా ఎడ్లు లేనిదే యెవుసం లేదు. మోటకు, బండికి, గొర్రుకు, గుంట్కకు, దంతె, బంతి, నాగలికి ఎడ్లే. మనిషి కంటే ఎడ్లే ఎక్కువ. ఇగ పాలకైతే ఆవులే. గందుకే రైతుకు గా పశువులకు మనిషి మనిషికంటే ఎక్కువ సంబంధం. గందుకే పసువులకు పాక గడ్తం. గనీ గీ రైతన్న ఏకంగా ఇల్లే గట్టిండు. ఎడ్లకు దాన తినడాన్కి ఓ ప్లాట్ ఫారం కట్టిండు. ఎండా, వానా, చలి రాకుండా మంచి రచ్చణ చేసిండన్నట్లు. ఇగ గిది జూసినోల్లు ఔరా అని ముక్కున యేలేసుకుంటాండ్లు.
ఎడ్లకు ఏకంగా ఇల్లే కట్టిండు!?|ADUGU TRENDS

