Trending News
Sunday, December 7, 2025
17.2 C
Hyderabad
Trending News

Bc|బలహీన వర్గాలకు న్యాయం చేయడమే Government|ప్రభుత్వ లక్ష్యం|Goal

Assembly|శాసనసభలో CM|ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి|Revanth Reddy

తెలంగాణ శాసనసభ బీసీ రిజర్వేషన్ల అంశంపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బలహీన వర్గాలకు అనుమానం కలిగేలా అబద్ధపు ప్రచారాలు చేయొద్దని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను కోరారు. Resrvations|రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వమే చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. మొదట బీసీల వివరాలను సేకరించే బాధ్యత STATE BC COMMISSION|రాష్ట్ర బీసీ కమిషన్‌కు అప్పగించామని చెప్పారు. అయితే, బీసీ కమిషన్ కాకుండా ప్రత్యేక డెడికేషన్ కమిషన్|DEDICATION COMMISSION ద్వారా సమాచార సేకరణ జరగాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ (30381/2024) వేశారని, ఆ పిటిషన్ విచారణ అనంతరం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఆయన చెప్పారు. ఈ ఆదేశాలు వచ్చిన వెంటనే చిత్తశుద్ధితో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి కుల సర్వే చేపట్టామని ఆయన తెలిపారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కుల సర్వే జరిపామని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను పరిశీలించి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకున్నామని, అధికారుల కమిటీని, మంత్రులను బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు పంపించి సమాచారాన్ని సేకరించామని ఆయన శాసనసభ్యులకు వివరించారు. న్యాయపరమైన సమస్యలను విశ్లేషించిన తరువాతే డెడికేషన్ కమిషన్ నియమించామని చెప్పారు. అలాగే ఈ ప్రక్రియను 2024 ఫిబ్రవరి 4న ప్రారంభించి 2025 ఫిబ్రవరి 4న పూర్తిచేశామని, ఏడాదిలో పకడ్బందీగా చట్టాన్ని రూపొందించి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు మంత్రివర్గ తీర్మానం చేసి, శాసనసభలో ఆమోదం పొంది రెండు వేర్వేరు బిల్లులను గవర్నర్‌కు పంపించామని తెలిపారు. అయితే, గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపారని, ఆ బిల్లులు గత ఐదు నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా, సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. 2018లో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు గుదిబండగా మారిందని విమర్శించారు. అందుకే తమ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసే చర్యలు తీసుకువచ్చిందని, కానీ గవర్నర్ ఆ ఆర్డినెన్స్‌ను కూడా రాష్ట్రపతికి పంపారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెరవెనక లాబీయింగ్ కారణంగానే ఆర్డినెన్స్ ఆమోదం పొందలేదని, అత్యవసరమైతే బిల్లును తిరిగి సభలో ఆమోదించుకుంటామని చెప్పారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం పట్ల గంగుల కమలాకర్ సంతోషంగా ఉన్నారని, కానీ ఆయన పార్టీ నాయకులు మాత్రం అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీ కమిషన్ గానీ, డెడికేషన్ కమిషన్ గానీ ఏది అయినా తమ ఉద్దేశం బలహీన వర్గాలకు న్యాయం చేయడమేనని స్పష్టం చేశారు. అదే సమయంలో, ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లలేదని GANGULA KAMALAKAR|గంగుల కమలాకర్ ఆరోపణలపై స్పందిస్తూ, ప్రధానికి ఐదుసార్లు లేఖ రాసినా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, అందుకే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టామని తెలిపారు. ఆ ధర్నాకు వివిధ రాష్ట్రాల 100 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారని, అయితే బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు మాత్రం పాల్గొనలేదని విమర్శించారు. దీంతో BRS|బీఆర్ఎస్‌కు బీసీలపై చిత్తశుద్ధి ఉందో…లేదో… అర్థమవుతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు కూడా సభలో గందరగోళం సృష్టించి బిల్లులు ఆమోదం పొందకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగించేలా ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డే|Social Justice Day|గా జరుపుకోవాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వందేళ్లుగా చేయని పనిని తమ ప్రభుత్వం ప్రారంభించిందని, ఆ ప్రయత్నాన్ని అభినందించాల్సింది పోయి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. గంగుల కమలాకర్ బలహీన వర్గాల ప్రయోజనాల విషయంలోనైనా ఒత్తిడులకు లొంగరాదని కోరారు. బలహీన వర్గాలు ఒకరినొకరు అవమానించుకోవడం మానుకుని ఏకతాటిపై రావాలని సూచించారు. మొత్తంగా, బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఈ లక్ష్యానికి అనుగుణంగానే అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

Latest News

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

గురువారం డిసెంబర్ 04–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--శుక్లపక్షం దత్తాత్రేయ జయంతి తిధి శు.చతుర్దశి ఉదయం 07.37 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం కృత్తిక పగలు 03.12 వరకు ఉపరి రోహిణి యోగం శివ ఉదయం 11.45 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

భౌ భౌ…! భౌ భౌ…భౌ!!|DOGS|INDIA|SUPREME COURT

విచ్చలవిడిగా విస్తరిస్తోన్న వీధి కుక్కలు రెచ్చిపోతున్న పిచ్చి కుక్కలు కరచి, రక్కి, కొరికి పారేస్తున్న శునకాలు నియంత్రణకు ‘సుప్రీం’ ఆదేశాలు సాదుకునే రోజుల నుంచి... కుక్కలంటే భయపడే రోజులొచ్చాయ్ కుక్కకు కూడా ఓ రోజొస్తుందంటే ఏమో అనుకున్నాం! నిజంగానే...

ఒకే కుటుంబం నుంచి ఐదుగురు సర్పంచ్ పోటీదారులే|PANCHAYATI TRENDS

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ ఈ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఎస్సీ జనరల్‌గా రిజర్వ్‌ అయిన ఈ పంచాయతీ సర్పంచ్ పదవికి ఒకే కుటుంబానికి చెందిన...

గిదేం ఇచ్చెంత్రం!?|ADUGU TRENDS

‘నీల్లు పల్లమెరుగు.. నిజం దేవుడెరుగు!’ అన్నరు. నిజం సంగతేమో గనీ, నీల్లయితే పల్లానికే పోతయి గదా! నిజమా? కాదా? కనీ, ఓ దగ్గర మాత్రం నీల్లు మిట్టకు పోతున్నయుల్లా!? గిదైతే నిజమో, అబద్దమో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News