Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

ప్రకృతే పర్యావరణానికి స్నే‘హితం’!|CLAY GANESHA

మట్టి వినాయక విగ్రహాలే సముచితం
అడుగు డిజిటల్ మీడియా పంపిణీ ఉచితం
సహకరించిన వారి మిత్రులు అభినందనీయం
నియోజకవర్గ ప్రజలకు MLA|ఎమ్మెల్యే యశస్వినీ|YASHASWINI శుభాకాంక్షలు

పాలకుర్తి, ఆగస్టు 26 (అడుగు న్యూస్):
గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని కోరుతూ, అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వలన నీటి వనరులు కలుషితమవుతున్న పరిస్థితిని నివారించేందుకు మట్టి వినాయకులనే వినియోగించాలని ప్రజలకు అడుగు డిజిటల్ మీడియా పిలుపునిచ్చింది. పాలకుర్తి మండల కేంద్రంలో, శివసాయి కిరాణం & జనరల్ స్టోర్స్ అధినేత చారగొండ్ల రవి కుమార్ సహకారంతో అడుగు డిజిటల్ మీడియా, మార్గం ఫౌండేషన్ & స్టూడెంట్ ఫర్ సేవ ట్రస్ట్ సంయుక్తంగా రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి అడుగు డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆయా సంస్థల చైర్మెన్ మార్గం సాయి సందేశ్ తేజ సభ అధ్యక్షత వహించగా, స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా, చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ విశిష్ట అతిథిగా హాజరై ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ తెలంగాణ, తన నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. రసాయనాలు లేని మట్టి వినాయక విగ్రహాలు నీటిలో కలిసిపోయేలా ఉంటాయి. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడానికి ఈ సంప్రదాయం ఎంతో మేలుగా నిలుస్తుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో చిన్నప్పటి నుంచే పర్యావరణ హితమైన ఆచారాలను అలవాటు చేయాలని సూచిస్తూ, భక్తి భావన ప్రకృతిని హానిచేయకూడదు. మట్టి వినాయకుల వినియోగం ద్వారా మన భక్తి ప్రకృతి మాతకు మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అడుగు డిజిటల్. మీడియా యాజమాన్యం గురించి ఎంత చెప్పిన తక్కువేనని అన్నారు. వారి సేవలు చరిత్రాత్మకమైనవిగా అభివర్ణించారు. ఇలాంటి కార్యక్రమాలకు అడుగు చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ కుటుంబం ముందుంటుందని చెప్పారు. ఇదే సందర్భంలో ఈ కార్యక్రమానికి సహకరించిన చారగొండ్ల రవి కుమార్ కుటుంబాన్ని కూడా అభినందించారు. అనంతరం అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, మట్టి వినాయకుల వినియోగం వల్ల కలిగే లాభాలను వివరించి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకాలు నీటి వనరులకు కలిగించే నష్టాలను ప్రజలకు వివరించారు. మా బృందం ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ప్రజలు పర్యావరణ హిత ఆలోచనలు చేయాలని, మట్టి గణపతిని మహా గణపతిగా పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన చారగొండ్ల రవి కుమార్ కుటుంబానికి, అన్ని తానై కార్యక్రమాన్ని రూపొందించి, విజయవంతం చేసిన అడుగు డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందేశ్ తేజ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దూలం పవన్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గూడూరు లెనిన్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మారం రవి కుమార్, ఆర్యవైశ్య సంఘం మాజీ మండల అధ్యక్షుడు చీదర జగదీష్, సంగి వెంకన్న, రమేష్, బోనగిరి సాగర్, బోనగిరి కృష్ణమూర్తి, మణికంఠ సోమన్న, మార్గం సారంగపాణి, అనంతుల సోమేశ్వర్, వైట్ల శ్రీహరి, మార్కండేయ, పోగు రాములు, గోనె మహేందర్ రెడ్డి, దుంపల సంపత్, సతీష్, జంపాల రాజు, రాపాక అనిల్, పెద్దూరి సోమన్న, రాపాక ఉపేందర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News