Trending News
Sunday, December 7, 2025
17.2 C
Hyderabad
Trending News

వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబైన రెండు రాష్ట్రాలు|TELANGANA|AP

హైదరాబాద్ డెస్క్, ఆగస్టు 26 (అడుగు న్యూస్):
వినాయక చవితి ఉత్సవాలకు గణనాథుడు ముస్తాబయ్యాడు. రెండు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో, పలు పట్టణాల్లో, గ్రామాల్లో, గల్లీలో గణనాథులను ప్రతిష్టించి, పూజలు చేయనున్నారు. అందులో భాగంగా రాజస్థాన్‌ కళాకారులు పీవోపీ, తాటిపీచు, కొబ్బరిపీచుతో వివిధ ఆకృతులు, రంగుల్లో గణనాథులు, పర్యావరణ ప్రేమికులు మట్టితో విగ్రహాలను తయారుచేశారు. అడుగు ఎత్తు నుంచి 20 అడుగుల విగ్రహాలను గణేశ్‌ ఉత్సవ నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. విగ్రహాల ఎత్తును బట్టి వేల నుంచి లక్షల ధర పలుకుతోంది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ గణేష్ పూజలకు ముస్తాబయ్యాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు చోట్ల భారీ విగ్రహాలు పూజలు అందుకొనున్నాయి.

పాలకుర్తిలో:
జనగామ జిల్లా, పాలకుర్తి మండల కేంద్రంలో మొట్ట మొదటి వినాయకుడిని ప్రతిష్టించి, నేటికి ఎన్నో ఏళ్లుగా నవరాత్రులు నిర్వహిస్తున్న క్రాంతి యూత్ ఈ సారి బాల గణేషుడిని ప్రతిష్టించి పూజలు చేయనున్నట్లు బాధ్యులు తెలిపారు. అలాగే ఎంతో చరిత్ర కలిగిన గుడివాడ విఘ్నేశ్వర కమిటీ ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించి,పూజిస్తూ, ఈ ఏడాది 50వ సంవత్సరంలోకి వస్తున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా గుడివాడ విఘ్నేశ్వర కమిటీ అధ్యక్షుడు చారగొండ్ల శివ & వారి బృందం రామకృష్ణ, రేపాల అశోక్, చాట శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్తి హంగులతో పర్మినెంట్ మండపం నిర్మించి, గణేషుడిని ప్రతిష్టించి పూజలు చేయనున్నారు. ఈ ఉత్సవాలకు 15 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అడుగుతో కమిటీ అధ్యక్షుడు శివ ఫోన్ లో మాట్లాడుతూ, ఈ సారి భారీ ఎత్తున, ఊహించని రీతిలో నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సారి తమ కుటుంబమే దాతగా మట్టి గణపతిని ఇస్తున్నట్లు తెలిపారు.

గణనాథుని ప్రతిష్ఠకు పర్మినెంట్ పనులు
గుడివాడ విఘ్నేశ్వర కమిటీ ప్రతిష్టించనున్న మట్టి గణపతి
క్రాంతి యూత్ బాల గణేశుడు

నిబంధనలు పాటించాల్సిందే..

ఆహ్లాదకర వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు కృషి చేయాలని డీజీపీ డా.జితేందర్ పిలుపునిచ్చారు. మండపాల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలు, భద్రతా అంశాలపై ఆయన సూచనలు చేశారు.

ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి

వినాయక ఉత్సవ కమిటీలు మండపాల ఏర్పాటు, ఉత్సవాలకు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. గణేశ్‌ ఉత్సవ.నెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో అవసరమైన వివరాలను నింపాలి. దరఖాస్తును పరిశీలించిన తర్వాత పోలీసులు అనుమతిస్తారు.

విద్యుత్‌ జాగ్రత్తలు:
విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్‌ వైరింగ్‌ను నిపుణులతో చేయించాలి.

సౌండ్‌ సిస్టమ్‌:
లౌడ్‌ స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలి. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మతపరమైన ప్రదేశాల వద్ద మైకులు వాడకూడదు.

నిఘా:
మండపాలలో రాత్రిపూట కమిటీ సభ్యులు కాపలా ఉండాలి. మండపాలలో విలువైన వస్తువులను ఉంచకూడదు. శాంతి భద్రతల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

రోడ్డు భద్రత:
విగ్రహాలను, మండపాలను రోడ్లపై ఏర్పాటు చేయరాదు. బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రజలకు, ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదు.

ఊరేగింపు, నిమజ్జనం నిబంధనలు

నినాదాలు, ప్రదర్శనలు:
ఊరేగింపు సమయంలో కులలాలు, మతాలు లేదా పార్టీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే నినాదాలు, అనుచిత ప్రదర్శనలు, అసభ్యకరమైన నృత్యాలు చేయకూడదు. డీజే, బాణసంచాకు అనుమతి లేదు.

వాహనాల నియమాలు:
నిమజ్జనం వాహనాలకు లైసెన్స్‌ ఉన్న డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలి. మద్యం సేవించిన వారు లేదా మైనర్లు వాహనంపై ఉండకూడదు.

నిమజ్జన సమాచారం:
నిమజ్జనం మార్గం, సమయం, తేదీ వివరాలను పోలీసులకు తప్పనిసరిగా తెలియజేయాలి. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా కమిటీ సభ్యులు తగినంత మంది వాలంటీర్లను ఏర్పాటు చేయాలి.

భద్రతా ఏర్పాట్లు:
నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి.

అవాంఛనీయ సంఘటన జరిగినా, జరగడానికి అవకాశం ఉన్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు లేదా డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు.

Latest News

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

గురువారం డిసెంబర్ 04–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--శుక్లపక్షం దత్తాత్రేయ జయంతి తిధి శు.చతుర్దశి ఉదయం 07.37 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం కృత్తిక పగలు 03.12 వరకు ఉపరి రోహిణి యోగం శివ ఉదయం 11.45 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

భౌ భౌ…! భౌ భౌ…భౌ!!|DOGS|INDIA|SUPREME COURT

విచ్చలవిడిగా విస్తరిస్తోన్న వీధి కుక్కలు రెచ్చిపోతున్న పిచ్చి కుక్కలు కరచి, రక్కి, కొరికి పారేస్తున్న శునకాలు నియంత్రణకు ‘సుప్రీం’ ఆదేశాలు సాదుకునే రోజుల నుంచి... కుక్కలంటే భయపడే రోజులొచ్చాయ్ కుక్కకు కూడా ఓ రోజొస్తుందంటే ఏమో అనుకున్నాం! నిజంగానే...

ఒకే కుటుంబం నుంచి ఐదుగురు సర్పంచ్ పోటీదారులే|PANCHAYATI TRENDS

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ ఈ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఎస్సీ జనరల్‌గా రిజర్వ్‌ అయిన ఈ పంచాయతీ సర్పంచ్ పదవికి ఒకే కుటుంబానికి చెందిన...

గిదేం ఇచ్చెంత్రం!?|ADUGU TRENDS

‘నీల్లు పల్లమెరుగు.. నిజం దేవుడెరుగు!’ అన్నరు. నిజం సంగతేమో గనీ, నీల్లయితే పల్లానికే పోతయి గదా! నిజమా? కాదా? కనీ, ఓ దగ్గర మాత్రం నీల్లు మిట్టకు పోతున్నయుల్లా!? గిదైతే నిజమో, అబద్దమో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News