Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

జీవ వైవిధ్యంతోనే జీవన సాఫల్యం!|EDITORIALS

ప్రకృతి మానవ జాతికి లభించిన గొప్ప వరం. ఈ సకల చరాచర ప్రపంచంలో అత్యంత విలువైనది ప్రకృతే. ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది. కానీ, అదే ప్రకృతికి మనమేం ఇస్తున్నాం? విధ్వంసం, వినాశనం చేయడం తప్ప! ఆవిధ్వంసమే ఇప్పుడు మొత్తం కేవలం ప్రకృతికే కాదు స్రుష్టి వినాశనానికే దారి తీస్తున్నది. మొక్కే కదా అని పీకేస్తే, చెట్టే కదా అని తొలగిస్తే, చెత్తే కదా అని వేసేస్తే, పొగే కదా అని వదిలేస్తే, అంతా చేయట్లేదా? నేనొక్కరినే కాదు కదా! అని నిర్లక్ష్యం వహిస్తే, ఏర్పడుతున్న విలయం అంతా అంతా ఇంతా కాదు. తనను తాను ఉద్ధరించుకుంటేనే ఉద్యమమైనా, విప్లవమైనా, చివరకు మార్పైనా, మరేదైనా.|EDITORIALS

ప్రకృతిని మనం కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతి మనుగడతోనే మన మనుగడ ఇమిడి ఉంది. భారతీయ సనాతన ధర్మం, సంస్క్రుతి, సంప్రదాయాలు మొత్తం ప్రకృతిని పూజించడం, ఆరాధించడంతోనే ముడిపడి ఉన్నాయి. జీవ వైవిధ్యం ప్రకృతిలోనే గాక, మన జీవన విధానంలోనూ పరంపరగా వస్తూ ఉంది. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని లను పంచభూతాలు అన్నాం. జీవధాతువే పంచభూతాల్లో సజీవంగా ఉంది. అందుకే మనం మన భూమిని మనకు జన్మనిచ్చే తల్లితో సమానంగా చూస్తాం. భూమాత, భూతల్లి అంటున్నాం. నీటినిచ్చే నదులన్నింటికీ తల్లికి సమానమైన స్త్రీలింగంతో కూడిన పేర్లే పెట్టుకున్నాం. చివరకు ఉగాది, బతుకమ్మలాంటి దాదాపు అన్ని పండుగలు కూడా ప్రకృతి సంబంధమైనవే. ప్రకృతితో మానవాళిది, జీవకోటిది విడదీయలేని పెనవేసుకున్న పేగు బంధం. ప్రకృతిని పూజించుకోవడం, అవసరమైన మేరకు అనుభవించడం, రక్షించుకోవడం, జీవ వైవిధ్యాన్ని మన భవిష్యత్తు తరాలకు అందించడమనే ప్రక్రియ మన జీవన విధానం చేసుకోవాలి. చెట్టును, పుట్టను పూజించడం వెనక ఉన్న మర్మం కూడా ఇదే.|EDITORIALS

నిజానికి మానవుడు భూమ్మీద పడినప్పటి నుండే ప్రకృతి విధ్వంసం మొదలైంది. మిగతా జీవరాశిలో విధ్వంసం కంటే జీవ వైవిధ్యమే ఉంటుంది. ప్రకృతి బహుషా మనిషి చేసినంత వినాశనం మరే జీవి చేయడం లేదనే అతిశయోక్తి కానే కాదు. ఈనాటి సునామీ లాంటి ప్రళయాల నుంచి, అతివ్రుష్టి, అనావ్రుష్టి, కరువు కాటకాలు, ప్రాణాంతక, అంటువ్యాధులు ప్రబలడం వరకు అంతా ప్రకృతితో ముడిపడినవే. అంతెందుకు మనం పీల్చేగాలి, నీరు, వాతావరణం మొత్తం కలుషితం కావడానికి మానవుడే అంటే మనమే కారణం. మానవ తప్పిదాల కారణంగా లేదా విధ్వంసం కారణంగా జీవజాతుల మనుగడ కూడా ప్రశ్నార్థకం అయింది. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. జీవరాశుల్లో, వనరుల్లో, భూమి మీద సకల స్రుష్టిలోనే సమతౌల్యం దెబ్బతిని జీవవైవిధ్యం సర్వనాశనమై నశించిపోతోంది. జీవ వైవిధ్యంపై ప్రజలలో అవగాహనను పెంచటానికి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా మే22న ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని’ జరుపు కోవాలని నిర్ణయించింది. ప్రతి ఏటా ఒక థీమ్ తో ప్రకృతి పరిరక్షణ, జీవ వైవిధ్యం వంటి అంశాలపై ప్రజల్లో విస్త్రుత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. కానీ, అది తత్ దినంలా మారి పోయింది.|EDITORIALS

భారతీయ సంస్కృతిలో భాగంగానే చెట్టు, చేమ, పశుపక్ష్యాదులను పూజించటం జరుగుతోంది. జీవజాతులు వివిధ రకాల సేవలను, ప్రయోజనాలను మానవ జాతికి, పర్యావరణానికి అందిస్తున్నాయి. పెంపుడు జంతువులు మనుషులకు చేదోడుగా ఉంటాయి. మనుషులతో మమేకమై జీవిస్తున్నాయి. ఇతర జంతుజాతులు కూడా ఒకదానిని ఒకటి ఆహారంగా తీసుకునే లక్షణం కారణంగా ఆయా జీవరాశుల వైవిధ్యం కూడా సమతౌల్యం అవుతున్నది. జీవ జాతుల జీవన క్రియల్లో విడుదల అయ్యే వ్యర్థాలు కూడా భూసారానికి ఉపయోగపడే విశిష్టత ప్రకృతిలోనే ఉండటం విశేషం. ఫలాలు, ఔషధ మొక్కలు, ఆహారాన్నిచ్చే మొక్కలు, వనరులు ఎంత అద్భుతమైనదీ స్రుష్టి. మానవ ఆహారం మొత్తం ప్రకృతి మనకు ఇస్తుంది. జీవవైవిధ్యంలో అత్యంత ప్రయోజనకరమైన జంతువ ఆవు. ఆవు పాలు, పేడ, మూత్రం, నెయ్యి ప్రకృతి పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఆవును పూజించే సంస్కారం బహుషా ఇందుకే ఏర్పడిందేమో.|EDITORIALS

పెరుగుతున్న భూతాపం, భూవ్మిూద నివశిస్తున్న సకల జీవరాశుల మనుగడను తీవ్ర సంక్షోభానికి దారి తీస్తున్నది. అందుకే ముందు ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాలుష్యాన్ని నివారించాలి. వాతావరణ సమతౌల్యాన్ని పాటించాలి. మనం కేవలం కొంత కాలం జీవించిపోవడానికి మాత్రమే ఈ భూమ్మీద జన్మించాం. మనకంటే ముందు తరాలు, మన తర్వాత తరాలు కూడా ఉంటాయి. మన ముందు తరాలు ప్రకృతిని కాపాడి మనకిచ్చారు కాబట్టే ఇవ్వాళ మనం బతికి బట్టకడుతున్నాం. అలాగే ఇంతకంటే మెరుగైన ప్రకృతిని అంటే జీవించే అవకాశాలను మనం మన తర్వాత తరాలకు ఇవ్వాలి. నిజానికి మనం ఇవ్వాళ మన పిల్లలకు సంపాదించి ఇస్తున్న ఆస్తుల కంటే కూడా పవిత్రమైన మెరుగైన ప్రకృతిని రక్షించి అందించడమే అన్నింటికంటే ముఖ్యం. జంతువులేవీ మనుషుల్లా ఆస్తులను కూడబెట్టడం లేదు. ఆలోచనలో, మాటలో తప్ప మనం జంతువులకంటే భిన్నమేమీ కాము. కానీ స్వార్థంతో, నిర్లక్ష్యంతో నీడనిచ్చే చెట్టునే నరక్కుంటున్నట్లుగా మనకు అన్నీ ఇచ్చే ప్రకృతిని, ఈ స్రుష్టిని సర్వనాశనం చేసుకుంటున్నాం. అలాగే మన భివిష్యత్తును కూడా.|EDITORIALS

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News