Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

భరత మాత నుదుట “సిందూరం”!

సగం ప్రపంచం నిద్రపోతున్నది. మిగా సగం తమ పనుల్లో నిమగ్నమై ఉంది. నిద్రలో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో తెలవదు. పనిలో ఉన్న మిగతా ప్రపంచం గుర్తించలేదు. సరిగ్గా పహల్గామ్‌ దాడి జరిగిన 15 రోజులకు అర్ధరాత్రి వేళ – భారత ప్రతీకారాగ్నికి ప్రత్యర్థి పాక్‌ గగన తలం “సింధూర” కాంతులతో ఎరుపెక్కింది. పాక్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లో టెర్రరిస్టులు దాక్కున్న తొమ్మిది కలుగుల్లోకి దూరి భారతీయ విస్ఫోటక అస్త్రాల్రు నేలమట్టం చేశాయి. అర్ధరాత్రి చిమ్మచీకట్లో శత్రుభూమిలో కనీసం కాలు పెట్టకుండా, నిప్పులు కురిపిస్తూ భారత్‌ జరిపిన ఈ దాడి తెల్లారేసరికల్లా తెలిసి, యావత్తు ప్రపంచం ఉలిక్కి పడింది. పాక్ వెన్నులో వణుకే పుట్టింది. ఉన్మాదుల కాల్పుల్లో తమ భర్తల్ని కోల్పోయిన భారత స్త్రీలు- భారత అస్త్రాలు రగిల్చిన సింధూర కాంతుల్న చూసి గర్వంతో ఉప్పొంగే వుంటారు.

చరిత్రాత్మక ఈ భారత ప్రతీకార దాడికి ప్రపంచదేశాలన్నీ దన్నుగా నిలిచాయి. భారత్‌ ను దోషిగా నిలబెట్టాలని చివరి క్షణంలో పాకిస్తాన్‌ భద్రతాసమితిలో చేసిన దింపుడుకల్లం ప్రయత్నం బెడిసికొట్టింది. ఒక్కదేశం కూడా పాక్‌ తో కలిసి రాలేదు. రెండువారాల పాటు అందరి మద్దతు కూడగట్టి, పటిష్టమైన నిఘా, యుద్ధ వ్యూహం పన్ని, నిర్వహించిన ఈ ఆపరేషన్‌కు ఆపరేషన్‌ సింధూర్‌ అని పేరు పెట్టారు. మిగతా కార్యాన్ని మన త్రివిధ దళ సేన అత్యంత పకడ్బందీగా నిర్వహించిన తీరు అభినందనయం. ఈ దాడితో, మతం పేరిట జరిపిన మారణహోమంలో నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక హిందూ పర్యాటకుల ఆత్మలు శాంతించాయనే భావిద్దాం.

ఇంతటితో ఆగక ఇంకా దుస్సాహసానికి దిగితే సర్వనాశనం తప్పదని అమెరికా చేసిన హెచ్చరికతో కూడిన హితవుకి పాక్ తల ఒగ్గిందా సరే. లేదంటే మళ్ళీ కల్లో కూడా వూహించడానికి భయంతో చచ్చేలా గుణపాఠం చెప్పడానికి భారతీయ సేనలు సరిహద్దుల్లో మోహరించి సిద్ధంగా ఉన్నాయి. మతోన్మాదుల రక్తంతో బాధిత మహిళల నుదుట తిలకం దిద్దిన సైన్యం సాహసానికి వందనం.

మొత్తంగా కొందరు అనుకున్నట్లుగా ఆలస్యం లేకుండానే.. భారత్‌ గర్జించింది. తన సత్తా ఏమిటో లోకానికి చాటింది. మనమేంటో మరోమారు పాక్‌కు రుచి చూపింది. పాక్ పెంచుతున్న ఉగ్రమూకల పుట్టలను పటపటా పగులగొట్టింది. ఉగ్రస్థావరాలు లక్ష్యంగా చేసిన మెరుపుదాడితో పాక్‌ ఉక్కిరిబిక్కిరి అయింది. 9చోట్ల జరిపిన దాడులతో వందకు పైగానే ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. గత పాలకులు దూరదృష్టి లోపం వల్ల పాక్‌తో నిరంతరంగా ఉగ్రవాదాన్ని భారత్ పైకి ఎగదోస్తోంది. నాకేం తెలియదని నంగనాచి కబుర్లు చెబుతోంది. అప్పట్లో జరిగిన యుద్దాల్లో పాక్‌ను దయతలచి వదిలి పెట్టడం జరిగింది. ఏకుమేకు అయినట్లు పాక్‌ పక్కలో బల్లెంగా మారింది. అందుకు భారీ మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాం. ఆనాడే 90వేల మది సైన్యం భారత్‌ చేతికి చిక్కినా.. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గురించి పట్టుబట్టలేదు. అనేక విషయాలను అలాగే వదిలేశాం. ఇలా చేయడంతో ఇంతకాలం మనం ఎన్నో ఉగ్రదాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోపక్క భారత్‌ను చీల్చుకుని పుట్టుకొచ్చిన పాక్‌, బంగ్లాలు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందాన వ్యవహరిస్తున్నాయి. వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిన సమయంలో ఇప్పుడు భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుని ‘ఆపరేషన్‌ సింధూర్‌’ను అమలు చేసింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు, పాక్‌ భూభాగంలోని మొత్తం 9 ఉగ్రస్థావరాలపై విరుచుకుపడి దాడులు చేసింది. నిమిషాల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అందరూ నిద్రపోతున్న వేళ..ఎలాంటి అలజడి లేకుండా భారత సైన్యం పని పూర్తి చేసింది. కానీ, ఇది ఇంతటితోనే ఆగుతుందని అనడానికి లేదు. పాక్‌ నుంచి వచ్చే ప్రతిస్పందన ఆధారంగా మన దాడులు మరింతగా ఉండే అవకాశం లేకపోలేదు.

370 ఆర్టికల్‌ రద్దు తర్వాత కశ్మీర్ లో ప్రశాంత వాతావణం ఏర్పడి, పర్యాటకం మళ్లీ పురివిప్పింది. దీనిని చెడగొట్టే లక్ష్యంతో పాక్‌ కుట్రలు పన్నుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతోంది. ఉగ్రవాదాన్ని ఉసి గోల్పుతోంది. ఈ వరసలో జరిగిన దాడే పహల్గామ్‌ ఊచకోత. ఈ దాడులను ఇక ఎంతమాత్రం ఉపేక్షించబోమని భారత్ జరిపిన ప్రతిదాడుల హెచ్చరికతో పాక్‌ దారికి రావాలి. లేకుంటే ప్రపంచ పటంలో పాక్‌ ఆనవాళ్లు కూడా ఉండవని గుర్తించాలి.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News