Trending News
Sunday, December 7, 2025
17.2 C
Hyderabad
Trending News

రంకు – బొంకు!

భారత్ లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాద గ్రూపులను రెచ్చగొట్టడం వంటి అంశాలను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అంగీకరించారు. ఒక ఇంటర్వ్యూలో ఇలా స్పందించారు.
“మీరు ఒప్పుకుంటారా, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడం వంటి చరిత్రను చాలా కాలంగా కలిగి ఉందని?”
“అవును, మేము మూడు దశాబ్దాలుగా యునైటెడ్ స్టేట్స్ కోసం ఈ నీచమైన పని చేస్తున్నాం. మీకు తెలుసా? పశ్చిమ దేశాలకు. బ్రిటన్ తో సహా.”
“సరే, అదేనా మీ వాదన?”

అతను వెంటనే తనను తాను సరిదిద్దుకుని, “అది పొరపాటు. మేము దాని కోసం బాధపడ్డాం. అందుకే మీరు నాతో ఇలా చెబుతున్నారు.” అని బుకాయించారు.
‘‘రంకునేర్చినమ్మ బొంక నేర్చింద’’ని, భారత్‌లో ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా పాక్‌ ఇలా బుకాయిస్తూనే ఉంది. ముంబై ఉగ్రదాడుల సమయంలోనూ ఇదే చెప్పింది. అజ్మల్‌ కసబ్‌ గురించి చెప్పినా కసబ్‌ మా దేశస్థుడే కాదని బొంకింది. కసబ్‌ పుట్టు పూర్వోత్తరాలు బయటపడ్డాక కూడా నిస్సిగ్గుగా అదే పాట పాడింది. ఇప్పడు కూడా అదే తొండి కూత కూస్తోంది. మరి ఢిల్లీలోని పాక్‌ రాయబారి కార్యాలయంలో కేక్‌ సంబరాలపై మాత్రం తెల్లమొహం వేస్తోంది. టెర్రరిస్టులకి ‘పాక్’ మద్దతిస్తుందన్న దానికి ఈ ‘కేక్’ రుజువుగా మారి, ‘హాట్ కేక్’ అయిపోయింది. పాకిస్థాన్‌ దౌత్యవేత్త సాద్‌ అహ్మద్‌ వరైచ్‌ను పిలిపించి ‘పర్సోనా నాన్‌ గ్రాటా’ (అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనే) అధికారిక నోటీసులు అందించింది. ఈ నోటీసుల ప్రకారం వారు వారం రోజుల్లోగా భారత్‌ను వీడాల్సి ఉంటుంది. ఇదిలావుండగా బలూచిస్థాన్‌ ఘటనలను భారత్‌కు అంటగట్టే ప్రయత్నం చేసి తన లాలూచీని బయటపెట్టుకుంది. మనం టెర్రరిస్టుల జాబితాని సమర్పించినా, వారు పాక్‌లో వున్నారని అడ్రసులిచ్చినా అప్పగించడం లేదు. సరికదా, హఫీజ్‌ సయీద్‌ లాంటి ఉగ్రవాదులను దాచిపెడుతోంది. పైగా వారిని పాముల మాదిరి పాలుపోసి పెంచుతోంది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌ నేతల ప్రకటనలు ఉగ్రవాదులకు ఊతమిస్తున్నాయి. మనకు రోత పుట్టిస్తున్నాయి. పహల్గాం టెర్రరిస్ట్‌ దాడితో మాకు సంబంధం లేదని సుద్దపూసలా దాడిని ఖండించింది. కానీ పాక్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ వ్యాఖ్యలతో వారి నిజస్వరూపం బట్టబయలైంది. 28 మంది అమాయక ప్రజలను అత్యంత కిరాతకంగా ఊచకోత కోసిన నరరూప రాక్షసులను స్వాతంత్య సమరయోధులతో పోల్చాడు. ఆయన వ్యాఖ్యలతో పాక్‌ డొల్లతనం ప్రపంచదేశాల ముందు మరోసారి తేటతెల్లమైంది. భారత్‌ సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై కూడా తిక్కతిక్కగా మాట్లాడాడు. ‘పాకిస్తాన్‌లో 240 మిలియన్ల మందికి సింధు నది నీరు అవసరం. మీరు ఆ ఒప్పందాన్ని ఆపలేరు. ఒకవేళ ఇండస్‌ ట్రీటీ- రద్దు చేస్తే అది యుద్ధ చర్యకు సమాన’మని బీరాలు పలికాడు. ఆ దేశం కూడా అదే విధమైన ప్రతిచర్యను ఎదుర్కొంటుందని అంటే మనమీద యుద్ధం చేస్తామని హెచ్చరించాడు. ఇషాక్ దార్ మాటలపై భారత ప్రజలు భగ్గుమంటున్నారు. ఇదే పాక్‌ నిజస్వరూపమని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందనడానికి ఇంతకన్నా ఇదే నిదర్శనమని దుమ్మెత్తిపోస్తున్నారు. చివరకు పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా దార్ మాటలని పిచ్చి ప్రేలాపనలుగా కొట్టి పారేశాడు. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లుగా ఒప్పుకున్నట్లయిందని, ఉగ్రవాదంతో పాక్ ప్రజలు బాధపడుతున్నారని అన్నాడు. పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ప్రధాని మాట్లాడాలని డిమాండ్ చేశాడు.

కాశ్మీర్‌లోని బైసరన్‌ లోయలో జరిగిన ఈ దాడి వెనక లష్కరే తయ్యబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ హస్తం ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. సయీద్‌తో పాటు అతడి ముఖ్య అనుచరుడు సైఫుల్లా ఉగ్రమూకలను అమాయకుల మీదకు ఊసిగొల్పారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎల్‌ఈటీకి అనుబంధంగా ఉన్న కరుడుగట్టిక ఉగ్రవాదుల బృందం బైసరన్‌లో నిర్దాక్షిణ్యంగా 26మంది అమాయకులను మట్టుపెట్టింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఈ బృందంలో ప్రధానంగా విదేశీ ఉగ్రవాదులు ఉంటారు. వీరికి స్థానిక మిలిటెంట్లతోపాటు కాశ్మీర్‌లో మరికొందరు సహకరించినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. పాక్‌ ప్రభుత్వ మద్దతుతో హఫీజ్‌ సయీద్‌, అతడి ముఖ్య అనుచరులు ఈ ఉగ్రమూకలకు నేరుగా సహాయపడి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భారత దళాలు జమ్మూ కాశ్మీర్‌ను జల్లెడ పడుతున్నాయి.

మరోవైపు పాక్ పై భారత్ ముప్పేట కట్టడి చేస్తున్నది. అంతర్గతంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సైన్యాన్ని అప్రమత్తం చేసింది. అయితే, పహల్గాంకు ప్రతీకారం తీర్చుకోవడంపైనే భారత ప్రజలు చర్చిస్తున్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడం, పాక్ తో వైరాన్ని శాశ్వతంగా పరిష్కరించడం, యుద్ధం వస్తే ఎలా? పాక్ ను పూర్తిగా నిలువరించడానికి వ్యూహాలేంటి? అన్న అంశాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
పహల్గాం సంఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. అన్నింటికి అతీతంగా, దేశంలో మరోసారి దేశ భక్తిని రగిల్చింది. దేశం మొత్తం మరణించిన వారికి నివాళులర్పిస్తున్నది. ఐక్యంగా పాకిస్థాన్ ను ఎదుర్కోవడంపై చర్చిస్తున్నది. ప్రపంచ దేశాల ముందు క్రమేనా పాక్ రంగుతేలి ఒంటరి అవుతున్నది. ఇక భారత ప్రభుత్వంపైనే అంతా ఆధారపడి ఉంది.

Latest News

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

గురువారం డిసెంబర్ 04–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--శుక్లపక్షం దత్తాత్రేయ జయంతి తిధి శు.చతుర్దశి ఉదయం 07.37 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం కృత్తిక పగలు 03.12 వరకు ఉపరి రోహిణి యోగం శివ ఉదయం 11.45 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

భౌ భౌ…! భౌ భౌ…భౌ!!|DOGS|INDIA|SUPREME COURT

విచ్చలవిడిగా విస్తరిస్తోన్న వీధి కుక్కలు రెచ్చిపోతున్న పిచ్చి కుక్కలు కరచి, రక్కి, కొరికి పారేస్తున్న శునకాలు నియంత్రణకు ‘సుప్రీం’ ఆదేశాలు సాదుకునే రోజుల నుంచి... కుక్కలంటే భయపడే రోజులొచ్చాయ్ కుక్కకు కూడా ఓ రోజొస్తుందంటే ఏమో అనుకున్నాం! నిజంగానే...

ఒకే కుటుంబం నుంచి ఐదుగురు సర్పంచ్ పోటీదారులే|PANCHAYATI TRENDS

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ ఈ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఎస్సీ జనరల్‌గా రిజర్వ్‌ అయిన ఈ పంచాయతీ సర్పంచ్ పదవికి ఒకే కుటుంబానికి చెందిన...

గిదేం ఇచ్చెంత్రం!?|ADUGU TRENDS

‘నీల్లు పల్లమెరుగు.. నిజం దేవుడెరుగు!’ అన్నరు. నిజం సంగతేమో గనీ, నీల్లయితే పల్లానికే పోతయి గదా! నిజమా? కాదా? కనీ, ఓ దగ్గర మాత్రం నీల్లు మిట్టకు పోతున్నయుల్లా!? గిదైతే నిజమో, అబద్దమో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News