Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

ఆరో వేలు అవసరమా!?

దేశ అత్యున్నత న్యాస్థానం అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇటీవల అనేక చారిత్రక తీర్పులను వెలువరిస్తోంది. న్యాయ మార్గనిర్దేశనం చేస్తోంది. పార్టీల ఫిరాయింపులు, రాజకీయ నాయకులపై కేసులు, వారి ఆస్తులు, వర్సిటీ భూములు వంటి ఎన్నో కీలక తీర్పులను సుప్రీం కోర్టు ఇస్తున్నది. తాజాగా గవర్నర్ వ్యవస్థపై ఇచ్చిన ‘సుప్రీం’ సర్వోన్నత తీర్పు సర్వోత్తమమైంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు గవర్నర్ వ్యవస్థ ‘కీ’లకంగా మారింది. గవర్నర్‌ వ్యవస్థ ఆరోవేలు లాంటిదంటారు. ఆ వేలు ఉన్నా, లేకున్నా ఒకటే అని దాని అర్థం. కానీ ఆ వేలునే వాడుకోవడం, ఆ వేలుతోనే ఆడుకోవడం రాజకీయ నాయకులకు అలవాటైంది. రాను రాను గవర్నర్ వ్యవస్థ రాజకీయ పదవుల పునరావాస కేంద్రంగా మారిపోయింది. అందుకే గవర్నర్‌ వ్యవస్థను ఎత్తేయడానికి పాలకులు ఇష్టపడటం లేదు. దేశంలో ఈ వ్యవస్థ వల్ల ఏటా వేల కోట్లు దుర్వినియోగం అవుతున్నాయి. పైగా ప్రజలకు ప్రత్యక్షంగా ఎలాంటి ఉపయోగం లేదు. అంతేకుండా రాష్ట్రాల్లో అనవసర అధికార కేంద్రంగా మారింది. గతంలోనే గవర్నర్ వ్యవస్థని ఎత్తేయాలని ఎన్టీఆర్‌ సహా అనేకులు డిమాండ్‌ చేసినవారే. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఈ వ్యవస్థ వల్ల ఒరిగిందేవిూ లేదు. అందుకే కమ్యూనిస్టులు కూడా ఇదే డిమాండ్‌ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రం నోరు మెదపడం లేదు.

గతంలో 1984లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన ఆగస్టు సంక్షోభం గుర్తుండే ఉంటుంది. ఇటీవల తమిళనాడులో జరిగిన రచ్చను చూశాం. గతంలో బెంగాల్లోనూ, కేరళలోనూ గవర్నర్ వ్యవస్థ వల్ల రచ్చ రచ్చే. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కళ్ళకు కట్టింది. రాష్ట్రాల గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ తాబేదార్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కొత్తేమీ కాదు. గవర్నర్ల వైఖరిని వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తోంది. కేరళ ప్రభుత్వం లేవనెత్తిన అంశాల ప్రాధాన్యతను, ఔచిత్యాన్ని ‘సుప్రీం’ తీర్పు నొక్కిచెప్పింది. కేరళ మాజీ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన పలు బిల్లులను తొక్కి పెట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఇటీవల ‘సుప్రీం’తో చివాట్లు తిన్నారు. అసలు ట్విస్టేంటంటే, గవర్నర్ ప్రమేయం లేకుండానే పెండింగ్ బిల్లులను పాస్‌ చేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. గవర్నర్ల మితివిూరిన నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు…రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలి. కాంగ్రెస్‌ కాలం నుంచే గవర్నర్‌ వ్యవస్థను ఆ పార్టీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చుకుంది. బీజేపీ కూడా దానిని కొనసాగిస్తోంది.

నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఫెడరలిజం బలోపేతానికి జరుగుతున్న పోరాటానికి ‘సుప్రీం’ తీర్పు ఒక ఊతం. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులకో రక్షణ కవచం. ఈ తీర్పు ఒక్క తమిళనాడుకు మాత్రమే పరిమితమైనది కాదు. మొత్తం భారతదేశంలోని రాష్టాల్రన్నింటికీ సంబంధించినది. జస్టిస్‌ జె.బి. పార్ధివాలా, జస్టిస్‌ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు సూటిగా ఉంది. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. అంతేకాదు గవర్నర్లు ఎంతలో ఉండాలో నిర్దేశించింది. నెలలోగా బిల్లులను ఆమోదించాలని చెప్పింది. లేకుంటే ఆ బిల్లులు విధానాలుగా మారుతాయని తేల్చింది. గవర్నర్లంటే… కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేసే దుస్సంప్రదాయానికి ఈ తీర్పు చెల్లుచీటీ రాసింది. అయితే, బీజేపీ ఎక్కడా ఈ తీర్పుపై మాట్లాడ లేదు. రాజ్యాంగానికి నష్టం వాటిల్లకుండా చూస్తామని చెప్పలేదు. గవర్నర్‌ అంటే కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మెలగవలసిన వ్యక్తి కాదని, ఆ పదవి రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థ అని గతంలో ’ఎస్‌.ఆర్‌ బొమ్మై వర్సెస్‌ భారత ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా తనవద్దే తొక్కిపెట్టిన గవర్నర్‌ వైఖరిని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. కీలకమైన 10 బిల్లులను ఆమోదించకుండా తన వద్దనే తొక్కిపెట్టి , ఆయన తీసుకున్న నిర్ణయం, వ్యవహరించిన తీరు చట్టవిరుద్ధం, ఏకపక్షం’ అని అభివర్ణించింది. ఒకసారి శాసనసభ బిల్లులను ఆమోదించిన తర్వాత వాటిపై నిర్ణయం తీసుకోవడానికి న్యాయస్థానం కాలపరిమితిని కూడా నిర్దేశించింది. ఈ బిల్లులకు సంబంధించి గవర్నర్‌ తీసుకున్న చర్యలన్నీ రద్దవుతాయని, అసెంబ్లీ… గవర్నర్‌కు తిరిగి పంపిన తేదీ నుంచి ఈ బిల్లులన్నీ ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని ‘సుప్రీం’ స్పష్టం చేసింది. ప్రజలచే ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల సలహా మేరకు గవర్నర్‌ వ్యవహరించాలని, రాష్ట్రాలను వీటో చేసే అధికారం రాజ్యాంగం వీరికి ఇవ్వలేదని కోర్టు పునరుద్ఘాటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావసరాలు, సంక్షేమం కోసం చట్టాలను రూపొందిస్తాయి. వాటిని నిరోధించే వైఖరి రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డుపడటం గవర్నర్‌ పని కాదని ఎత్తిచూపుతూ…గవర్నర్‌ రవి అడ్డుకున్న పది బిల్లులను సుప్రీం ఆమోదించింది.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని సమర్థించే ఈ తీర్పు…అసెంబ్లీ హక్కులను హరించే గవర్నర్ల వైఖరికి ఒక హెచ్చరిక. బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు చెంపపెట్టు లాంటిదని కూడా చెప్పకతప్పదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతికి ముందు వచ్చిన ఈ తీర్పు రాజ్యాంగాన్ని కాలరాస్తున్న వారికి కనువిప్పుకావాలి. ఈ తీర్పుతో అయినా గవర్నర్‌ వ్యవస్థతో పనిలేదని గుర్తించాలి. దీనిని రద్దు చేసేందుకు అంతా ఉద్యమించాలి.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News