Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

మోదీ జీ..! వినబడుతోందా!?|EDITORIAL

‘ పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట!’ ఈ సామెత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు సరిగ్గా సరిపోతుంది. ఆయనకు ఆ పదవి కట్టబెట్టినందుకు ఆ దేశ పౌరులే తలలు పట్టుకుంటున్నారు. ఇక ప్రపంచ దేశాలైతే, ట్రంపు టెంపరితనానికి ఠారెత్తిపోతున్నాయి. ఆయన చపల చిత్తం, నోటి దూల, అధికార దాహం, అహంకారం, అంధకారం, మథాంధకారం, శాడిజం, వక్రబుద్ధి, ఆత్మస్తుతి, పరనింద, కోపం అత్యాశ, అసూయ, ద్వేషం, మోసం, దగా, యుద్ధ కాంక్ష, శాంతి జపం వంటి మానవ అవలక్షణాలన్నీ కలిస్తే బహుషా ట్రంపు అవుతాడేమో?! ఎవరినైనా తిట్టాలంటే, ఇక ‘నువ్వు ట్రంపువా? మనిషివా?’ అనే నానుడి స్థిరపడిపోతుందేమో! ఈ పదవులు, అధికారం శాశ్వతం కాదు. చివరకు మనిషే శాశ్వతం కానీ ఈ లోకంలో.. ట్రెంపరితనపు పోకడలు మొత్తం భూగోళాన్నే గందరగోళం చేసి, నిజంగానే చికాకు పెడుతున్నాయి.

మరి ట్రంప్‌ విషయంలో మోదీ తీసుకునే నిర్ణయం ఏంటి? అమెరికాకు, ట్రంప్ టెంపరితనానికి తగిన గుణపాఠం చెబుతారా? ప్రపంచ మద్దతు కూడ గట్టి బుద్ధి చెప్పగలరా? నెత్తి కొరికిన పేనుని చివరకు ఏం చేస్తాం? యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

‘ పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట!’ ఈ సామెత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు సరిగ్గా సరిపోతుంది. ఆయనకు ఆ పదవి కట్టబెట్టినందుకు ఆ దేశ పౌరులే తలలు పట్టుకుంటున్నారు. ఇక ప్రపంచ దేశాలైతే, ట్రంపు టెంపరితనానికి ఠారెత్తిపోతున్నాయి. ఆయన చపల చిత్తం, నోటి దూల, అధికార దాహం, అహంకారం, అంధకారం, మథాంధకారం, శాడిజం, వక్రబుద్ధి, ఆత్మస్తుతి, పరనింద, కోపం అత్యాశ, అసూయ, ద్వేషం, మోసం, దగా, యుద్ధ కాంక్ష, శాంతి జపం వంటి మానవ అవలక్షణాలన్నీ కలిస్తే బహుషా ట్రంపు అవుతాడేమో?! ఎవరినైనా తిట్టాలంటే, ఇక ‘నువ్వు ట్రంపువా? మనిషివా?’ అనే నానుడి స్థిరపడిపోతుందేమో! ఈ పదవులు, అధికారం శాశ్వతం కాదు. చివరకు మనిషే శాశ్వతం కానీ ఈ లోకంలో.. ట్రెంపరితనపు పోకడలు మొత్తం భూగోళాన్నే గందరగోళం చేసి, నిజంగానే చికాకు పెడుతున్నాయి.

హద్దు పద్దు లేకుండా ప్రవర్తిస్తున్న ట్రంప్ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఏ దేశం ఎవరితో స్నేహ హస్తం చాచాలో కూడా ట్రంపే చెబుతాడట! ఏ దేశం మరేదేశంతో వాణిజ్యం చేయాలో కూడా ట్రంపే నిర్దేశిస్తాడట. అదే అమెరికా దేశాన్ని ట్రంప్ లా ఎవరైనా ప్రశ్నిస్తే సహిస్తాడా? మరి పర దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నంచే హక్కు ట్రంప్ కు ఎక్కడిది. ఎవరిచ్చారు? ట్రంప్‌ ఆంక్షలను ఎవరైనా ఎందుకు అంగీకరించాలి? చర్చలు జరిపేది లేదంటున్న ట్రంప్‌తో మనం కూడా ఎందుకు చర్చలు జరపాలి? చర్చలు జరిపినా, జరపకపోయినా,140 కోట్ల జనాభా ఉన్న భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో ట్రంపకు అర్థం చేయాలి. మనపై వాణిజ్య ఆంక్షలు విధిస్తూ, పాక్‌ను దువ్వుతున్న తీరు అమెరికా ద్వంద్వ నీతిని తెలియ చేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా విధించిన అదనపు సుంకాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ట్రంప్‌ ఏకపక్ష నిర్ణయాలు ఒక్క భారత్‌కే కాదు యావత్ ప్రపంచ దేశాలకు పరీక్షగా మారాయి. ముందుగా చైనా అదే స్థాయిలో తిరిగి అమెరికాపై సుంకాలు విధించి అమెరికా దిమ్మ తిరిగేలా చేసింది. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను తమపై విధించడంతో భారత్‌ కూడా చైనా తరహాలోనే దీటుగా స్పందించింది. తమ దేశంలోని రైతులు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసింది. గురువారం నుంచే అమలులోకి వచ్చిన 25 శాతం సుంకాలతోపాటు, ఆగస్టు 27 నుంచి 50శాతానికి చేరే సుంకాలకు తోడుగా భారత్‌పై మరిన్ని ఆంక్షలను విధిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. ఆయన విధించిన సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల అమెరికాలోనూ కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. పెంచిన సుంకాల వల్ల బిలియన్ల కొద్దీ డాలర్లు అమెరికాకు వస్తాయని ట్రంప్‌ నమ్మబలుకుతున్నారు.

అమెరికా అదనపు సుంకాల వల్ల ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదం తాత్కాలికమేనని, త్వరలోనే సమసిపోతుందని ప్రవాస భారతీయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. చర్చలు ఫలించి త్వరలో ఒప్పందం కుదురుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 50 లక్షల మంది ప్రవాస భారతీయులు అమెరికా అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు. భారతీయ ఉత్పత్తులపై 50శాతం సుంకాలను వేయడాన్ని ఇండియన్‌-అమెరికన్ల నేత, బైడెన్‌ మాజీ సలహాదారు అజయ్‌ భుటోరియా ఖండించారు. ’అమెరికాలో తక్కువ ధరలకు లభించే 50శాతం జనరిక్‌ మందులను భారత్‌ సరఫరా చేస్తోంది. ఈ సుంకాలు వాటి ధరలను కూడా పెంచుతాయి. దీనివల్ల అమెరికాలోని కుటుంబాలు, సీనియర్‌ సిటిజన్లు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడతారు. మసాలా దినుసులు, పప్పులు, దుస్తుల ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు. దుస్తులు, పాదరక్షల ధరలు 37శాతం దాకా పెరగవచ్చని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఇదే విషయాన్ని గుర్తుచేశారు. అయితే, ట్రంప్‌ విధించిన అదనపు సుంకాలపై ప్రధాని మోదీ గట్టిగానే సమాధానమిచ్చారు. ఎంత మూల్యమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వారిని కాపాడటం కోసం సుంకాల భారాన్ని సొంతగా భరించడానికీ సిద్ధం అని ప్రధాని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, శ్వేత సౌధంలోని ఓవల్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘భారత్‌పై మేం 50శాతం సుంకాలను విధించిన విషయం మీకు తెలుసు. ఆ దేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో రెండో స్థానంలో ఉంది. తొలిస్థానంలోని చైనాకు అతి దగ్గరగా ఉంది. అందుకే భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలను చూడబోతున్నార’ని పేర్కొన్నారు. ట్రంప్‌ తీరు తన అధికారాన్ని పిచ్చోడి చేతిలో రాయిలా వాడుకుంటున్నట్లుగా ఉంది. ఎలాన్‌ మస్క్‌ లాంటి మిత్రుడినే దూరం పెట్టిన ట్రంప్‌కు భారత్‌ ప్రయోజనాలు అంత ముఖ్యం కాదు. లెక్కలోకీ రావు.

ఆపరేషన్‌ సింధూర్‌ భారత్ సైనిక పాఠవాన్ని ప్రపంచానికి చాటింది. అలాగే అమెరికా ప్రపంచ దేశాలను బెదిరించి ఎక్కువ ధరలకు అమ్ముతున్న పాక్ ఆయుధాలు తుస్ మనడమూ అన్ని దేశాలూ చూశాయి. అందుకే పాక్ ను బెదిరించి మరీ, భారత్ కాళ్ళ బేరానికి పంపాడు. భారత్‌ భద్రతా వలయాన్ని చూసి ట్రంప్‌ తట్టుకోలేక పోతున్నాడు. సైనిక పరంగా మనల్ని ఎదుర్కోలేక సుంకాలతో కొడుతున్నాడు.

అయోధ్య, కాశ్మీర్‌, ట్రిపుల్‌ తలాక్‌ విషాయల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మోదీ, ఆపరేషన్‌ సిందూర్‌ తో పాక్ పీచమణిచారు. గట్టిగా బుద్ది చెప్పాం. ప్రపంచం ముంగిట పాక్ ని దోషిగా నిలబెట్టాం. ప్రపంచ వ్యాప్తంగా భారత్ చర్యలకు గట్టి మద్దతు లభించింది. మరి ట్రంప్‌ విషయంలో మోదీ తీసుకునే నిర్ణయం ఏంటి? అమెరికాకు, ట్రంప్ టెంపరితనానికి తగిన గుణపాఠం చెబుతారా? ప్రపంచ మద్దతు కూడ గట్టి బుద్ధి చెప్పగలరా? నెత్తి కొరికిన పేనుని చివరకు ఏం చేస్తాం? యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మోదీజీ వినబడుతోందా!?

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News