Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

ఆత్మహత్యా సదృశ్యంగా అమెరికా చర్యలు!?|EDITORIAL

ఏదో ఒక రోజు బాధిత దేశాలతోపాటు ప్రపంచ దేశాలన్నీ కలిసి అమెరికాపై దండయాత్ర చేసే అవకాశం ఎవరూ కాదనలేని వాస్తవం. అమెరికా ఆశించినట్లు దానికి ఎదురే లేకుండా అన్ని దేశాలూ యుద్ధాల వల్లో, సుంకాల వల్లో మరే కారణాల వల్లో నిర్వీర్యం అయ్యాయనుకుందాం. అప్పుడు చుట్టూ జీవంలేని దేశాలు, ప్రజలతో ఆ దేశం ఎలా మనగలుతుంది? ఈ మాత్రం ఇంగితం లేక అనుకోలేం కానీ, ట్రంప్ లాగే, ఎవరికైనా సాగుతున్నంత కాలం సాగించుకోవాలనే ఉంటుంది. అందుకే మనం ముందుగా స్వదేశీ స్వావలంబనను, స్వయం సమృద్ధిని సాధించాలి. లాడెన్‌ ఉగ్రచర్యలను ట్రంప్‌ మరచిపోయారు. పాక్‌ను దువ్వి పాలు పోస్తున్నారు. దీనికి అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదు. పాక్‌ కూడా అమెరికా అండతో భారత్‌పై మరింత కాలుదువ్వే అవకాశాలు ఉన్నాయి. ఉగ్రచర్యలను ప్రేరేపించవచ్చు. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. ‘మార్గం అడుగు’ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ 

‘ట్రంప్ తన క్లోజ్ ఫ్రెండ్ కు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు.’ అని అమెరికా అధ్యక్షుడు హెచ్-1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచినప్పుడు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. ఇందులో వ్యంగ్యాన్ని పక్కన పెడితే, ట్రంప్ ఎవరికీ నమ్మకైన ఫ్రెండ్ కాదనేది సారాంశం. అధ్యక్షుడిగా ట్రంపే కాదు, దేశంగా అమెరికా కూడా నమ్మకమైన నేస్తం కాదు. అత్యంత స్వార్థపూరిత, నిరంకుశ, నిరపేక్షమైన దేశంగా ఇటీవలి ఆ దేశ విధి విధానాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచం పట్ల ఆ దేశం ఉచ్ఛనీచాలు మరచి ప్రవర్తిస్తున్న తీరు హేయంగా కనిపిస్తోంది. తన లాంటి ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని సైతం ప్రశ్నించేలా జోక్యం చేసుకోవడం, లేని పెత్తనానికి పూనుకోవడం, సర్వసత్తాక దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులకు, యుద్ధాలకు పురికొల్పడం, దిగడం వంటి ఏకపక్ష విపరీత ధోరణులు ఆ దేశ ఔన్నత్యాన్ని ప్రశ్నించేలా ఉన్నాయి. విషయమేదైనా సరే, అది తనకు ఉపయోపడుతుందా? అన్నదే ఆ దేశ లక్ష్యాలుగా ఉన్నాయి. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా అమెరికా ప్రపంచ దేశాల పట్ల వ్యవహరిస్తున్న పద్ధతులున్నాయి. తన బాధిత దేశాలపై అమెరికా దాష్టీకం కొంత కాలం నడవొచ్చు. కానీ, ఏదో ఒక రోజు ఆ బాధిత దేశాలతోపాటు ప్రపంచ దేశాలన్నీ కలిసి ఆ దేశంపై దండయాత్ర చేసే అవకాశం ఎవరూ కాదనలేని వాస్తవం.

అమెరికా ఆశించినట్లు దానికి ఎదురే లేకుండా అన్ని దేశాలూ యుద్ధాల వల్లో, సుంకాల వల్లో మరే కారణాల వల్లో నిర్వీర్యం అయ్యాయనుకుందాం. అప్పుడు చుట్టూ జీవంలేని దేశాలు, ప్రజలతో ఆ దేశం ఎలా మనగలుతుంది? ఈ మాత్రం ఇంగితం లేక అనుకోలేం కానీ, ఎవరికైనా సాగుతున్నంత కాలం ట్రంప్ లాగే, సాగించుకోవాలనే ఉంటుంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదట భారత్ పై పాక్ ఉగ్రదాడిలో జోక్యం చేసుకున్నారు. పాక్ తోకముడిచి కాళ్ళ బేరానికి వస్తే, ఆ యుద్ధాన్ని ఇరుదేశాలతో మాట్లాడి తామే నిలిపేశామని, తనను నోబెల్ శాంతి బహుమతికి సిఫారసు చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఆ పాచిక పారకపోవడంతో తమ దేశ అన్ని ఎగుమతులపై సుంకాలు విధించారు. భారత్ పై కూడా ముందుగా 25శాతం, ఆ తర్వాత దాన్ని 50శాతానికి పెంచి, తిరిగి 25శాతం దగ్గర నిలిపారు. చమురును రష్యా నుంచి కొనుగోలు చేయడం ద్వారా భారత్ పరోక్షంగా ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధానికి సహకరిస్తున్నదని నిందారోపణ చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపేయాలని హూంకరించారు. ఆ తర్వాత వీసాల్లోని లోపాల కారణంతో అమెరికాలోని ఎన్ఆర్ఐలపై వెంటాడి, వేటాడి బేడీలు వేసి, అరెస్టు చేసి నానా యాగి చేసింది. భారత్ కు స్నేహహస్తం సాచినట్లే సాచి, హెచ్-1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచారు. అమెరికా జనాభాలో రెండో అత్యధిక జనాభాగా 15శాతం ఉన్న భారతీయ టెకీలపై, టెక్నాలజీలో 70శాతానికి పైగా వాటా ఉన్న మన వాళ్ళపై, కొత్తగా ఆ దేశానికి వెళ్ళాలనుకునే వాళ్ళపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. హెచ్-1బీపై అమెరికాలో ఉన్న లక్ష మంది భారతీయులపై ఆ ప్రభావం పడింది. చివరకు ఆ పెరిగిన రుసుం ప్రతి ఏటా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకసారి చెల్లిస్తే చాలని ముక్తాయించింది.

సుంకాలపై ఎదురు సుంకాలు విధించి చైనా, అమెరికాను గట్టిగానే ఎదురించింది. భారత ప్రధాని మోదీ సైలెంట్ గా షాంఘై సదస్సులో చైనా, అమెరికా అధ్యక్షులతో అరమరికలు లేకుండా వ్యవహరించి అమెరికా వెన్నులో వణుకు పుట్టించారు. అయితే తోలు మందమైన ట్రంప్ కు, బరితెగించిన అమెరికాకు ఈ టిట్ ఫర్ టాట్ సరిపోలేదనిపిస్తోంది.

భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అధిక జనాభాతోపాటు, వనరులు, మధో సంపత్తి సుసంపన్నగా కలిగిన దేశంగా భారత్ అత్యధిక మార్కెట్ కలిగిన దేశం కూడా. అందువల్ల ప్రపంచ దేశాల దిగ్గజ కంపెనీలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి. చివరకు అమెరికా కన్ను కూడా భారత్ పైనే ఉంది. భారత్‌ ఆర్థిక మూలాలలను దెబ్బతీయడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తున్నది. అమెరికాకు భారత్ మోకరిల్లాలనే ఆధిపత్య ధోరణి ట్రంప్‌లో కనిపిస్తోంది. ఓట్ల కోసం భారత్‌ను, ఎన్నారైల కాళ్ళా, వేళ్ళా పడి, మోదీతో చెలిమిని నటించిన ట్రంప్‌, గెలిచాక గేర్‌ మార్చడం వెనక సొంత ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.
భారత్‌ ఆర్థికంగా ఎదిగితే తమకు పోటీ అవుతుందన్న బెంగ ప్రధానంగా ఉంది. సైనికంగా స్వయం సమృద్ధిని సాధించడాన్ని కూడా ట్రంప్‌ తట్టుకోలేకపోతున్నాడు. ఆపరేషన్‌ సిందూర్‌ తరవాత అమెరికా పాక్ కు అందించిన తుపాస్ ఆయుధాలు తుస్సు మనడంతో ఆయనలో అవమానం, అసహనం పెరిగింది. భారత్‌ సైనిక సత్తా చాటి, స్వదేశీ ఆయుధాలతోనే పాక్‌ పీచమణిచింది. పాక్‌లో తన స్థావరం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న అమెరికాకు ఇది గిట్టడం లేదు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ను పిలిపించుకుని, చంకనెత్తుకుని, పాక్‌తో వాణిజ్యం కూడా మొదలు పెట్టారు. తాజాగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనేలా భారత్ పై ఒత్తిడి తెస్తున్నారు. మొత్తంగా భారత్‌ మార్కెట్‌ను దెబ్బతీసే కుట్ర కూడా ఇందులో దాగివుంది.

అందుకే, భారత ప్రధాని మొన్న ప్రజలకు ఓ బహిరంగ లేఖ విడుదుల చేశారు. విదేశీ తంత్రానికి స్వదేశీ మంత్రమే బెటరని ఉద్బోధించారు. మనం ముందుగా స్వదేశీ స్వావలంబనను సాధించాలి. మన దగ్గరే ఉద్యోగావకాశాలు పెంచాలి. ఒసామాబిన్‌ లాడెన్‌ ఉగ్రచర్యలను ట్రంప్‌ మరచిపోయారు. పాక్‌ను దువ్వి పాలు పోస్తున్నారు. దీనికి అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదు. పాక్‌ కూడా అమెరికా అండతో భారత్‌పై మరింత కాలుదువ్వే అవకాశాలు ఉన్నాయి. ఉగ్రచర్యలను ప్రేరేపించవచ్చు. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News