Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

ఇటీవలి పరిణామాలు-గుణపాఠాలు!|EDITORIAL

జీఎస్టీ పన్నుల సవరింపు ఆషాఢం మాసం సేల్ లాగా మారింది. డిమాండ్ తగ్గితే తగ్గించి, పెరిగితే పెంచి అమ్ముకోవడం లాగా అధికారాన్ని నిలుపుకోవడానికి పాలకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జీఎస్టీ ప్రకటంచినప్పుడు దేశంలో పన్నుల విధానంలో అతి పెద్ద సంస్కరణగా పేర్కొన్నారు. ఇప్పుడే అదే జీఎస్టీ తగ్గించి, శ్లాబులు మార్చి నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలని అంటున్నారు. ఇంతకాలం నెత్తీనోరు మొత్తుకున్నా జీఎస్టీ తగ్గించలేదు. చివరకు ఇన్సూరెన్స్ లపైనా జీఎస్టీని బాదారు. 11 ఏళ్ల తరవాత ఆ నెపాన్ని ప్రధాన ప్రతిపక్షంపై నెట్టేసి, కొత్త వడ్డనలను మొదలు పెట్టారు. ఒక్క జీఎస్టీ తగ్గింపులే కాదు, నిత్యావసరాలు, పెట్రో డీజీల్ ధరలు, నిరుద్యోగితలు తగ్గి, ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరగాలి. వ్యవసాయం పండుగ కావాలి. యూరియా కొరతను రైతాంగం పట్ల నిర్లక్ష్యానికి పరాకాష్ట. వ్యవసాయ ఉత్పత్తులకు తగిన మార్కెట్‌ సౌకర్యం కూడా కలగాలి. అన్నింటి కంటే ముందు ప్రజల ఆస్తులు తెగనమ్మి ఆదాయాన్ని సమకూర్చాలన్న భావన తొలగిపోవాలి.

రాజకీయ పెత్తనం తగ్గాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ జీతభత్యాలు తగ్గించుకోవాలి. నేతలకు డబుల్‌ పెన్షన్లు తొలగించాలి. కేంద్రం, రాష్ట్రాల్లో ఖర్చులు తగ్గించు కోవాలి. పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌లో ప్రజల తిరుగుబాటుకు కారణాలు తెలుసుకుని మనదేశంలో అలాంటివి జరక్కుండా ముందు జాగ్రత్త పడాలి. చిన్న దేశాల్లో అస్థిరతకు విదేశీ హస్తం కూడా కారణం కావచ్చు. అయితే ప్రజల్లో అసంతృప్తి, అసహనం గూడుకట్టుకొని ఉండడం వల్లనే తిరుగుబాట్లు వస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో విదేశీ శక్తి కూడా తోడవుతుండవచ్చు.

ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు తన ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడినప్పుడల్లా విదేశీ హస్తం అని నిందించేవారు. ఇప్పుడు మోదీ కూడా పదేపదే కాంగ్రెస్‌ను బూచిగా చూపి తప్పించుకో జూస్తున్నారు. ప్రభుత్వాలు, అధికార వ్యవస్థలలో అవినీతి పెరిగిపోవడం వల్లే మన దేశం అభివృద్ధి చెందాల్సినంతగా చెందలేదు. రాజకీయ లాలూచీ, అవినీతి కారణంగా దేశం భ్రష్టు పట్టిపోతోంది. రాజ్యాంగబద్ధ సంస్థలలో కూడా అవినీతి చొరబడటం వల్ల సామాన్యులకు న్యాయం దొరకని దుస్థితి ఏర్పడింది.

కాళేశ్వరం, ఇ-కార్‌ రేసులో అవినీతిని నిగ్గు తేల్చడం లేదు. కేసులే అపరిష్కృతంగా ఉన్నాయంటే న్యాయ వ్యవస్థపైన, ప్రభుత్వాలపైన ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందన్నది పాలకులు ఆలోచన చేయాలి. నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం వల్ల మాత్రమే తిరుగబాటు రాలేదు. ప్రభుత్వంపై ప్రజల్లో అప్పటికే అసంతృప్తి గూడుకట్టుకొని ఉంది. ఇతర అనేక అంశాలు ఇందుకు సాకయ్యాయి.

బంగ్లాదేశ్ లో ఆ దేశ అధ్యక్షురాలి భవనంపై ప్రజలు దాడులు చేసి బెడ్‌ రూంలోనూ, స్నానాల తొట్టిలోనూ కూర్చొని ఫొటోలకు పోజులిచ్చారంటే ప్రభుత్వంపై ఎంత విరక్తి చెందారో అర్థం చేసుకోవాలి. ఆ తిరుగుబాట్ల ఫలితంగా నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాలు మారినా ప్రజల జీవితాలు మాత్రం బాగుపడలేదు. గతంలో విప్లవాలన్నీ పాలకులు అవినీతి, అక్రమాలు, నిరంకుశంపైనే వచ్చాయి. కొంతకాలంగా శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌ దేశాలలో పెల్లుబికిన ప్రజల ధర్మాగ్రహం నుంచి మన పాలకులు, రాజ్యాంగ వ్యవస్థల అధిపతులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.

మన దేశం భిన్న జాతులు, భిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషల సమాహారం కనుక, ఆ చిన్న దేశాలలో వలే తిరుగుబాట్లు జరగవని నమ్మరాదు. రైతుల ఉద్యమాన్ని తక్కువగా చూడరాదు. ఇందిరాగాంధీ వంటి శక్తిమంతమైన నేత కూడా ప్రజాగ్రహానికి గురికాక తప్పలేదు. కేంద్ర రాష్ట్రాల్లో అవినీతి విపరీతంగా పెరిగింది. లంచగొండి తనం వేళ్లూనుకుంది. పాలకులపై ప్రజలు విశ్వాసం కోల్పోతు న్నారు.
అధికారమే లక్ష్యంగా సంక్షేమం పేరిట హద్దుమీరి ప్రజా ధనాన్ని పంచి పెట్టడంపై పన్ను చెల్లింపుదారులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రజలను సోమరులుగా మార్చే పథకాలను ప్రవేశపెట్టే అధికారం రాజకీయ నాయకులకు లేదు. ప్రజాధనానికి కాపలాగా, కేర్‌ టేకర్‌గా పనిచేయాల్సిన వారు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. సామాన్యులకు న్యాయం ఎండమావిగా మారుతోంది. అధికార దుర్విని యోగం హద్దు మీరుతోంది.

ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత అటు పాలకులు, ఇటు రాజ్యాంగ వ్యవస్థల అధిపతులపై ఉంది. రాజకీయా నాయకులు తమ అతిని, అవినీతిని వదులుకుని ప్రజల కోసం, దేశం కోసం పనిచేయడం అలవాటు చేసుకోవాలి. లేకుంటే ప్రజాగ్రహం తప్పదు.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News