Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

ఆత్మస్థుతి, పరనిందలేనా? ప్రజల మాటేమిటి!?|EDITORIAL

రాజకీయాల్లో సచ్చీలత సాధ్యం కాదు. స్వచ్ఛంగానే, స్వచ్ఛందంగానే పని చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప అలా చేయడం కూడా దుస్సాధ్యం. నూటికో కోటికో ఒక్కరు అలా కనిపించినా, వారు ఇంకా బతికున్న నీతికి, నిజాయితీకి ఆఖరి గుర్తుగా మిగిలిపోతారు. రాజకీయాలను ‘రాజీ’కీయాలుగా కూడా భావించవచ్చు. ఇందులో ‘ఆత్మ స్థుతి, పర నిందే’ అధికం. రాను రాను నేరగాళ్ళు కూడా రాజకీయాల్లో చొచ్చుకురావడం, లేదా రాజకీయాల్లో ఉన్న వారే నేరాలకు పాల్పడటం రివాజుగా మారింది. అధికారం ఉన్నంత వరకు ఏదైనా చెల్లుతుంది కాబట్టి, ఇష్టానుసారంగా వ్యవహరించడం కూడా అలవాటుగా మారింది.

అధికారంతమున చూడవలె అయ్యవారల ఆగడముల్ అన్నట్లుగా పదవులు పోగానే, కొత్తగా కొలువుల్లో చేరిన వారు పాత వారి పని పట్టడం, కనీసం పట్టినట్లుగా కనిపించడం, అలా ప్రతిపక్షాలను అదికార పక్షాలు నిలువరించడం, నియంత్రించడం కూడా మామూలైపోయింది. ఈ ధోరణి కాస్తా విపరీతమైనప్పుడు శత్రు భావనలకు వెళ్ళినప్పుడు, శ్రీ కృష్ణ జన్మస్థానాలు కూడా వారికి వరంగా మారిపోవడం లేదా మార్చుకోవడం చూస్తున్నాం.

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. గతంలో మాజీ సీఎం జగన్ పై పలు కేసులు, జైలుకెళ్ళిన నేపథ్యంలో నిరంతరం అతడిని దొంగా దొంగా అంటున్నందుకు ప్రతీకారంగానో, ప్రత్యక్షంగా అవినీతితో సంబంధం ఉన్న కారణంగానో చంద్రబాబును కూడా జైలుకు పంపిన విధానాన్ని చూశాం. గతంలో ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిని అప్పట్లో అనేక కేసులు వేధించాయి. ఆయనపై 180 పై చిలుకు కేసులు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన సీఎం అయ్యాక, గత ప్రభుత్వ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు వంటి అనేక కేసులు వెలుగు చూస్తున్నాయి. వాటిల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు లాంటి వాళ్ళు నిందితులుగా ఉండటం గమనించాలి. కల్వకుంట్ల కవిత కూడా లిక్కర్ కేసులో నిందితురాలిగా జైలు జీవితం గడిపి వచ్చారు. ఇక బీజేపీ అగ్రనేతలు బీఎల్ సంతోశ్ వంటి వారు, వారి మధ్యవర్తిత్వంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర పన్నారని నమోదైన కేసులు కూడా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ ఏకంగా నిన్న మొన్నటి దాకా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆరు నెలలు కూడా నిలవదని పలికిన ప్రగల్బాలు దాదాపు ఇదే కోవలోకి వచ్చే వ్యవహారాలే.

ఇక, అధికార పక్ష, విపక్ష రాజకీయ పార్టీల విన్యాసాలు చూస్తుంటే అసహ్యంగానే అనిపిస్తుంది. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరనే సామెత వీరికి సరిపోతుంది. ఐదేళ్ల పాటు జగన్‌, పదేళ్ల పాటు కేసీఆర్‌ కుటుంబం చేసిందేంటి? ఈ రెండు కుటుంబాలు, వీరిని నమ్ముకున్న వారి సామాజిక వర్గానికి చెందిన మరికొందరు మాత్రమే బాగు పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాళ్ళ అవినీతి దోపిడీ రుజువవుతాయో లేదో కానీ, వారి పాలనలో రెండు రాష్ట్రాలు మాత్రం దివాళా తీసాయి.
ఇప్పుడా కేసులు, విచారణలు జరుగుతుండటంతో ఎదుటి పార్టీలపై రంకెలు వేస్తున్న వైనం ప్రజలకు కంపుకొడుతున్నది. మళ్లీ తమదే అధికారం మాదే ధీమా, రాజకీయాల్లో ప్రజలకు ప్రత్యామ్నాయ లోపాలను ఎత్తి చూపుతున్నది. కాంగ్రెస్ విఫలమైతే, బీజేపీకి ప్రజల్లో బలం లేదు కాబట్టి తమను ఎన్నుకోవడం తప్ప ప్రజలకు వేరే ప్రత్యామ్నాయమే లేదని బీఆర్ఎస్ దీమా. బీఆర్ఎస్ పనైపోతే, కాంగ్రెస్ ను విఫలం చేసైనా అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ పన్నాగం. ఇక ఆ రెండు పార్టీలకు దీటుగా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ అధికారం నిలుపుకోవాలన్న ఉబలాటం కాంగ్రెస్ ది. అలాగే ఏపీలో కూడా కూటమి విఫలమైతే తమదే అధికారం అన్న దీమాలో వైసీపీ ఉన్నది. కాంగ్రెస్ ఎలాగూ బలంగా లేదు కాబట్టి, జగన్ ను నిలువరిస్తే తమదే అధికారం, హవా అన్న దీమాలో అధికార కూటమి ఉంది. ఇక్కడా ప్రజలకు కూటమి, వైసీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.

ఈ ప్రజలకు ప్రత్యమ్నాయం లేని పరిస్థితులను కల్పించి మరీ, తమ అధికార దాహం తీర్చుకోవడానికి, అన్ని పార్టీలు అవే ఎత్తుగడల్లో ఉన్నాయి. అయితే ఈలోగా, ఆయా పార్టీలు అధికారం కోసం అర్రులు చాస్తూ చేసుకుంటున్న ఆరోపణలే అసహ్యంగా ఉన్నాయి. జుగుప్సాకరంగా ప్రజలకు ఏవగింపు కలిగిస్తున్నాయి. దొంగలే దొంగా దొంగా అని అరచినట్లు, తమ తప్పులేవీ ప్రజలకు తెలియవని, తెలిసినా, ఎదురుదాడులతో జనం సానుభూతి పొంది, ప్రజల్ని మోసం చేయొచ్చనే పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు వారి వారి సొంత మీడియాల్లో చేస్తున్న ప్రచారం హేయంగా కనిపిస్తోంది. కొందరు తామే అధికారంలో ఉన్నట్లుగా, మరికొందరు తమకు తప్ప పాలించే అర్హత మరెవ్వరికీ లేనట్లుగా నీచంగా మాట్లాడుతున్నారు. హద్దుపద్దు లేకుండా సోషల్ మీడియాని వాడుకుంటున్నారు.
ఇలాంటి సుద్దపూసలు సుద్దులు చెబుతున్నారు. ఆత్మ పరిశీలన ఆవగింజంతైనా ప్రదర్శించకుండా ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. అబద్దాలను అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. అధికారాన్ని నిలుపుకోవడానికి పార్టీ ఫిరాయింపులను బరితెగించి ప్రోత్సహిస్తున్నారు. అధికారం తమకు పేటెంట్ అయినట్లుగా వ్యవహరిస్తున్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే. ఏ పార్టీని ద్వేషించడమో, సమర్థించడమో కాదు కానీ, రాజకీయాల్లో కొంచెమైనా నీతి, నిజాయితీ, నిబద్ధత అవసరం. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. లేదంటే నేపాల్ పరిస్థితే ఎదురవుతుంది.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News