Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

సత్వర న్యాయానికి – తక్షణ సంస్కరణలు!|EDITORIAL

వంద మంది దోషులు తప్పించుకున్నా సరే, ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడవద్దన్నది న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రం. కానీ, న్యాయస్థానాలకు వెళ్లాల్సి వచ్చిన వాళ్ళంతా దాన్నో శిక్షగానే భావిస్తున్నారు!? ఎస్. ‘జస్టిస్ డిలేయ్డ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అంటే ఆలస్యపు న్యాయం కూడా అన్యాయం కిందే లెక్క. అనేక మంది సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ, చివరికి న్యాయాన్ని చూడకుండానే జీవితం ముగించుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య న్యాయ మూల సూత్రాలకే విరుద్ధం.

2025 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, మన దేశంలో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీం కోర్టులో 70 వేలకు పైగా, హైకోర్టులలో 60 లక్షలకు పైగా, లోయర్ కోర్టులలో నాలుగున్నర కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మామూలు క్రిమినల్ లేదా సివిల్ కేసులు మాత్రమే కాకుండా, అత్యంత కీలకమైన రాజ్యాంగ పరమైన, రాజకీయ, సామాజిక కేసులు కూడా ఉన్నాయి. వీటిలో చాలా కేసులు 10 ఏళ్లకు పైగా విచారణ కోసం నిరీక్షిస్తున్నాయి.

మన న్యాయవ్యవస్థ ఇంకా బ్రిటిష్‌ కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగానే నడవాలా? న్యాయ వ్యవస్థతో పాటు చట్టాలు, శిక్షల్లో కూడా సంస్కరణలు రావాలి కదా!? కోర్టులు కూడా తమకుతాము కాల పరిమితి విధించుకోల్సిన సమయం ఆసన్నమైంది. ఏ కేసైనా నిర్ణీత గడువులో విచారణ పూర్తి కావాలి. ఇందుకు ఏం చేయాలి? ఏ విధమైన సంస్కరణలు చేపట్టాలి?

స్థానిక భాషల్లో కోర్టు కార్యకలాపాలు సాగాలి. స్థానిక భాషల్లోనే చర్చించేలా, తీర్పులు వెలువడేలా చట్టం చేసుకోవాలి. అనేక సంస్కరణలకు పూనుకుంటున్న ప్రధాని మోదీ, న్యాయ వ్యవస్థ సంస్కరణపై పున: సమీక్షించగలరా? పూనుకోగలరా?

‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ ‘సత్వర న్యాయానికి–తక్షణ సంస్కరణలు!’

సత్వర న్యాయానికి – తక్షణ సంస్కరణలు!

భారత ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలాగే న్యాయవ్యవస్థ కూడా ప్రపంచంలోనే అతిపెద్దది. సుప్రీం కోర్టు, హైకోర్టులు, జిల్లా, ఉపకోర్టులుగా విస్తరించి ఉంది. ఇంత పెద్ద ఈ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు సత్వర న్యాయం. ‘జస్టిస్ డిలేయ్డ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అంటే ఆలస్యపు న్యాయం అన్యాయం కిందే లెక్క. అనేక మంది సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ, చివరికి న్యాయాన్ని చూడకుండానే జీవితం ముగించుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య న్యాయ మూల సూత్రాలకే విరుద్ధం.

2025 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, మన దేశంలో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీం కోర్టులో 70 వేలకు పైగా, హైకోర్టులలో 60 లక్షలకు పైగా, లోయర్ కోర్టులలో 4.5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మామూలు క్రిమినల్ లేదా సివిల్ కేసులు మాత్రమే కాకుండా, అత్యంత కీలకమైన రాజ్యాంగ పరమైన, రాజకీయ, సామాజిక కేసులు కూడా ఉన్నాయి. వీటిలో చాలా కేసులు 10 ఏళ్లకు పైగా విచారణ కోసం నిరీక్షిస్తున్నాయి. అయితే ఈ కేసులు ఆలస్యం అవడానికి ప్రధాన కారణాలు: న్యాయమూర్తుల కొరత, అధిక కేసుల భారం, పాత చట్టాలు, జఠిలమైన న్యాయ ప్రక్రియలు, ప్రాసిక్యూషన్ వ్యవస్థ బలహీనత, తరచూ వాయిదాలు. ఇక ఈ పిండింగ్ కేసుల వల్ల కోర్టుల పట్ల పౌరుల నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. ఏళ్ళ తరబడి కేసులు నడవడం వల్ల కక్షిదారులకు కాలాతీతం, ఆర్థిక భారం సంభవిస్తున్నాయి. కొందరు న్యాయాన్ని చూడకముందే మరణిస్తున్నారు.

మన న్యాయవ్యవస్థ ఇంకా బ్రిటిష్‌ కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగానే సాగుతోంది. న్యాయ వ్యవస్థతో పాటు చట్టాలు, శిక్షల్లో కూడా సంస్కరణలు రావాల్సివుంది. కోర్టులు కూడా తమకుతాము కాల పరిమితి విధించుకోల్సిన సమయం ఆసన్నమైంది. ఏ కేసైనా నిర్ణీత గడువులో విచారణ పూర్తి కావాలి. సీబీఐ, ఈడీ దాడుల కేసుల్లో కూడా సత్వర విచారణ జరగడం లేదు. ఏపీలో వివేకా హత్య కేసు ఏళ్ళుగా ఎటూ తేలకుండా మిగిలిపోయింది. దోషులూ తేలలేదు, శిక్షలూ పడలేదు. ఈ లోగా ఇలాంటి కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళు పదవులు నిర్వర్తిస్తున్నారు. అనేక ఆరోపణలున్న జగన్‌ ఐదేళ్లు బెయిల్‌ మీదే పాలన చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేసులో పరస్పర విరుద్థ తీర్పులు ఇవ్వడమే గాకుండా 17 ఏళ్లుగా కోర్టులో నానింది. చివరకు జర్నలిస్టులు మరణిస్తున్నారే తప్ప ఇంచు జాగా, ఇండ్లు సంపాదించింది లేదు. రాజకీయ నాయకుల కేసుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. వీటి సాగదీత వల్ల ప్రజల్లో భయం లేకుండా పోతున్నది.

ఇదే సందర్భంగా పెండింగ్‌ కేసులు సమస్యగా మారాయి. ఏళ్ళ తరబడి పెండింగులోని కేసులు అలాగే ఉండగా, కొత్త కేసులో ఆ జాబితాలో చేరుతున్నాయి. అవి గుట్టల్లా పేరుకుపోతున్నాయి. దీంతో భారత న్యాయ వ్యవస్థ సాధారణ ప్రజలకు దూరమవుతోంది. తమకు న్యాయం జరగదని భావిస్తున్న వారూ కోర్టులకు వెళ్లడం లేదు. కోర్టులకు వెళ్ళిన వారిలో చాలా మంది తమ జీవిత కాలంలో ఆ న్యాయాన్ని చూడలేకపోతున్నారు. తీర్పులు వచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదు.

నేటికీ ఎందరో చేయని నేరాలకు జైళ్లలో మగ్గుతున్నారు. ఇలాంటి వారిని ఎలా బయటకు తీసకుని వస్తారన్నది కూడా ముఖ్యం. పార్టీ ఫిరాయింపుల కేసులో మూడు నెలల్లో తేల్చాలని సుప్రీం ఆదేశించింది. పెద్దగా ప్రగతి లేదు. చివరకు ఎన్నికల ముందు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినా చేయగలిగేది ఏమీ లేదు. చెన్నమనేని రమేశ్ కేసు ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

స్థానిక భాషల్లో కోర్టు కార్యకలాపాలు సాగాలి. స్థానిక భాషల్లో చర్చించేలా, తీర్పులు వెలువడేలా చట్టం చేసుకోవాలి. గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తిం చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు దీని గురించి ఆలోచించాలి. పార్లమెంట్‌ వేదికగా దీనికి శాశ్వత పరిష్కారం చూపాలి.

నిజానికి కోర్టులు, రాజ్యాంగం పట్ల ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రజలను కోర్టులకు చేరువ చేయడం రాజ్యాంగ విధి కావాలి. న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించి, విశ్వాసం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందుకు ఈ-కోర్టుల వ్యవస్థను బలోపేతం చేయాలి. అత్యవసర న్యాయ సదస్సులు నిర్వహించాలి. జడ్జీలు, సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలి.

చిన్నపాటి వివాదాలు కోర్టుల దాకా రాకుండా, గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధానాలను ప్రోత్సహించాలి. అవసరం లేని చట్టాలను తొలగించి , చట్టాలను సరళీకరించాలి. ప్రాసిక్యూషన్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి. పోలీసులు, ప్రభుత్వ న్యాయవాదులు మరింత సమర్థంగా పని చేయడానికి శిక్షణ, వనరుల కల్పన అవసరం. ఇలా పలు అంశాలపై అవసరమై అధ్యయనాలు జరిపి, ప్రజలు న్యాయ వ్యవస్థను చేరువ చేయాలి. సత్వరమే న్యాయం అందేలా చట్టాలు రూపొందించి, న్యాయవ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News